వచ్చే నెల జూన్ 10న నాని అంటే సుందరానికి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం సర్కారు వారి పాట సంబరాల్లో ఉన్నారు కాబట్టి అవి పూర్తి కాగానే న్యాచురల్ స్టార్ కోసం ప్రమోషన్లు మొదలుపెడతారు. ఆ తేదీకి వస్తున్న మరో పోటీ చిత్రం 777 ఛార్లీ ఒకటే. అతడే శ్రీమన్నారాయణతో మనకూ పరిచయమైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా టైటిల్ రోల్ ని ఓ కుక్క పోషిస్తోంది. గ్రాఫిక్స్ కాదండోయ్. నిజం శునకాన్నే వాడామని యూనిట్ చెబుతోంది. ప్రత్యేక అనుమతులు తెచ్చుకున్నారు.
సరే దీంతో నానికి పోటీ ఏంటని అభిమానులు అనుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరినీ తక్కువంచనా వేయడానికి లేదు. హిందీతో కలిపి 777 ఛార్లీ అయిదు భాషల్లో వస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగు వెర్షన్ ని విడుదల చేస్తోంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇంకా రెండు రోజులు గడవకుండానే మూడు మిలియన్ల వ్యూస్ కి దగ్గరగా వెళ్లిపోయింది. జీవితంలో అన్ని వదిలేసి ఒంటరిగా బ్రతుకుతున్న ఓ నిరాశావాది యువకుడి దగ్గరకి ఓ కుక్క వచ్చాక అతని లైఫ్ లో జరిగే అద్భుతాల సారమే 777 ఛార్లీ అసలు కథ.
సోషల్ మీడియా వేదికగా దీన్ని సెలబ్రిటీలు బాగానే షేర్ చేస్తున్నారు. అఫ్కోర్స్ రానా స్నేహాలు ఇక్కడ ఉపయోగపడుతున్నాయి లెండి. ఎటొచ్చి అంటే సుందరానికి మాత్రం మూడు భాషల్లోనే రిలీజ్ చేస్తున్నారు. మార్కెట్ పరంగా చూసుకున్నా ఇమేజ్ లెక్కలు వేసుకున్నా నాని మూవీతో 777 ఛార్లీ సమానం కాదు కానీ స్టార్లకు అతీతంగా కంటెంట్ మార్కెట్ ని శాశిస్తున్న తరుణంలో ఫలితాలు ఎలా వస్తాయో చెప్పలేం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న అంటే సుందరానికిలో హీరోయిన్ పుష్ప విలన్ ఫహద్ సతీమణి నజ్రియా.
This post was last modified on May 17, 2022 11:14 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఎంత అవసరమో తేల్చి చెప్పే ఉదంతం ఇది. ఆయనను…
మనసుంటే మార్గాలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్త ట్విట్టర్లో పెట్టిన మెసేజ్ కు నిముషాల్లో స్పందించారు.…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్…
టాక్సిక్ గురించి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన నడుస్తున్న వేళ ఒక అవసరం లేని టాపిక్ సామజిక మాధ్యమాల్లో ట్రెండ్…
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…