బాలకృష్ణ -బోయపాటి కాంబో అంటే పక్కా బ్లాక్ బ్లాస్టర్ అనే నమ్మకం వచ్చేసింది. మూడు సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేసింది ఈ కాంబో. తాజాగా వచ్చిన ‘అఖండ’ బాలయ్య కి అదిరిపోయే రేంజ్ హిట్ అందించింది. టికెట్ రేటు పెంచకుండానే సినిమా మంచి వసూళ్ళు రాబట్టి ఇండస్ట్రీకి కూడా షాక్ ఇచ్చింది. బాలయ్య డ్యుయల్ రోల్ లో నటించిన ఈ సినిమా 125 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే సినిమా ఎండింగ్ లో సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చాడు దర్శకుడు బోయపాటి.
ప్రస్తుతం బోయపాటి అదే పనిలో ఉన్నాడట. రైటర్స్ తో ‘అఖండ 2’ కోసం కథా చర్చలు జరుపుతున్నాడని తెలుస్తుంది. నిజానికి బాలయ్య -బోయపాటి కాంబోలో ఓ పొలిటికల్ సినిమా రావాల్సి ఉంది. దాన్ని వచ్చే ఎలక్షన్స్ టైంలో రిలీజ్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు బోయపాటి అఖండ సీక్వెల్ మీద దృష్టి పెట్టి ఆ సినిమాను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. పాపకి ఇచ్చిన మాట కోసం అఖండ రుద్ర సికందర్ అఘోర మళ్ళీ రావడం లీడ్ గా తీసుకొని ప్రస్తుతం కథ రెడీ చేస్తున్నాడట బోయపాటి.
అఖండ ను నిర్మించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సీక్వెల్ ని భారీ బడ్జెట్ తో నిర్మించే ఆలోచనలో ఉన్నారట. అఖండతో మంచి లాభాలు దక్కడంతో ఇప్పుడు సీక్వెల్ ని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని బోయపాటితో డిస్కషన్ చేస్తున్నాడట. ప్రస్తుతం బాలయ్య గోపీచంద్ మలినేని తో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి సినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడు. ఆ రెండు సినిమాలు కంప్లీట్ చేసి మళ్ళీ బోయపాటి శ్రీనుతో ‘అఖండ 2’ చేయనున్నాడు. ఇక బోయపాటి కూడా ప్రస్తుతం రామ్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. బాలయ్య కమిట్ మెంట్స్ అయ్యే లోపు బోయపాటి ‘అఖండ 2’ కథ రెడీ చేసి షూటింగ్ కి రెడీ అవుతాడు.
This post was last modified on May 19, 2022 9:57 am
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. నటుడు-నిర్మాత బండ్ల గణేష్ ఇద్దరూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు చాలా దగ్గరైన మిత్రులే. కానీ…
కవితకు, షర్మిలకు మధ్య పోలిక పెట్టొద్దని ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్యూలో టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత…
ఢీ, రెడీ, కింగ్, దూకుడు లాంటి చిత్రాలతో ఒకప్పుడు వైభవం చూసిన దర్శకుడు శ్రీను వైట్ల. అప్పటి టాప్ స్టార్లంతా…
గత నెల చివరి వారంలో వచ్చిన శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులకు గుర్తే. ఘట్టమనేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన…
టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే షార్ట్ సీజన్.. సంక్రాంతి. ఈ టైంలో వచ్చే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత…
గత దశాబ్ద కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘విక్రమ్ వేద’ ఒకటి. వినూత్నమైన కథ..…