సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగా ఉండిపోవాలని అనుకోవట్లేదు. తన బ్రాండ్ వాల్యూను ఉపయోగించుకుని ఇబ్బడిముబ్బడిగా యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్న మహేష్.. ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా నిర్మాతగానూ మారాడు. తన సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడితో సరిపెట్టకుండా వేరే హీరోల్ని పెట్టి సినిమాలను నిర్మించే పని కూడా మొదులపెట్టాడు.
క్షణం, గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్లతో మంచి స్థాయిని అందుకున్న అడివి శేష్ను పెట్టి ‘మేజర్’ అనే సినిమాను మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2008 ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.
దీని తర్వాత మహేష్ మరో యువ కథానాయకుడితో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. శర్వానంద్. లాక్ డౌన్ టైంలో మహేష్ చాలా కథలు వినగా.. అందులో ఒక మీడియం రేంజ్ సినిమా తీయగల కథ మహేష్కు బాగా నచ్చిందని.. ఆ కథకు శర్వానంద్ అయితే బాగుంటుందని మహేష్ ఫీలయ్యాడని సన్నిహిత వర్గాల సమాచారం.
శర్వాను అడిగారా.. అతను ఓక అన్నాడా లేదా అనే విషయాలపై స్పష్టత లేదు. మహేష్ అడిగితే అతను కాదనే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ సినిమా ఓకే అయ్యే అవకాశమే ఉందని అంటున్నారు. మళ్లీ షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యే సమయానికి ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక శర్వా విషయానికి వస్తే.. గత కొన్నేళ్లలో సరైన సినిమా పడక అతను కొంచెం వెనుకబడి ఉన్నాడు. అతడి కొత్త చిత్రం ‘శ్రీకారం’ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
This post was last modified on June 26, 2020 10:01 am
‘పవన్ కళ్యాణ్, చిరంజీవికి రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు కావొచ్చు.. కానీ, నేనూ ఆయనకి చెల్లెల్నే.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం…
మీ భూమి మీది కాదు.! ఈ మాట ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ విన్నా చర్చనీయాంశమవుతోన్న మాట.! వైఎస్…
సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలో మురుగదాస్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ సినిమాల్లో కూడా వైవిధ్యం చూపిస్తూ.. అదే సమయంలో మాస్ను ఉర్రూతలూగిస్తూ…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో భారీ చిత్రాలతో ఒక వెలుగు వెలిగిన నిర్మాత ఎ.ఎం.రత్నం. సూర్య మూవీస్ బేనర్ మీద ‘ఖుషి’ సహా…
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా పాటల గొప్పదనం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సంగీతాభిమానులు ఆయన్ని దేవుడిలా కొలుస్తారు.…
కూటమి అధికారంలోకి రాగానే.. తాను చేసే తొలి సంతకం.. మెగా డీఎస్సీపైనేనని.. దీనివల్ల 20 వేల మంది నిరుద్యోగులకు మేలు…