Movie News

క్రేజీ బ్రదర్స్ కాంబోలో మల్టీస్టారర్

ఇండస్ట్రీలో తండ్రీకొడుకులు హీరోలుగా రాణించడం సహజమే కానీ ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి హయాం మొదలయ్యాక తమ్ముళ్లు కూడా వెలుగులోకి రావడం, స్టార్ డం తెచ్చుకోవడం మొదలయ్యింది. దానికి మంచి ఉదాహరణగా పవన్ కళ్యాణ్ నే మొదటగా చెప్పుకోవాలి. ఇప్పటి జెనరేషన్ లో నాగ చైతన్య – అఖిల్, సాయి తేజ్ – వైష్ణవ్ తేజ్ ఇలా బ్రదర్స్ గా రాణిస్తున్నవాళ్ళు గట్టిగానే ఉన్నారు. హిందీలోనూ సన్నీ డియోల్- బాబీ డియోల్, సల్మాన్ ఖాన్ – అర్బాజ్ ఖాన్, అనిల్ కపూర్ – సంజయ్ కపూర్ ఇలా అందరూ వెలిగినవాళ్లే.

ఇక కోలీవుడ్ వైపు చూస్తే నువ్వా నేనా అనే రీతిలో విభిన్నమైన సినిమాలతో దూసుకుపోతున్న వాళ్ళు సూర్య – కార్తీలు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రావాలని ఎప్పటి నుంచో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు కానీ సరైన కథ దర్శకుడు దొరక్క ఎప్పటికప్పుడు కాంబో లేట్ అవుతూనే వచ్చింది. ఎట్టకేలకు ఫ్యాన్స్ కల నెరవేరబోతున్నట్టు తమిళ మీడియా టాక్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ సీక్వెల్ గా రూపొందబోయే హై వోల్టేజ్ ఎంటర్ టైనర్ లో వీళ్ళు కలిసి నటించేందుకు రంగం సిద్ధమయ్యిందని వినికిడి.

ఈ కారణంగానే కమల్ హాసన్ విక్రమ్ లో క్యామియోకు సూర్య ఒప్పుకున్నట్టు తెలిసింది. అందులోనూ తమ్ముడికి ఖైదీ రూపంలో పెద్ద హిట్టు ఇచ్చాడన్న అభిమానం లోకేష్ కనగరాజ్ మీద ఉండనే ఉంది. సో ఈ కలయిక నిజమయ్యే ఛాన్స్ ఎక్కువ. విజయ్ మాస్టర్ తర్వాత ఈ దర్శకుడికి స్టార్ హీరోల ఆఫర్లు క్యూ కడుతున్నాయి. విక్రమ్ సైతం విపరీతమైన అంచానాలు మోస్తోంది. దీని తర్వాత లోకేష్ తీయబోయే సినిమాలో ఒకేతెరపై సూర్యని కార్తీని చూసే అవకాశం దక్కడం అందులోనూ ఖైదీ 2 అంటే అంతకంటే కిక్కేముంది.

This post was last modified on May 16, 2022 4:41 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago