నిమా పరిశ్రమలో సెంటిమెంట్ల గురించి రాయడం మొదలైతే అదొక పెద్ద బుక్కే అవుతుంది. ఇంకెక్కడా లేనన్ని సెంటిమెంట్లు ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా నెగెటివ్ సెంటిమెంట్లు అయితే మరీ ఎక్కువ. ఇలాంటివి మామూలుగా నమ్మని వాళ్లు కూడా సినీ రంగంలో భాగం అయితే వాటికి కనెక్ట్ అయిపోతుంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ కావడం వల్లే ఈ భయాలు అందరినీ వెంటాడుతాయి. ఈ మధ్యే ఒక కొత్త నెగెటివ్ సెంటిమెంట్ చర్చనీయాంశంగా మారింది.
టికెట్ల ధరల సమస్య పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన హీరోల సినిమాలు తేడా కొడతాయన్నదే ఆ సెంటిమెంట్. ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా ఉన్న మాట వాస్తవం. చంద్రబాబుకు ముడిపెట్టి అనేక నెగెటివ్ సెంటిమెంట్లను గతంలో వైసీపీ వాళ్లు ప్రచారం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు టీడీపీ వాళ్లు ప్రతీకారం మొదలుపెట్టారు. జగన్ను ప్రభాస్, చిరంజీవి, మహేష్ బాబు కలవడం తెలిసిందే. ఐతే వీరిలో ముందుగా ప్రభాస్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజైంది. అది పెద్ద డిజాస్టర్ కావడం తెలిసిందే.
ఆ తర్వాత ‘ఆచార్య’ విడుదలైంది. దాని ఫలితమూ తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబు మూవీ ‘సర్కారు వారి పాట’ రిలీజైంది. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సెంటిమెంటును గుర్తు చేస్తూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇప్పుడు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో ఈ జాబితాలో కలిపేశారు. ఏపీ సీఎంతో ఈ ముగ్గురు హీరోలున్న ఫొటోను వైరల్ చేస్తూ ‘జగన్ శాపం’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ఐతే ‘సర్కారు వారి పాట’ రిజల్ట్ మీద ఇప్పుడే ఒక అంచనాకు రాలేం. సినిమా మరీ తీసిపడేసేలా లేదు. కొన్ని ఆకర్షణలు ఉన్నాయి. ఈ చిత్రం బోర్ కొట్టకుండా టైంపాస్ అయితే చేయించేస్తుంది. అన్నింటికీ మించి మహేష్ బాబు అభిమానులను బాగాఎంటర్టైన్ చేశాడు. సినిమా యావరేజ్గా ఉంది. దీనికి మహేస్ స్టార్ పవర్ కూడా తోడై సినిమాను ముందుకు లాక్కెళ్తుందేమో చూడాలి. ముందు వచ్చిన సినిమాలతో పోలిస్తే దీని మీద బయ్యర్ల బెట్స్ మరీ ఎక్కువ కాదు. మరి సినిమా సేఫ్ జోన్లోకి వస్తుందేమో చూడాలి.
This post was last modified on May 12, 2022 10:42 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…