Movie News

ఎన్టీఆర్ స్క్రిప్టుకు రిపేర్లు?


‘ఆర్ఆర్ఆర్’ మొదలయ్యే సమయానికి రెండేళ్ల లోపే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్. కానీ కరోనా, ఇతర కారణాలు తోడై.. సినిమా చాలా ఆలస్యమైంది. జూనియర్ ఎన్టీఆర్ చివరి సినిమా ‘అరవింద సమేత’కు, ‘ఆర్ఆర్ఆర్’కు మధ్య గ్యాప్ మూడున్నరేళ్లు కావడం గమనార్హం. రాజమౌళితో సినిమా అంటే ఆలస్యం మామూలే కానీ.. ఈ చిత్రం మరీ ఇంత లేటవుతుందని ఎవరూ అనుకోలేదు. దీనికి తోడు ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ పూర్తయ్యాక తారక్ వెంటనే కొత్త చిత్రాన్ని మొదలుపెట్టకపోవడం అభిమానులను నిరాశ పరిచింది.

కొరటాల శివతో సినిమాను ప్రకటించి ఏడాది దాటినా అది ప్రారంభోత్సవం జరుపుకోకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది ఫ్యాన్స్‌లో. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప ఆ చిత్రం ముందుకు కదలట్లేదు. ‘ఆచార్య’ రిలీజయ్యాక కొంచెం గ్యాప్ తీసుకుని.. తారక్ సినిమాను కొరటాల మొదలుపెట్టేస్తాడని అనుకున్నారు కానీ.. అలా ఏమీ జరగట్లేదు.

మొన్నటిదాకా అంచనా వేసినట్లు జూన్‌లో తారక్-కొరటాల సినిమా సెట్స్ మీదికి వెళ్లట్లేదు. కొత్త డెడ్ లైన్ జులై ద్వితీయార్ధం అని సమాచారం. ఈ ఆలస్యానికి పరోక్షంగా ‘ఆచార్య’ సినిమానే కారణమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వల్ల భారీగా నష్టపోయిన బయ్యర్లకు సెటిల్ చేసే వ్యవహారంలో కొన్ని రోజులుగా కొరటాల తలమునకలై ఉన్నాడు. అది పూర్తయ్యాక తారక్ స్క్రిప్టు మీద మళ్లీ కూర్చుంటున్నట్లు తెలిసింది.

‘ఆచార్య’కు దారుణమైన ఫలితం దక్కిన నేపథ్యంలో తర్వాతి సినిమాను పకడ్బందీగా తీర్చిదిద్దాల్సిన అవసరముంది. కొరటాల టెన్షన్ పడకుండా తారక్ బాగానే సపోర్ట్ ఇస్తున్నప్పటికీ.. తనకు తానుగా ఈ దర్శకుడు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ‘ఆచార్య’ బయ్యర్లకు కొంత మేర నష్టాల్ని తారక్ సినిమాతోనూ భర్తీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఆ చిత్రంతో కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కొట్టాల్సిన స్థితిలో ఉన్నాడు కొరటాల. కాబట్టి ఏ రకంగానూ ఛాన్స్ తీసుకోవడానికి లేదు. అందుకే స్క్రిప్టుకు కొన్ని రిపేర్లు చేసి మరింత పకడ్బందీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో కొరటాల ఉన్నట్లు తెలుస్తోంది.

Satya

Recent Posts

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

36 minutes ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

2 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

4 hours ago

‘ఓం’ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు

ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…

8 hours ago

ఆ నిర్మాతకు మళ్లీ జాక్‌పాటేనా?

తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…

8 hours ago

సీబీఐ విచారణకు జగన్ డిమాండ్

విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…

10 hours ago