Movie News

శర్వాతో మహేష్ సినిమా?

సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగా ఉండిపోవాలని అనుకోవట్లేదు. తన బ్రాండ్ వాల్యూను ఉపయోగించుకుని ఇబ్బడిముబ్బడిగా యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్న మహేష్.. ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా నిర్మాతగానూ మారాడు. తన సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడితో సరిపెట్టకుండా వేరే హీరోల్ని పెట్టి సినిమాలను నిర్మించే పని కూడా మొదులపెట్టాడు.

క్షణం, గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్లతో మంచి స్థాయిని అందుకున్న అడివి శేష్‌ను పెట్టి ‘మేజర్’ అనే సినిమాను మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2008 ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.

దీని తర్వాత మహేష్ మరో యువ కథానాయకుడితో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. శర్వానంద్. లాక్ డౌన్ టైంలో మహేష్ చాలా కథలు వినగా.. అందులో ఒక మీడియం రేంజ్ సినిమా తీయగల కథ మహేష్‌కు బాగా నచ్చిందని.. ఆ కథకు శర్వానంద్ అయితే బాగుంటుందని మహేష్ ఫీలయ్యాడని సన్నిహిత వర్గాల సమాచారం.

శర్వాను అడిగారా.. అతను ఓక అన్నాడా లేదా అనే విషయాలపై స్పష్టత లేదు. మహేష్ అడిగితే అతను కాదనే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ సినిమా ఓకే అయ్యే అవకాశమే ఉందని అంటున్నారు. మళ్లీ షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యే సమయానికి ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక శర్వా విషయానికి వస్తే.. గత కొన్నేళ్లలో సరైన సినిమా పడక అతను కొంచెం వెనుకబడి ఉన్నాడు. అతడి కొత్త చిత్రం ‘శ్రీకారం’ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

This post was last modified on June 26, 2020 10:01 am

Share
Show comments
Published by
Satya
Tags: Mahesh Babu

Recent Posts

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…

49 minutes ago

ఆ ఇద్దరు ఓకే అంటే సాయిరెడ్డి సేఫేనా?

ఏ పార్టీతో అయితే రాజకీయం మొదలుపెట్డారో… అదే పార్టీకి రాజీనామా చేసి, ఏకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన మాజీ ఎంపీ…

2 hours ago

బర్త్ డే కోసం ఫ్యామిలీతో ఫారిన్ కు చంద్రబాబు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీ వెళ్లనున్న…

3 hours ago

విశాఖ‌కు మ‌హ‌ర్ద‌శ‌.. ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు!

ప్ర‌స్తుతం ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌ప‌ట్నానికి మ‌హ‌ర్ద‌శ ప‌ట్ట‌నుంది. తాజాగా విశాఖ‌ప‌ట్నానికి సంబంధించిన అనేక కీల‌క ప్రాజెక్టుల‌కు చంద్ర‌బాబు నేతృత్వంలోని…

7 hours ago

‘ఇది సరిపోదు.. వైసీపీని తిప్పికొట్టాల్సిందే’

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది.…

10 hours ago

అతి చెత్త స్కోరుతో గెలిచి చూపించిన పంజాబ్

ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని…

10 hours ago