యూట్యూబ్లోకి వెళ్లి త్రివిక్రమ్ స్పీచ్ అని కొట్టగానే.. మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్న స్పీచ్లు వరుసగా ప్రత్యక్షమవుతాయి. అందులో టాప్లో కనిపించేవి మా టీవీ అవార్డుల వేడుకలో సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్ తాలూకు వీడియోలే. సీతారామశాస్త్రి మీద తనకున్న అభిమానాన్నంతా చూపిస్తూ.. తన సాహిత్యాభిరుచిని, భాషమీద పట్టును చాటుకుంటూ మాటల మాంత్రికుడు చేసిన ఆరు నిమిషాల ప్రసంగం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఆ తర్వాతి కాలంలో అది కల్ట్ స్పీచ్గా మారిపోయింది.
ఆ ఆరు నిమిషాల్లో త్రివిక్రమ్ మాట్లాడిన కొన్ని మాటలు అలాగే జనాల గుండెల్లో ముద్ర వేసుకున్నాయి. అక్కడ స్పేస్ లేదు, కానీ ఆయన తీసుకున్నారు.. లాంటి మాటలు మీమ్స్కు కంటెంట్గా మారిపోవడం విశేషం. ఐతే త్రివిక్రమ్ ఎప్పుడు వేదిక ఎక్కినా గొప్పగానే మాట్లాడుతుంటాడు కానీ.. మళ్లీ ఆ స్థాయి స్పీచ్ మాత్రం ఇవ్వలేదు.
కాగా మరోసారి సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూనే ఆ స్థాయి స్పీచ్ను డెలివర్ చేశారు త్రివిక్రమ్. తాజాగా సీతారామశాస్త్రి జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో త్రివిక్రమ్ ఆయనపై తనకున్న అభిమానాన్ని, భక్తిని, ప్రేమను మరోసారి చాటి చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ స్పీచ్.. లేటుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీతారామశాస్త్రితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. పాట కోసం ఆయన పడే తపనను, అర్ధరాత్రి వేళ ఒక మంచి లైన్ రాస్తే దాని గురించి తనకు ఫోన్ చెబుతూ ఎగ్జైట్ అయ్యే తీరును.. ఇలా చాలా విషయాలను అద్భుతంగా చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. సీతారామశాస్త్రితో తనకు రకరకాల విషయాల్లో వాదనలు జరిగేవని.. ఇద్దరూ గట్టిగా మాట్లాడుకునేవాళ్లమని.. ఐతే తన లాంటి వాడికి వాదించే అవకాశం ఇవ్వడం ఆయన గొప్పదనమని త్రివిక్రమ్ అన్నాడు.
సీతారామశాస్త్రి లేకున్నా.. ఆయన పదాలు తిరుగాడుతూనే ఉంటాయని, మన మీద ఎప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉంటాయని ఆయన పేర్కొన్నాడు. త్రివిక్రమ్ స్పీచ్ను మాటల్లో రాయడం కంటే.. వీడియో రూపంలో చూస్తే దాని ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది. సీతారామశాస్త్రి అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేసేలా ఉన్న ఈ స్పీచ్ కూడా కాలక్రమంలో ఇది కూడా ఒక కల్ట్ స్టేటస్ తెచ్చుకునే అవకాశాలున్నాయి.
This post was last modified on May 22, 2022 7:45 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…