కెరీర్ మంచి ఊపులో ఉండగానే హీరోయిన్లు రిలేషన్షిప్లోకి వెళ్లడం తక్కువ. ఒకవేళ వెళ్లినా.. దాన్ని బహిరంగ పరచడానికి ఇష్టపడరు. దాని వల్ల కెరీర్కు నష్టమే అని భావిస్తారు చాలామంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. వివిధ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ, ఇంకా చాలా కెరీర్ ఉండగానే ఆమె ప్రేమ బంధంలోకి వెళ్లింది.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ఆమె గత ఏడాది ప్రేమలో పడటం తెలిసిందే. అంతే కాక దాని గురించి అందరికీ ఓపెన్గానే చెప్పేసింది. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వివరించింది రకుల్.
జాకీ, నేను ముందు మంచి స్నేహితులయ్యాం. మా అభిరుచులు కలవడంతో ప్రేమికులుగా మారాం. రిలేషన్షిప్ ఓకే అయినపుడే.. ఈ బంధం గురించి దాచి పెట్టొద్దని, సాధ్యమైనంత త్వరగా దీని గురించి అందరికీ చెప్పేయాలని ఫిక్సయ్యాం. మా బంధం గురించి బయటికి చెప్పకుంటే.. జరిగే అసత్య ప్రచారాలు, వచ్చే ఊహాగానాలను తట్టుకోవడం కష్టం. ప్రశాంతత ఉండదు. మా వ్యక్తిగత జీవితం కంటే మా పని గురించి అందరూ మాట్లాడుకోవాలని అనుకున్నాం. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలాగే ప్రేమ బంధంలో ఉండటం కూడా సహజం. మన జీవితాల్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు ఎలా ఉంటారో.. మన జీవిత భాగస్వామిగానూ ఒక వ్యక్తి ఉంటారు.
సెలబ్రెటీలు కావడం వల్ల అందరూ మా వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టిపెడతారు. అది మాకిష్టం లేదు. అందుకే మా గురించి అందరికీ ఓపెన్గా చెప్పేశాం అని రకుల్ తెలిపింది. మరి జాకీతో ఎప్పుడు వివాహ బంధంలోకి వెళ్లబోయేది రకుల్ ఇంకా వెల్లడించలేదు. చివరగా రకుల్ తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. హిందీలో ఇటీవలే రన్ వే 34 చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఐతే ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు.
This post was last modified on May 24, 2022 9:14 am
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…