ఈ నెల 20న ఓటిటిలో విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ మరోసారి హోమ్ థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఇక అభిమానుల సంగతి సరేసరి. రిపీట్ షోలు వేసుకుని తమ స్టార్లను మళ్ళీ మళ్ళీ చూసి తరించేందుకు ప్రిపేరవుతున్నారు. అయితే తెలుగుతో పాటు ఇతర సౌత్ బాషల హక్కులు పొందిన జీ5 సంస్థ దీన్ని పే పర్ వ్యూ మోడల్ లో ఇస్తుండటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ థియేటర్లో చూసేందుకే వందలు ఖర్చుపెట్టాక ఈ ఎక్స్ ట్రా బాదుడేంటని వాళ్ళ ప్రశ్న.
జీ5 సంస్థ కోట్లు పెట్టి రైట్స్ ని సొంతం చేసుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అంశాలున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే యాభై రోజులు పూర్తి చేసుకుంది. డిజిటల్ ప్రీమియర్ నాటికి రెండు నెలలు కంప్లీట్ అయినట్టే. అలాంటప్పుడు వంద రెండు వందలు కట్టేసి అది కూడా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే చూడాలని చెప్పడం కరెక్ట్ కాదనేది విమర్శకుల అభిప్రాయం. ఒకవేళ సల్మాన్ ఖాన్ రాధే టైపులో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయితే సొమ్ములు అడిగినా తీసుకున్నా న్యాయంగా ఉంటుంది.
అసలే ఇది పైరసీ విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న కాలం. వెబ్ సైట్స్ ని బ్లాక్ చేస్తే టెలిగ్రామ్ లో వదులుతున్నారు. అక్కడ ఆంక్షలు విధిస్తే గూగుల్ డ్రైవ్స్ లో అప్లోడ్ చేసి షేర్ చేస్తున్నారు. రూపం మారుతోంది తప్ప ఈ రక్కసి ఇండస్ట్రీని వదిలిపెట్టడం లేదు. అలాంటప్పుడు ఫైనల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాకు ఇలాంటి పద్ధతి తీసుకురావడం సరి కాదేమో. తెలుగు నయం. హిందీ వెర్షన్ బుక్ మై షోలో చూడాలంటే మూడు వందలు పైనే వదిలించుకోవాల్సిందే. ఫ్రీగా చూడాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు ఆగక తప్పదు
This post was last modified on May 16, 2022 7:54 am
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…
ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…