ఓవైపు హిందీ సినిమాలకు కనీస స్థాయిలో వసూళ్లు ఉండట్లేదు. పెద్ద హీరోలు, పేరున్న కాంబినేషన్లలో సినిమాలు చేసినా ఓపెనింగ్స్ దారుణంగా ఉంటున్నాయి. మరోవైపేమో సౌత్ సినిమాల్ని అనువాదం చేసి పెద్దగా ప్రమోషన్లు కూడా లేకుండా రిలీజ్ చేస్తుంటే అవి వసూళ్ల మోత మోగించేస్తున్నాయి.
దీంతో బాలీవుడ్ జనాలకు ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితి తలెత్తుతోంది. నెల కిందట రిలీజైన కన్నడ అనువాద చిత్రం కేజీఎఫ్-2 ఇంకా మంచి వసూళ్లు రాబడుతుంటే.. గత వీకెండ్లో వచ్చిన హిందీ సినిమా జయేష్ భాయ్ జోర్దార్ తొలి రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది.
రోజు రోజుకూ హిందీ చిత్రాల వసూళ్లు పడిపోతుండటం.. సౌత్ సినిమాల హవా పెరుగుతుండటంతో బాలీవుడ్ జనాలు లోలోన ఉడికిపోతున్నారు. ఇలాంటి టైంలో వారి ఆశలన్నీ ఓ సినిమా మీద నిలిచాయి. అదే.. భూల్ భూలయియా-2.
అక్షయ్ కుమార్ నటించిన చంద్రముఖి రీమేక్ భూల్ భూలయియాకు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని అనీస్ బజ్మి రూపొందించాడు. యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించగా.. కియారా అద్వానీ, టబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ముందు నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తిస్తోంది.
ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా సరదాగా, థ్రిల్లింగ్గా సాగడంతో అంచనాలు ఇంకా పెరిగాయి. చాన్నాళ్ల తర్వాత ఓ హిందీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నది ఇప్పుడే. విడుదలకు ఐదు రోజుల ముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.1 కోటి రూపాయలు రాబట్టిందట.
ఈ ట్రెండ్ చూస్తుంటే ఓపెనింగ్స్ బాగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు ఒక స్థాయి ఉన్న హిందీ చిత్రాలకు తొలి రోజు రూ.10 కోట్ల ఓపెనింగ్స్ మామూలు విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు అదో పెద్ద టార్గెట్లాగా మారిపోయింది. భూల్ భూలయియా-2 ఆ మార్కును అందుకుని మళ్లీ బాలీవుడ్కు ఊపు తీసుకొస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…