కెరీర్ మంచి ఊపులో ఉండగానే హీరోయిన్లు రిలేషన్షిప్లోకి వెళ్లడం తక్కువ. ఒకవేళ వెళ్లినా.. దాన్ని బహిరంగ పరచడానికి ఇష్టపడరు. దాని వల్ల కెరీర్కు నష్టమే అని భావిస్తారు చాలామంది. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. వివిధ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ, ఇంకా చాలా కెరీర్ ఉండగానే ఆమె ప్రేమ బంధంలోకి వెళ్లింది.
బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ఆమె గత ఏడాది ప్రేమలో పడటం తెలిసిందే. అంతే కాక దాని గురించి అందరికీ ఓపెన్గానే చెప్పేసింది. ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఐతే ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో వివరించింది రకుల్.
జాకీ, నేను ముందు మంచి స్నేహితులయ్యాం. మా అభిరుచులు కలవడంతో ప్రేమికులుగా మారాం. రిలేషన్షిప్ ఓకే అయినపుడే.. ఈ బంధం గురించి దాచి పెట్టొద్దని, సాధ్యమైనంత త్వరగా దీని గురించి అందరికీ చెప్పేయాలని ఫిక్సయ్యాం. మా బంధం గురించి బయటికి చెప్పకుంటే.. జరిగే అసత్య ప్రచారాలు, వచ్చే ఊహాగానాలను తట్టుకోవడం కష్టం. ప్రశాంతత ఉండదు. మా వ్యక్తిగత జీవితం కంటే మా పని గురించి అందరూ మాట్లాడుకోవాలని అనుకున్నాం. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. అలాగే ప్రేమ బంధంలో ఉండటం కూడా సహజం. మన జీవితాల్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు ఎలా ఉంటారో.. మన జీవిత భాగస్వామిగానూ ఒక వ్యక్తి ఉంటారు.
సెలబ్రెటీలు కావడం వల్ల అందరూ మా వ్యక్తిగత జీవితంపై ఎక్కువ దృష్టిపెడతారు. అది మాకిష్టం లేదు. అందుకే మా గురించి అందరికీ ఓపెన్గా చెప్పేశాం అని రకుల్ తెలిపింది. మరి జాకీతో ఎప్పుడు వివాహ బంధంలోకి వెళ్లబోయేది రకుల్ ఇంకా వెల్లడించలేదు. చివరగా రకుల్ తెలుగులో కొండపొలం సినిమాలో నటించింది. హిందీలో ఇటీవలే రన్ వే 34 చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. ఐతే ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు.
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…
సింగ్ గీతంని విష్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ తన మిత్రుడు రామ్ చరణ్ పెద్దికి మాత్రం ఎలాంటి ట్వీట్ వేయకపోవడం…