గత వారం విడుదలై సెకండ్ వీక్ లో అడుగు పెట్టిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ రేంజ్ లో కలెక్షన్లు కాదు కానీ ప్రధాన కేంద్రాల్లో మంచి ఆక్యుపెన్సీలతో రెవిన్యూ వస్తోంది. యూనిట్ అధికారికంగా చెబుతున్న దాన్ని బట్టి మొన్నే 160 కోట్ల గ్రాస్ ని టచ్ చేసిన సర్కారు రెండు వందల కోట్లను చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. సరే ఈ లెక్కలు గట్రా పక్కన పెడితే కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా మహేష్ బాబు మూవీకి ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని సోసో టాక్ తెచ్చుకున్నాయి.
రాజశేఖర్ హీరోగా రూపొందిన మలయాళం జోసెఫ్ రీమేక్ శేఖర్ కు ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు. చాలా చోట్ల డెఫిసిట్లు పడ్డాయని ట్రేడ్ రిపోర్ట్. సినిమా కూడా ఏమంత చెప్పుకోదగ్గ స్థాయిలో లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రేపు ఎల్లుండి వీకెండ్లో ఎంత రాబట్టుకుంటే అంత సేఫ్ అవుతుంది. ఇక బండ్ల గణేష్ డేగల బాబ్జీని ఎవరూ పట్టించుకోలేదు. ధ్వని అనే మరో చిన్న చిత్రం వచ్చిన సంగతే ఎవరికీ తెలియదు. బాలీవుడ్ మూవీ భూల్ భులయ్య 2కి తెలుగు రాష్ట్రాల్లో ఏమంత రెస్పాన్స్ రాలేదు. నార్త్ లో బాగా వెళ్తోందని ట్రేడ్ రిపోర్ట్.
ఇక కంగనా రౌనత్ దాకడ్ ని క్రిటిక్స్ ఫ్లాప్ అని తేల్చేశారు.హైదరాబాద్ లోనూ జనం లేక షోలు రద్దయ్యాయి. సో సర్కారు వారి పాటనే ఆడియన్స్ కి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అనూహ్యంగా శివ కార్తికేయన్ డాన్ పుంజుకోవడం విశేషం. ముఖ్యంగా యూత్ నుంచి మంచి అక్యుపెన్సీ వస్తోంది. రేపో ఎల్లుండో బ్రేక్ ఈవెన్ చేరుకోవడం లాంఛనమే. శని ఆదివారాలు ఎంజాయ్ చేయడానికి ఇప్పుడు సర్కారు వారి పాట, డాన్ తప్ప వేరే ఆప్షన్స్ లేవు. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 ఓటిటిలో వచ్చేశాయి కాబట్టి ఫైనల్ రన్ అయినట్టే.
This post was last modified on May 21, 2022 6:42 am
కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…
మే నెల వచ్చిందంటే నందమూరి అభిమానుల ఉత్సాహం మామూలుగా ఉండదు. లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆరే కాక ఆయన మనవడు జూనియర్…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఇప్పుడప్పుడే కోలుకునేలా కనిపించడం లేదనే చెప్పాలి. అప్పటిదాకా 151 సీట్లతో…
భారత్-పాకిస్థాన్ ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఏ క్షణమైనా యుద్ధానికి దారితీయొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతు న్న సమయంలో…