పూజా హెగ్డేను సౌత్ హీరోయిన్ అని చెప్పలేం. బేసిగ్గా ఆమె ముంబయి భామే. కానీ ఆమె పాపులర్ అయింది.. హిట్లు కొట్టింది.. ఆధిపత్యం చలాయిస్తోంది సౌత్ సినిమాలోనే. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగులో ఆమె నంబర్ వన్ హీరోయిన్. ఇక్కడ ఈ స్థాయిలో ఉండడం పట్ల పూజా చాలా సంతోషపడుతూ ఉంటుంది. టాలీవుడ్కే తన తొలి ప్రాధాన్యం అని చెబుతుంటుంది.
ఐతే మామూలుగా సౌత్లో పాపులరై, ఇక్కడ టాప్ రేంజిలో ఉన్న హీరోయిన్లకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రాధాన్యం దక్కదు. అక్కడి నుంచి ఎక్కువగా పిలుపు వచ్చేది, అక్కడ బాగా హైలైట్ అయ్యేది బాలీవుడ్ హీరోయిన్లే. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే.. ఇలా ఎప్పుడూ బాలీవుడ్ హీరోయిన్లదే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సందడంతా. కానీ ఈసారి కథ మారింది. ఇండియన్ బాక్సాఫీస్లో సౌత్ సినిమా ఆధిపత్యానికి తగ్గట్లే కేన్స్లో కూడా సౌత్ టాప్ హీరోయిన్లదే హవా కనిపించింది.
ముఖ్యంగా పూజా హెగ్డే అక్కడ మామూలుగా హైలైట్ అవ్వట్లేదు. ఈ రోజు ప్రిన్సెస్ గౌన్లో పూజా హెగ్డే అందరికీ కళ్లు చెదిరిపోయేలా చేసింది. ఆమె అందాన్ని ఎలివేట్ చేసేలా అదిరిపోయే డ్రెస్ వేయడం.. స్టైలింగ్, మేకింగ్ భలేగా సెట్ అవ్వడంతో పూజా నుంచి అక్కడున్న వాళ్లు చూపు తిప్పుకోలేకపోయారు. ఆమె కంటే ముందు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కేన్స్ వేదికలో బాగానే సందడి చేసింది. కానీ పూజా అంతలా హైలైట్ కాలేకపోయింది.
ఇక వీళ్లిద్దరి ముందు బాలీవుడ్ భామలు అస్సలు నిలవలేకపోయారు. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే లాంటి సీనియర్లు ఈసారి కూడా కేన్స్కు వచ్చారు కానీ.. ఇప్పుడు బాలీవుడ్లో వాళ్ల క్రేజ్ పడిపోయినట్లే ఇక్కడా రెస్పాన్స్ అంతంతమాత్రంగా కనిపించింది. అందం, స్టైలింగ్ అన్నింట్లోనూ పూజా హెగ్డే వారిని పక్కకు నెట్టేసి కేన్స్లో సెంటరాఫ్ అట్రాక్షన్గా మారిపోయింది.
This post was last modified on May 19, 2022 2:42 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…