ఈ నెల 20న ఓటిటిలో విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ మరోసారి హోమ్ థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఇక అభిమానుల సంగతి సరేసరి. రిపీట్ షోలు వేసుకుని తమ స్టార్లను మళ్ళీ మళ్ళీ చూసి తరించేందుకు ప్రిపేరవుతున్నారు. అయితే తెలుగుతో పాటు ఇతర సౌత్ బాషల హక్కులు పొందిన జీ5 సంస్థ దీన్ని పే పర్ వ్యూ మోడల్ లో ఇస్తుండటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ థియేటర్లో చూసేందుకే వందలు ఖర్చుపెట్టాక ఈ ఎక్స్ ట్రా బాదుడేంటని వాళ్ళ ప్రశ్న.
జీ5 సంస్థ కోట్లు పెట్టి రైట్స్ ని సొంతం చేసుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అంశాలున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే యాభై రోజులు పూర్తి చేసుకుంది. డిజిటల్ ప్రీమియర్ నాటికి రెండు నెలలు కంప్లీట్ అయినట్టే. అలాంటప్పుడు వంద రెండు వందలు కట్టేసి అది కూడా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే చూడాలని చెప్పడం కరెక్ట్ కాదనేది విమర్శకుల అభిప్రాయం. ఒకవేళ సల్మాన్ ఖాన్ రాధే టైపులో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయితే సొమ్ములు అడిగినా తీసుకున్నా న్యాయంగా ఉంటుంది.
అసలే ఇది పైరసీ విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న కాలం. వెబ్ సైట్స్ ని బ్లాక్ చేస్తే టెలిగ్రామ్ లో వదులుతున్నారు. అక్కడ ఆంక్షలు విధిస్తే గూగుల్ డ్రైవ్స్ లో అప్లోడ్ చేసి షేర్ చేస్తున్నారు. రూపం మారుతోంది తప్ప ఈ రక్కసి ఇండస్ట్రీని వదిలిపెట్టడం లేదు. అలాంటప్పుడు ఫైనల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాకు ఇలాంటి పద్ధతి తీసుకురావడం సరి కాదేమో. తెలుగు నయం. హిందీ వెర్షన్ బుక్ మై షోలో చూడాలంటే మూడు వందలు పైనే వదిలించుకోవాల్సిందే. ఫ్రీగా చూడాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు ఆగక తప్పదు
This post was last modified on May 16, 2022 7:54 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…