కెరీర్ మంచి ఊపులో ఉండగానే హీరోయిన్లు రిలేషన్షిప్లోకి వెళ్లడం తక్కువ. ఒకవేళ వెళ్లినా.. దాన్ని బహిరంగ పరచడానికి ఇష్టపడరు. దాని వల్ల కెరీర్కు నష్టమే అని భావిస్తారు చాలామంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. వివిధ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ, ఇంకా చాలా కెరీర్ ఉండగానే ఆమె ప్రేమ బంధంలోకి వెళ్లింది.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ఆమె గత ఏడాది ప్రేమలో పడటం తెలిసిందే. అంతే కాక దాని గురించి అందరికీ ఓపెన్గానే చెప్పేసింది. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వివరించింది రకుల్.
జాకీ, నేను ముందు మంచి స్నేహితులయ్యాం. మా అభిరుచులు కలవడంతో ప్రేమికులుగా మారాం. రిలేషన్షిప్ ఓకే అయినపుడే.. ఈ బంధం గురించి దాచి పెట్టొద్దని, సాధ్యమైనంత త్వరగా దీని గురించి అందరికీ చెప్పేయాలని ఫిక్సయ్యాం. మా బంధం గురించి బయటికి చెప్పకుంటే.. జరిగే అసత్య ప్రచారాలు, వచ్చే ఊహాగానాలను తట్టుకోవడం కష్టం. ప్రశాంతత ఉండదు. మా వ్యక్తిగత జీవితం కంటే మా పని గురించి అందరూ మాట్లాడుకోవాలని అనుకున్నాం. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలాగే ప్రేమ బంధంలో ఉండటం కూడా సహజం. మన జీవితాల్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు ఎలా ఉంటారో.. మన జీవిత భాగస్వామిగానూ ఒక వ్యక్తి ఉంటారు.
సెలబ్రెటీలు కావడం వల్ల అందరూ మా వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టిపెడతారు. అది మాకిష్టం లేదు. అందుకే మా గురించి అందరికీ ఓపెన్గా చెప్పేశాం అని రకుల్ తెలిపింది. మరి జాకీతో ఎప్పుడు వివాహ బంధంలోకి వెళ్లబోయేది రకుల్ ఇంకా వెల్లడించలేదు. చివరగా రకుల్ తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. హిందీలో ఇటీవలే రన్ వే 34 చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఐతే ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు.
This post was last modified on May 24, 2022 9:14 am
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు…
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ…
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై…
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్…
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా…