వచ్చే జూన్ 3 విడుదల కాబోతున్న పృథ్విరాజ్ మీద చెప్పుకునే హైప్ ఏర్పడకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తోంది. యష్ రాజ్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ ప్యాన్ ఇండియా మూవీని హిందీతో పాటు తెలుగు తమిళం మలయాళంలో డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టినప్పుడు దాని గురించి సగటు మూవీ లవర్స్ మాట్లాడుకునేలా ప్రమోషన్ చేయాలి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ జరగాలి. అసలాంటిదేమీ లేదు. చేతిలో పది రోజులే ఉందన్న ధ్యాస లేకుండా ఉంది టీమ్.
స్టార్ హీరో ఉన్నా ఇలా జరగడం ఆశ్చర్యం కలిగించేదే. విశ్లేషకుల కోణం నుంచి చూస్తే కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అక్షయ్ కుమార్ అంత పవర్ ఫుల్ పృథ్విరాజ్ క్యారెక్టర్ కి సరితూగలేదని సాధారణ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ క్వాలిటీ కంటెంట్ చూసుకోకుండా వరసబెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్న అక్షయ్ కుమార్ ఈ మధ్య గట్టి దెబ్బలే తింటున్నాడు. ఒక్క సూర్యవంశీ మినహాయిస్తే బెల్ బాటమ్, బచ్చన్ పాండే కనీసం బ్రేక్ ఈవెన్ అందుకోలేని డిజాస్టర్స్ అయ్యాయి.
ఇలా చూసుకుంటే మేజర్ టీమ్ వేసిన ఎత్తుగడ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మెయిన్ రిలీజ్ కు తొమ్మిది రోజుల ముందు మొదలుపెట్టిన ప్రీ రిలీజ్ ప్రీమియర్స్ కు పూణే, అహ్మదాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో అద్భుతమైన స్పందన దక్కుతోంది టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోతున్నాయి. సెన్సార్ సభ్యుల ప్రశంసలను టీమ్ ప్రత్యేకంగా ప్రమోట్ చేసుకుంటోంది. మరోవైపు కమల్ హాసన్ విక్రమ్ బృందం పబ్లిసిటీ వేగం పెంచింది. మరి ఇంత ఒత్తిడి మధ్య పృథ్విరాజ్ నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on May 25, 2022 11:24 am
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన…
ఐపీఎల్లో రికార్డు స్థాయిలో ఐదు ట్రోఫీలు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్. కానీ ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తోంది.…
డైలాగ్ కింగ్ మంచు మోహన్బాబు ఇంట్లో ఇటీవల కాలంలో పలు రగడలు తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. ఆస్తుల వివాదాలు…
మొదటిసారి విడుదలైనప్పుడు ఫ్లాప్ అనిపించుకుని ఏళ్ళు గడిచేకొద్దీ కల్ట్ ముద్రతో రీ రిలీజులు సూపర్ హిట్ కావడం ఈ మధ్య…
కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (ఏఐసీసీ) సమావేశాలు గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న సంగతి…