బాలకృష్ణ -బోయపాటి కాంబో అంటే పక్కా బ్లాక్ బ్లాస్టర్ అనే నమ్మకం వచ్చేసింది. మూడు సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఈ కాంబో. తాజాగా వచ్చిన ‘అఖండ’ బాలయ్య కి అదిరిపోయే రేంజ్ హిట్ అందించింది. టికెట్ రేటు పెంచకుండానే సినిమా మంచి వసూళ్ళు రాబట్టి ఇండస్ట్రీకి కూడా షాక్ ఇచ్చింది. బాలయ్య డ్యుయల్ రోల్ లో నటించిన ఈ సినిమా 125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చాడు దర్శకుడు బోయపాటి.
ప్రస్తుతం బోయపాటి అదే పనిలో ఉన్నాడట. రైటర్స్ తో ‘అఖండ 2’ కోసం కథా చర్చలు జరుపుతున్నాడని తెలుస్తుంది. నిజానికి బాలయ్య -బోయపాటి కాంబోలో ఓ పొలిటికల్ సినిమా రావాల్సి ఉంది. దాన్ని వచ్చే ఎలక్షన్స్ టైంలో రిలీజ్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు బోయపాటి అఖండ సీక్వెల్ మీద దృష్టి పెట్టి ఆ సినిమాను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. పాపకి ఇచ్చిన మాట కోసం అఖండ రుద్ర సికందర్ అఘోర మళ్ళీ రావడం లీడ్ గా తీసుకొని ప్రస్తుతం కథ రెడీ చేస్తున్నాడట బోయపాటి.
అఖండ ను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సీక్వెల్ ని భారీ బడ్జెట్ తో నిర్మించే ఆలోచనలో ఉన్నారట. అఖండతో మంచి లాభాలు దక్కడంతో ఇప్పుడు సీక్వెల్ ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని బోయపాటితో డిస్కషన్ చేస్తున్నాడట. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. ఆ రెండు సినిమాలు కంప్లీట్ చేసి మళ్ళీ బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ చేయనున్నాడు. ఇక బోయపాటి కూడా ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. బాలయ్య కమిట్ మెంట్స్ అయ్యే లోపు బోయపాటి ‘అఖండ 2’ కథ రెడీ చేసి షూటింగ్ కి రెడీ అవుతాడు.
This post was last modified on May 19, 2022 9:57 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…