ఎన్టీఆర్ నెక్స్ట్ కొరటాల శివతో అలాగే ప్రశాంత్ నీల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్స్ వచ్చేశాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని ఫ్యాన్స్ కి ఆ సినిమాల అప్ డేట్స్ పోస్టర్స్ తో అందింది. అయితే తారక్ లైనప్ లో ఉన్న బుచ్చిబాబు సినిమా గురించి మాత్రం ఎలాంటి అప్ డేట్ రాలేదు. దీంతో అసలు ఈ కాంబో సినిమా ఉంటుందా లేదా ఇది జస్ట్ బజ్ వరకేనా అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి.
ఈ కాంబోలో సినిమా అయితే ఉంది. ‘ఉప్పెన’ రిలీజ్ అవ్వగానే ఎన్టీఆర్ కి లైన్ చెప్పి సినిమా లాక్ చేసుకున్నాడు బుచ్చిబాబు. రెండు మూడు నెరేషన్లు కూడా ఇచ్చాడు. ఫైనల్ నరేషన్ ఇవ్వాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓకె సెకండాఫ్ మీద బుచ్చి బాబు అండ్ టీం వర్క్ చేస్తుంది. క్లైమాక్స్ కూడా ఇంకా క్రాక్ అవ్వలేదు. ‘పెద్ది’ అనే టైటిల్ తో ఉత్తరాంద్ర నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామా ఏదో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు.
ఫైనల్ నరేషన్ ఇంకా అవ్వలేదు పైగా స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నందుకే ఈ ప్రాజెక్ట్ ని ఎనౌన్స్ చేయలేదని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ రెండు సినిమాలు చేసే లోపు బుచ్చిబాబు ఫైనల్ నెరేషన్ ఇచ్చేసి తారక్ నుండి గ్రీన్ సిగ్నల్ అందుకుంటే #NTR32 గా సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. ఈ లోపు ఓ మీడియం రేంజ్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు బుచ్చిబాబు.
This post was last modified on May 20, 2022 2:55 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…