యూట్యూబ్లోకి వెళ్లి త్రివిక్రమ్ స్పీచ్ అని కొట్టగానే.. మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్న స్పీచ్లు వరుసగా ప్రత్యక్షమవుతాయి. అందులో టాప్లో కనిపించేవి మా టీవీ అవార్డుల వేడుకలో సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్ తాలూకు వీడియోలే. సీతారామశాస్త్రి మీద తనకున్న అభిమానాన్నంతా చూపిస్తూ.. తన సాహిత్యాభిరుచిని, భాషమీద పట్టును చాటుకుంటూ మాటల మాంత్రికుడు చేసిన ఆరు నిమిషాల ప్రసంగం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాతి కాలంలో అది కల్ట్ స్పీచ్గా మారిపోయింది.
ఆ ఆరు నిమిషాల్లో త్రివిక్రమ్ మాట్లాడిన కొన్ని మాటలు అలాగే జనాల గుండెల్లో ముద్ర వేసుకున్నాయి. అక్కడ స్పేస్ లేదు, కానీ ఆయన తీసుకున్నారు.. లాంటి మాటలు మీమ్స్కు కంటెంట్గా మారిపోవడం విశేషం. ఐతే త్రివిక్రమ్ ఎప్పుడు వేదిక ఎక్కినా గొప్పగానే మాట్లాడుతుంటాడు కానీ.. మళ్లీ ఆ స్థాయి స్పీచ్ మాత్రం ఇవ్వలేదు.
కాగా మరోసారి సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూనే ఆ స్థాయి స్పీచ్ను డెలివర్ చేశారు త్రివిక్రమ్. తాజాగా సీతారామశాస్త్రి జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో త్రివిక్రమ్ ఆయనపై తనకున్న అభిమానాన్ని, భక్తిని, ప్రేమను మరోసారి చాటి చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ స్పీచ్.. లేటుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీతారామశాస్త్రితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. పాట కోసం ఆయన పడే తపనను, అర్ధరాత్రి వేళ ఒక మంచి లైన్ రాస్తే దాని గురించి తనకు ఫోన్ చెబుతూ ఎగ్జైట్ అయ్యే తీరును.. ఇలా చాలా విషయాలను అద్భుతంగా చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. సీతారామశాస్త్రితో తనకు రకరకాల విషయాల్లో వాదనలు జరిగేవని.. ఇద్దరూ గట్టిగా మాట్లాడుకునేవాళ్లమని.. ఐతే తన లాంటి వాడికి వాదించే అవకాశం ఇవ్వడం ఆయన గొప్పదనమని త్రివిక్రమ్ అన్నాడు.
సీతారామశాస్త్రి లేకున్నా.. ఆయన పదాలు తిరుగాడుతూనే ఉంటాయని, మన మీద ఎప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉంటాయని ఆయన పేర్కొన్నాడు. త్రివిక్రమ్ స్పీచ్ను మాటల్లో రాయడం కంటే.. వీడియో రూపంలో చూస్తే దాని ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది. సీతారామశాస్త్రి అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసేలా ఉన్న ఈ స్పీచ్ కూడా కాలక్రమంలో ఇది కూడా ఒక కల్ట్ స్టేటస్ తెచ్చుకునే అవకాశాలున్నాయి.
This post was last modified on May 22, 2022 7:45 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…