ఓవైపు హిందీ సినిమాలకు కనీస స్థాయిలో వసూళ్లు ఉండట్లేదు. పెద్ద హీరోలు, పేరున్న కాంబినేషన్లలో సినిమాలు చేసినా ఓపెనింగ్స్ దారుణంగా ఉంటున్నాయి. మరోవైపేమో సౌత్ సినిమాల్ని అనువాదం చేసి పెద్దగా ప్రమోషన్లు కూడా లేకుండా రిలీజ్ చేస్తుంటే అవి వసూళ్ల మోత మోగించేస్తున్నాయి.
దీంతో బాలీవుడ్ జనాలకు ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితి తలెత్తుతోంది. నెల కిందట రిలీజైన కన్నడ అనువాద చిత్రం కేజీఎఫ్-2 ఇంకా మంచి వసూళ్లు రాబడుతుంటే.. గత వీకెండ్లో వచ్చిన హిందీ సినిమా జయేష్ భాయ్ జోర్దార్ తొలి రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది.
రోజు రోజుకూ హిందీ చిత్రాల వసూళ్లు పడిపోతుండటం.. సౌత్ సినిమాల హవా పెరుగుతుండటంతో బాలీవుడ్ జనాలు లోలోన ఉడికిపోతున్నారు. ఇలాంటి టైంలో వారి ఆశలన్నీ ఓ సినిమా మీద నిలిచాయి. అదే.. భూల్ భూలయియా-2.
అక్షయ్ కుమార్ నటించిన చంద్రముఖి రీమేక్ భూల్ భూలయియాకు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని అనీస్ బజ్మి రూపొందించాడు. యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించగా.. కియారా అద్వానీ, టబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ముందు నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తిస్తోంది.
ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా సరదాగా, థ్రిల్లింగ్గా సాగడంతో అంచనాలు ఇంకా పెరిగాయి. చాన్నాళ్ల తర్వాత ఓ హిందీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నది ఇప్పుడే. విడుదలకు ఐదు రోజుల ముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.1 కోటి రూపాయలు రాబట్టిందట.
ఈ ట్రెండ్ చూస్తుంటే ఓపెనింగ్స్ బాగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు ఒక స్థాయి ఉన్న హిందీ చిత్రాలకు తొలి రోజు రూ.10 కోట్ల ఓపెనింగ్స్ మామూలు విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు అదో పెద్ద టార్గెట్లాగా మారిపోయింది. భూల్ భూలయియా-2 ఆ మార్కును అందుకుని మళ్లీ బాలీవుడ్కు ఊపు తీసుకొస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది.
This post was last modified on May 17, 2022 10:33 am
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…