సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగా ఉండిపోవాలని అనుకోవట్లేదు. తన బ్రాండ్ వాల్యూను ఉపయోగించుకుని ఇబ్బడిముబ్బడిగా యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్న మహేష్.. ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా నిర్మాతగానూ మారాడు. తన సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడితో సరిపెట్టకుండా వేరే హీరోల్ని పెట్టి సినిమాలను నిర్మించే పని కూడా మొదులపెట్టాడు.
క్షణం, గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్లతో మంచి స్థాయిని అందుకున్న అడివి శేష్ను పెట్టి ‘మేజర్’ అనే సినిమాను మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2008 ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.
దీని తర్వాత మహేష్ మరో యువ కథానాయకుడితో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. శర్వానంద్. లాక్ డౌన్ టైంలో మహేష్ చాలా కథలు వినగా.. అందులో ఒక మీడియం రేంజ్ సినిమా తీయగల కథ మహేష్కు బాగా నచ్చిందని.. ఆ కథకు శర్వానంద్ అయితే బాగుంటుందని మహేష్ ఫీలయ్యాడని సన్నిహిత వర్గాల సమాచారం.
శర్వాను అడిగారా.. అతను ఓక అన్నాడా లేదా అనే విషయాలపై స్పష్టత లేదు. మహేష్ అడిగితే అతను కాదనే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ సినిమా ఓకే అయ్యే అవకాశమే ఉందని అంటున్నారు. మళ్లీ షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యే సమయానికి ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక శర్వా విషయానికి వస్తే.. గత కొన్నేళ్లలో సరైన సినిమా పడక అతను కొంచెం వెనుకబడి ఉన్నాడు. అతడి కొత్త చిత్రం ‘శ్రీకారం’ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
This post was last modified on June 26, 2020 10:01 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…