లోకనాయకుడు కమల్ హాసన్ బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఆయన కొత్త సినిమా విక్రమ్ ఇంకో రెండు వారాల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గత దశాబ్ద కాలంలో ఆయన చాలా తక్కువ సినిమాలు చేయగా.. విశ్వరూపం మినహా ఏదీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
గత కొన్నేళ్లలో సినిమాలకు పూర్తిగా దూరమైపోయి అభిమానులను నిరాశ పరిచిన కమల్.. లోకేష్ కనకరాజ్ లాంటి హాట్ షాట్ డైరెక్టర్తో జట్టు కట్టడం, ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి ఈ తరం మేటి నటులు కీలక పాత్రలు పోషించడంతో సినిమాపై అమితాసక్తి నెలకొంది.
జూన్ 3న భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఐతే తెలుగులో ఈ సినిమా రిలీజ్ విషయమై గందరగోళం నెలకొంది. అల్లుడు అదుర్స్ లాంటి డిజాస్టర్ మూవీని నిర్మించిన, పెద్దగా పేరు లేని నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఇది కమల్ తెలుగు అభిమానులను కొంత నిరాశ పరిచింది. తెలుగులో ప్రమోషన్లు కూడా లేకపోవడం, ట్రైలర్ కూడా ఇంకా లాంచ్ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది. ఐతే వారి టెన్షన్ తీర్చేసే అప్డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది.
విక్రమ్ సినిమా తెలుగు రిలీజ్ వేరే బేనర్ చేతికి వెళ్లింది. అది యువ కథానాయకుడు నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ కావడం విశేషం. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి పేరున్న డిస్ట్రిబ్యూటర్. నైజాంలో ఆయనకు మంచి పట్టుంది. ఆంధ్రా ప్రాంతంలోనూ డిస్ట్రిబ్యూటర్లతో మంచి సంబంధాలున్నాయి.
కాబట్టి విక్రమ్ సినిమాను పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేయడానికి అవకాశముంది. రాబోయే రెండు వారాల్లో ప్రమోషన్లు కూడా గట్టిగా చేసే అవకాశముంది. కమల్, ఫాహద్, సేతుపతి ఇక్కడికి వచ్చారంటే సినిమాకున్న క్రేజ్ ఇంకా పెరగడం ఖాయం. అడివిశేష్ సినిమా మేజర్తో ఈ సినిమా పోటీ పడనున్న సంగతి తెలిసిందే.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…