ఓవైపు హిందీ సినిమాలకు కనీస స్థాయిలో వసూళ్లు ఉండట్లేదు. పెద్ద హీరోలు, పేరున్న కాంబినేషన్లలో సినిమాలు చేసినా ఓపెనింగ్స్ దారుణంగా ఉంటున్నాయి. మరోవైపేమో సౌత్ సినిమాల్ని అనువాదం చేసి పెద్దగా ప్రమోషన్లు కూడా లేకుండా రిలీజ్ చేస్తుంటే అవి వసూళ్ల మోత మోగించేస్తున్నాయి.
దీంతో బాలీవుడ్ జనాలకు ఏం చేయాలో పాలుపోని అయోమయ స్థితి తలెత్తుతోంది. నెల కిందట రిలీజైన కన్నడ అనువాద చిత్రం కేజీఎఫ్-2 ఇంకా మంచి వసూళ్లు రాబడుతుంటే.. గత వీకెండ్లో వచ్చిన హిందీ సినిమా జయేష్ భాయ్ జోర్దార్ తొలి రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర సందడి చేయలేకపోయింది.
రోజు రోజుకూ హిందీ చిత్రాల వసూళ్లు పడిపోతుండటం.. సౌత్ సినిమాల హవా పెరుగుతుండటంతో బాలీవుడ్ జనాలు లోలోన ఉడికిపోతున్నారు. ఇలాంటి టైంలో వారి ఆశలన్నీ ఓ సినిమా మీద నిలిచాయి. అదే.. భూల్ భూలయియా-2.
అక్షయ్ కుమార్ నటించిన చంద్రముఖి రీమేక్ భూల్ భూలయియాకు కొనసాగింపుగా ఈ చిత్రాన్ని అనీస్ బజ్మి రూపొందించాడు. యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించగా.. కియారా అద్వానీ, టబు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ముందు నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు రేకెత్తిస్తోంది.
ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా సరదాగా, థ్రిల్లింగ్గా సాగడంతో అంచనాలు ఇంకా పెరిగాయి. చాన్నాళ్ల తర్వాత ఓ హిందీ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఆశాజనకంగా ఉన్నది ఇప్పుడే. విడుదలకు ఐదు రోజుల ముందే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.1 కోటి రూపాయలు రాబట్టిందట.
ఈ ట్రెండ్ చూస్తుంటే ఓపెనింగ్స్ బాగానే వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకప్పుడు ఒక స్థాయి ఉన్న హిందీ చిత్రాలకు తొలి రోజు రూ.10 కోట్ల ఓపెనింగ్స్ మామూలు విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు అదో పెద్ద టార్గెట్లాగా మారిపోయింది. భూల్ భూలయియా-2 ఆ మార్కును అందుకుని మళ్లీ బాలీవుడ్కు ఊపు తీసుకొస్తుందని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. ఈ శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది.
This post was last modified on May 17, 2022 10:33 am
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…