సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం హీరోగా ఉండిపోవాలని అనుకోవట్లేదు. తన బ్రాండ్ వాల్యూను ఉపయోగించుకుని ఇబ్బడిముబ్బడిగా యాడ్స్ చేస్తూ భారీగా సంపాదిస్తున్న మహేష్.. ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా నిర్మాతగానూ మారాడు. తన సినిమాల్లో ఆయన నిర్మాణ భాగస్వామిగా ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడితో సరిపెట్టకుండా వేరే హీరోల్ని పెట్టి సినిమాలను నిర్మించే పని కూడా మొదులపెట్టాడు.
క్షణం, గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్లతో మంచి స్థాయిని అందుకున్న అడివి శేష్ను పెట్టి ‘మేజర్’ అనే సినిమాను మహేష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2008 ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నాడు.
దీని తర్వాత మహేష్ మరో యువ కథానాయకుడితో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆ హీరో మరెవరో కాదు.. శర్వానంద్. లాక్ డౌన్ టైంలో మహేష్ చాలా కథలు వినగా.. అందులో ఒక మీడియం రేంజ్ సినిమా తీయగల కథ మహేష్కు బాగా నచ్చిందని.. ఆ కథకు శర్వానంద్ అయితే బాగుంటుందని మహేష్ ఫీలయ్యాడని సన్నిహిత వర్గాల సమాచారం.
శర్వాను అడిగారా.. అతను ఓక అన్నాడా లేదా అనే విషయాలపై స్పష్టత లేదు. మహేష్ అడిగితే అతను కాదనే అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ సినిమా ఓకే అయ్యే అవకాశమే ఉందని అంటున్నారు. మళ్లీ షూటింగ్స్ పున:ప్రారంభం అయ్యే సమయానికి ఈ ప్రాజెక్టు గురించి ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇక శర్వా విషయానికి వస్తే.. గత కొన్నేళ్లలో సరైన సినిమా పడక అతను కొంచెం వెనుకబడి ఉన్నాడు. అతడి కొత్త చిత్రం ‘శ్రీకారం’ చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.
This post was last modified on June 26, 2020 10:01 am
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…