పూజా హెగ్డేను సౌత్ హీరోయిన్ అని చెప్పలేం. బేసిగ్గా ఆమె ముంబయి భామే. కానీ ఆమె పాపులర్ అయింది.. హిట్లు కొట్టింది.. ఆధిపత్యం చలాయిస్తోంది సౌత్ సినిమాలోనే. ముఖ్యంగా చెప్పాలంటే తెలుగులో ఆమె నంబర్ వన్ హీరోయిన్. ఇక్కడ ఈ స్థాయిలో ఉండడం పట్ల పూజా చాలా సంతోషపడుతూ ఉంటుంది. టాలీవుడ్కే తన తొలి ప్రాధాన్యం అని చెబుతుంటుంది.
ఐతే మామూలుగా సౌత్లో పాపులరై, ఇక్కడ టాప్ రేంజిలో ఉన్న హీరోయిన్లకు కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రాధాన్యం దక్కదు. అక్కడి నుంచి ఎక్కువగా పిలుపు వచ్చేది, అక్కడ బాగా హైలైట్ అయ్యేది బాలీవుడ్ హీరోయిన్లే. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే.. ఇలా ఎప్పుడూ బాలీవుడ్ హీరోయిన్లదే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సందడంతా. కానీ ఈసారి కథ మారింది. ఇండియన్ బాక్సాఫీస్లో సౌత్ సినిమా ఆధిపత్యానికి తగ్గట్లే కేన్స్లో కూడా సౌత్ టాప్ హీరోయిన్లదే హవా కనిపించింది.
ముఖ్యంగా పూజా హెగ్డే అక్కడ మామూలుగా హైలైట్ అవ్వట్లేదు. ఈ రోజు ప్రిన్సెస్ గౌన్లో పూజా హెగ్డే అందరికీ కళ్లు చెదిరిపోయేలా చేసింది. ఆమె అందాన్ని ఎలివేట్ చేసేలా అదిరిపోయే డ్రెస్ వేయడం.. స్టైలింగ్, మేకింగ్ భలేగా సెట్ అవ్వడంతో పూజా నుంచి అక్కడున్న వాళ్లు చూపు తిప్పుకోలేకపోయారు. ఆమె కంటే ముందు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కేన్స్ వేదికలో బాగానే సందడి చేసింది. కానీ పూజా అంతలా హైలైట్ కాలేకపోయింది.
ఇక వీళ్లిద్దరి ముందు బాలీవుడ్ భామలు అస్సలు నిలవలేకపోయారు. ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొనే లాంటి సీనియర్లు ఈసారి కూడా కేన్స్కు వచ్చారు కానీ.. ఇప్పుడు బాలీవుడ్లో వాళ్ల క్రేజ్ పడిపోయినట్లే ఇక్కడా రెస్పాన్స్ అంతంతమాత్రంగా కనిపించింది. అందం, స్టైలింగ్ అన్నింట్లోనూ పూజా హెగ్డే వారిని పక్కకు నెట్టేసి కేన్స్లో సెంటరాఫ్ అట్రాక్షన్గా మారిపోయింది.
This post was last modified on May 19, 2022 2:42 pm
ఎవరు ఔనన్నా కాదన్నా అఖండ తాండవం 2 బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న వైనం స్పష్టం. కొన్ని ఏరియాల్లో డీసెంట్ గా…
నిన్న జరిగిన రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ తర్వాత హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల అభిమానులు ప్రవర్తించిన తీరు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం…
కెరీర్లో ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘ విరామం తీసుకున్న మంచు మనోజ్.. ఈ ఏడాదే రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.…
ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీ టాప్ హీరోల్లో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు దిలీప్. మోహన్ లాల్, మమ్ముట్టిల తర్వాత…
‘పవన్ కల్యాణ్ డిఫరెంట్ ఫీల్డ్ నుంచి వచ్చారు. స్ట్రగుల్ అవుతున్నారు. అయినా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు…