samantha
కొన్ని నెలల ఊహాగానాల గర్వాత గత ఏడాది అక్టోబరులో తమ విడాకుల గురించి వెల్లడించింది అక్కినేని నాగచైతన్య, సమంత జంట. ప్రేమలో ఉండగా, పెళ్లయ్యాక ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంట.. వివాహం జరిగిన నాలుగేళ్ల లోపే ఇలా విడిపోవడం అభిమానులకు ఎంతో బాధ కలిగించింది. మరి విడాకులకు దారి తీసిన కారణాలేంటనే విషయంలో చాలా చర్చే నడిచింది మీడియా, సోషల్ మీడియాల్లో. కానీ ఇటు చైతూ కానీ, అటు సమంత కానీ.. ఈ విషయం మీద ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.
దాని గురించి భవిష్యత్తులోనూ వీళ్లిద్దరూ మాట్లాడే అవకాశాలు కనిపించడం లేదు. మరి వీరి సన్నిహితులైనా ఈ విషయంలో ఏమైనా మాట్లాడతారేమో అని చూస్తున్నారు జనాలు. కాగా సినీ రంగంలో సమంతకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత విడాకులపై అడిగిన ప్రశ్నకు స్పందించింది.
సమంత తనకు చాలా క్లోజ్ అయినప్పటికీ.. ఇద్దరి మధ్య కొన్ని హద్దులు ఉన్నాయని.. అందుకే విడాకుల గురించి తనను ఏమీ అడగలేదన్నట్లుగా నందిని వ్యాఖ్యానించింది.
‘‘నా కెరీర్, అలాగే సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభయ్యాయి. మేమిద్దరం కలిసి మొదటగా జబర్దస్త్ సినిమా చేశాం. ఆ టైంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. తర్వాత సమంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నపుడు, అలాగే ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు నేను తన పక్కన ఉన్నాను. అప్పుడు మా మధ్య సాన్నిహిత్యం ఇంకా పెరిగింది. కానీ ఎంత క్లోజ్ అయినా కూడా మా మధ్య కొన్ని హద్దులు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం.
సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి జనాలకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోవడం మంచిది’’ అని నందినీ రెడ్డి పేర్కొంది.
This post was last modified on May 12, 2022 6:03 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…