ఆర్ఆర్ఆర్ వచ్చినప్పటి నుంచి టికెట్ రేట్ల గురించి ఎడతెరిపి లేని చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నైజాంలో దీని ప్రభావం చాలా గట్టిగా పడటంతో ప్రతి సినిమాను జనం గుడ్డిగా చూస్తారని భ్రమపడిన నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు కళ్ళు తెరుచుకున్నాయి. దానికి తగ్గట్టుగానే తగ్గించడం మీద దృష్టి పెట్టాయి. ఎఫ్3 ప్రమోషన్ లో దిల్ రాజు పదే పదే ఈ విషయాన్ని హైలైట్ చేస్తుండగా మీడియాలో, పిఆర్ ల ట్విట్టర్ హ్యాండిల్స్ లో ఈ వీడియో బైట్ వైరల్ అయ్యింది. కానీ నిజంగా ఈ తగ్గింపు బెస్టా అంటే కాదని చెప్పాలి.
ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం ఎఫ్3 టికెట్ రేట్ మల్టీ ప్లెక్సులో 250 రూపాయలు. ఇది సామాన్యుడు ఒక కుటుంబంతో భరించే ధర కాదు. పోనీ రెండు వందలు అన్నా ఒక రీతిలో ఉండేది. సింగల్ స్క్రీన్లకు సైతం 150 ప్లస్ జిఎస్టి ఫిక్స్ చేశారు. కానీ అసలైన తగ్గింపు మాత్రం శేఖర్ సినిమాకు కనిపిస్తోంది. రేపు విడుదల కాబోతున్న ఈ మూవీకి పివిఆర్, ఐనాక్స్ లాంటి పేరుమోసిన కార్పొరేట్ చైన్లు టికెట్ ధరని 150 రూపాయలు ఉంచాయి. మొన్నటిదాకా అశోకవనంలో అర్జున కళ్యాణం 200కు అమ్మింది ఈ సంస్థలే.
అటు ఏపిలోనూ దీని ధరను గణనీయంగా తగ్గించారు. బాల్కనీ 145 ఉన్న చోట 110 రూపాయలు చేసి సెకండ్ క్లాస్ ని 70 రూపాయలకే కుదించారు. ఇది మంచి పరిణామం. చిన్న మరియు మీడియం రేంజ్ సినిమాలకు ఇలా చేస్తే ఖచ్చితంగా ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అలా కాకుండా ఏదో బజ్ లేని సినిమాకు తగ్గించి మళ్ళీ కొంచెం హైప్ ఉన్నా చాలు పెంచడం అనేది కరెక్ట్ కాదు. చూడాలి రాజశేఖర్ తన భవిష్యత్తు ఆశలన్నీ శేఖర్ మీదే పెట్టుకున్న తరుణంలో ఈ టికెట్ రేట్లు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి.
This post was last modified on May 19, 2022 7:03 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…