సెలబ్రిటీలు ఏ చిన్న పొరపాటు చేస్తారని ఎదురు చూస్తున్న బ్యాచ్ ఒకటి సోషల్ మీడియాలో ఎదురు చూస్తూనే ఉంటుంది. దొరకడం ఆలస్యం ఇదుగో పులి అదిగో తోక తరహా రకరకాల కథనాలు వండి వార్చేస్తుంది. ఇప్పుడు రాజమౌళి దొరికారు. నిన్న మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో పెద్ద హంగామా జరిగింది. అభిమానులు రకరకాల రూపాల్లో తమ ప్రేమను ప్రదర్శించారు. విదేశాల్లో ఆది స్పెషల్ షోలు వేసుకుని మురిసిపోయారు. ఇక్కడ నంద్యాల కడపలోనూ ప్రత్యేకంగా ప్రీమియర్లు పడ్డాయి.
ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎందరో ప్రత్యేకంగా విష్ చేశారు. రామ్ చరణ్ కూడా తమ బాండింగ్ ఎంత గొప్పదో ఒక ఫోటో, కొన్ని మాటల రూపంలో గొప్పగా వర్ణించాడు. అయితే జక్కన్న ట్వీట్ మాత్రం కనిపించలేదు. అంతే ఇద్దరికీ ఏదో చెడిందని, తారక్ కన్నా చరణ్ ఎక్కువగా ఆర్ఆర్ఆర్ లో హై లైట్ అయ్యాడని, దీంతో అభిమానుల ఆగ్రహాన్ని పరిగణనలోకి తీసుకుని జూనియర్ అప్పటి నుంచి కొంత దూరం మైంటైన్ చేస్తున్నాడని ఇలా ఏవేవో ప్రచారాలు మొదలైపోయాయి. కానీ ఇక్కడ వాళ్ళు మిస్ అవుతున్నవి కొన్ని ఉన్నాయి.
రాజమౌళికి ఏ హీరోకు లేనంత బాండింగ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఉంది. అందులోనూ తన మొదటి సినిమా హీరోగా ఆ గౌరవం ఎప్పటికీ ఉంటుంది. ఈ కారణంగానే ఈ కాంబినేషన్ లో నాలుగు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. ప్యాన్ ఇండియా మార్కెట్ ఇచ్చిన ప్రభాస్ తో చేసింది మూడే. పైగా ట్రిపులార్ ప్రమోషన్స్ లో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నారో అందరూ చూశారు. జక్కన్న ట్విట్టర్ లో చివరిసారి యాక్టివ్ గా ఉన్నది ఆరు రోజుల క్రితం. అది కూడా థామస్ కప్ గెలిచిన బ్యాడ్ మింటన్ టీమ్ ని విష్ చేయడానికి. నిన్న ఆర్ఆర్ఆర్ ఓటిటి గ్రాండ్ ప్రీమియర్ కు సైతం ఎలాంటి ట్వీట్ వేయలేదు. ఏదో కారణం వల్ల అందుబాటులో లేరనే చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా?
This post was last modified on May 22, 2022 7:33 am
తెలుగు దేశం పార్టీ నిర్వహించే పసుపు పండుగ మహానాడుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా కడపలో…
సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే త్రివిక్రమ్కు ఎంత అభిమానమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినీ వేడుకలో ఆయన సిరివెన్నెల గురించి…
హరిహర వీరమల్లు షూటింగ్ కు ముగింపుకొచ్చేసింది. సెట్స్ లో నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో టీమ్ ఉత్సహంగా…
కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్(ఈడీ) పై సుప్రీంకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.…
కూటమి ప్రభుత్వం 11 మాసాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం ఏం చేసిందన్న విషయంపై చర్చ జరుగుతుంది. అయితే..…
"మీ మీ బ్యాంకు ఖాతాలను మరోసారి అప్ డేట్ చేసుకోండి" అంటూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్న దాతలకు సూచించింది.…