Movie News

మహేష్ మూవీ రిలీజ్.. జగన్ ఫొటో వైరల్

నిమా పరిశ్రమలో సెంటిమెంట్ల గురించి రాయడం మొదలైతే అదొక పెద్ద బుక్కే అవుతుంది. ఇంకెక్కడా లేనన్ని సెంటిమెంట్లు ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా నెగెటివ్ సెంటిమెంట్లు అయితే మరీ ఎక్కువ. ఇలాంటివి మామూలుగా నమ్మని వాళ్లు కూడా సినీ రంగంలో భాగం అయితే వాటికి కనెక్ట్ అయిపోతుంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ కావడం వల్లే ఈ భయాలు అందరినీ వెంటాడుతాయి. ఈ మధ్యే ఒక కొత్త నెగెటివ్ సెంటిమెంట్ చర్చనీయాంశంగా మారింది.

టికెట్ల ధరల సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన హీరోల సినిమాలు తేడా కొడతాయన్నదే ఆ సెంటిమెంట్. ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా ఉన్న మాట వాస్తవం. చంద్రబాబుకు ముడిపెట్టి అనేక నెగెటివ్ సెంటిమెంట్లను గతంలో వైసీపీ వాళ్లు ప్రచారం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు టీడీపీ వాళ్లు ప్రతీకారం మొదలుపెట్టారు. జగన్‌ను ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు కలవడం తెలిసిందే. ఐతే వీరిలో ముందుగా ప్రభాస్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజైంది. అది పెద్ద డిజాస్టర్ కావడం తెలిసిందే.

ఆ తర్వాత ‘ఆచార్య’ విడుదలైంది. దాని ఫలితమూ తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు మూవీ ‘సర్కారు వారి పాట’ రిలీజైంది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సెంటిమెంటును గుర్తు చేస్తూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇప్పుడు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఈ జాబితాలో కలిపేశారు. ఏపీ సీఎంతో ఈ ముగ్గురు హీరోలున్న ఫొటోను వైరల్ చేస్తూ ‘జగన్ శాపం’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఐతే ‘సర్కారు వారి పాట’ రిజల్ట్ మీద ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. సినిమా మరీ తీసిపడేసేలా లేదు. కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. ఈ చిత్రం బోర్ కొట్టకుండా టైంపాస్ అయితే చేయించేస్తుంది. అన్నింటికీ మించి మహేష్ బాబు అభిమానులను బాగాఎంటర్టైన్ చేశాడు. సినిమా యావరేజ్‌గా ఉంది. దీనికి మహేస్ స్టార్ పవర్ కూడా తోడై సినిమాను ముందుకు లాక్కెళ్తుందేమో చూడాలి. ముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే దీని మీద బయ్యర్ల బెట్స్ మరీ ఎక్కువ కాదు. మరి సినిమా సేఫ్ జోన్లోకి వస్తుందేమో చూడాలి.

This post was last modified on May 12, 2022 10:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

2 minutes ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

4 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

4 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

5 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

5 hours ago

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

6 hours ago