ఈ నెల 20న ఓటిటిలో విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ మరోసారి హోమ్ థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఇక అభిమానుల సంగతి సరేసరి. రిపీట్ షోలు వేసుకుని తమ స్టార్లను మళ్ళీ మళ్ళీ చూసి తరించేందుకు ప్రిపేరవుతున్నారు. అయితే తెలుగుతో పాటు ఇతర సౌత్ బాషల హక్కులు పొందిన జీ5 సంస్థ దీన్ని పే పర్ వ్యూ మోడల్ లో ఇస్తుండటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ థియేటర్లో చూసేందుకే వందలు ఖర్చుపెట్టాక ఈ ఎక్స్ ట్రా బాదుడేంటని వాళ్ళ ప్రశ్న.
జీ5 సంస్థ కోట్లు పెట్టి రైట్స్ ని సొంతం చేసుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన అంశాలున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇప్పటికే యాభై రోజులు పూర్తి చేసుకుంది. డిజిటల్ ప్రీమియర్ నాటికి రెండు నెలలు కంప్లీట్ అయినట్టే. అలాంటప్పుడు వంద రెండు వందలు కట్టేసి అది కూడా ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే చూడాలని చెప్పడం కరెక్ట్ కాదనేది విమర్శకుల అభిప్రాయం. ఒకవేళ సల్మాన్ ఖాన్ రాధే టైపులో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అయితే సొమ్ములు అడిగినా తీసుకున్నా న్యాయంగా ఉంటుంది.
అసలే ఇది పైరసీ విచ్చలవిడిగా రాజ్యమేలుతున్న కాలం. వెబ్ సైట్స్ ని బ్లాక్ చేస్తే టెలిగ్రామ్ లో వదులుతున్నారు. అక్కడ ఆంక్షలు విధిస్తే గూగుల్ డ్రైవ్స్ లో అప్లోడ్ చేసి షేర్ చేస్తున్నారు. రూపం మారుతోంది తప్ప ఈ రక్కసి ఇండస్ట్రీని వదిలిపెట్టడం లేదు. అలాంటప్పుడు ఫైనల్ రన్ పూర్తి చేసుకున్న సినిమాకు ఇలాంటి పద్ధతి తీసుకురావడం సరి కాదేమో. తెలుగు నయం. హిందీ వెర్షన్ బుక్ మై షోలో చూడాలంటే మూడు వందలు పైనే వదిలించుకోవాల్సిందే. ఫ్రీగా చూడాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు ఆగక తప్పదు
This post was last modified on May 16, 2022 7:54 am
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…