కెరీర్ మంచి ఊపులో ఉండగానే హీరోయిన్లు రిలేషన్షిప్లోకి వెళ్లడం తక్కువ. ఒకవేళ వెళ్లినా.. దాన్ని బహిరంగ పరచడానికి ఇష్టపడరు. దాని వల్ల కెరీర్కు నష్టమే అని భావిస్తారు చాలామంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. వివిధ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ, ఇంకా చాలా కెరీర్ ఉండగానే ఆమె ప్రేమ బంధంలోకి వెళ్లింది.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ఆమె గత ఏడాది ప్రేమలో పడటం తెలిసిందే. అంతే కాక దాని గురించి అందరికీ ఓపెన్గానే చెప్పేసింది. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వివరించింది రకుల్.
జాకీ, నేను ముందు మంచి స్నేహితులయ్యాం. మా అభిరుచులు కలవడంతో ప్రేమికులుగా మారాం. రిలేషన్షిప్ ఓకే అయినపుడే.. ఈ బంధం గురించి దాచి పెట్టొద్దని, సాధ్యమైనంత త్వరగా దీని గురించి అందరికీ చెప్పేయాలని ఫిక్సయ్యాం. మా బంధం గురించి బయటికి చెప్పకుంటే.. జరిగే అసత్య ప్రచారాలు, వచ్చే ఊహాగానాలను తట్టుకోవడం కష్టం. ప్రశాంతత ఉండదు. మా వ్యక్తిగత జీవితం కంటే మా పని గురించి అందరూ మాట్లాడుకోవాలని అనుకున్నాం. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలాగే ప్రేమ బంధంలో ఉండటం కూడా సహజం. మన జీవితాల్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు ఎలా ఉంటారో.. మన జీవిత భాగస్వామిగానూ ఒక వ్యక్తి ఉంటారు.
సెలబ్రెటీలు కావడం వల్ల అందరూ మా వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టిపెడతారు. అది మాకిష్టం లేదు. అందుకే మా గురించి అందరికీ ఓపెన్గా చెప్పేశాం అని రకుల్ తెలిపింది. మరి జాకీతో ఎప్పుడు వివాహ బంధంలోకి వెళ్లబోయేది రకుల్ ఇంకా వెల్లడించలేదు. చివరగా రకుల్ తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. హిందీలో ఇటీవలే రన్ వే 34 చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఐతే ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు.
This post was last modified on May 24, 2022 9:14 am
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…
అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…
టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…
వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…