లోకనాయకుడు కమల్ హాసన్ బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఆయన కొత్త సినిమా విక్రమ్ ఇంకో రెండు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత దశాబ్ద కాలంలో ఆయన చాలా తక్కువ సినిమాలు చేయగా.. విశ్వరూపం మినహా ఏదీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
గత కొన్నేళ్లలో సినిమాలకు పూర్తిగా దూరమైపోయి అభిమానులను నిరాశ పరిచిన కమల్.. లోకేష్ కనకరాజ్ లాంటి హాట్ షాట్ డైరెక్టర్తో జట్టు కట్టడం, ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి ఈ తరం మేటి నటులు కీలక పాత్రలు పోషించడంతో సినిమాపై అమితాసక్తి నెలకొంది.
జూన్ 3న భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఐతే తెలుగులో ఈ సినిమా రిలీజ్ విషయమై గందరగోళం నెలకొంది. అల్లుడు అదుర్స్ లాంటి డిజాస్టర్ మూవీని నిర్మించిన, పెద్దగా పేరు లేని నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇది కమల్ తెలుగు అభిమానులను కొంత నిరాశ పరిచింది. తెలుగులో ప్రమోషన్లు కూడా లేకపోవడం, ట్రైలర్ కూడా ఇంకా లాంచ్ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. ఐతే వారి టెన్షన్ తీర్చేసే అప్డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది.
విక్రమ్ సినిమా తెలుగు రిలీజ్ వేరే బేనర్ చేతికి వెళ్లింది. అది యువ కథానాయకుడు నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ కావడం విశేషం. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పేరున్న డిస్ట్రిబ్యూటర్. నైజాంలో ఆయనకు మంచి పట్టుంది. ఆంధ్రా ప్రాంతంలోనూ డిస్ట్రిబ్యూటర్లతో మంచి సంబంధాలున్నాయి.
కాబట్టి విక్రమ్ సినిమాను పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయడానికి అవకాశముంది. రాబోయే రెండు వారాల్లో ప్రమోషన్లు కూడా గట్టిగా చేసే అవకాశముంది. కమల్, ఫాహద్, సేతుపతి ఇక్కడికి వచ్చారంటే సినిమాకున్న క్రేజ్ ఇంకా పెరగడం ఖాయం. అడివిశేష్ సినిమా మేజర్తో ఈ సినిమా పోటీ పడనున్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 20, 2022 7:29 am
జగన్ ఇటీవల కాలంలో సహనం కోల్పోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ వారిపై కేసులు పెట్టినా.. తమ…
అంజి ఇప్పుడు గుర్తు రావడం ఏమిటనుకుంటున్నారా.. విషయం ఉంది. కొన్ని వింటే సిల్లీగా తోస్తాయి కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే…
బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…
ఒక గంట నిలబడేందుకే ఇబ్బంది పడతాం. అలాంటిది ఏకంగా ఏడున్నరగంటల పాటు ఏకబిగిన నిలబడడం అంటే మాటలా? ఊహించేందుకే కష్టమైన…
కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…
వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…