samantha
కొన్ని నెలల ఊహాగానాల గర్వాత గత ఏడాది అక్టోబరులో తమ విడాకుల గురించి వెల్లడించింది అక్కినేని నాగచైతన్య, సమంత జంట. ప్రేమలో ఉండగా, పెళ్లయ్యాక ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంట.. వివాహం జరిగిన నాలుగేళ్ల లోపే ఇలా విడిపోవడం అభిమానులకు ఎంతో బాధ కలిగించింది. మరి విడాకులకు దారి తీసిన కారణాలేంటనే విషయంలో చాలా చర్చే నడిచింది మీడియా, సోషల్ మీడియాల్లో. కానీ ఇటు చైతూ కానీ, అటు సమంత కానీ.. ఈ విషయం మీద ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.
దాని గురించి భవిష్యత్తులోనూ వీళ్లిద్దరూ మాట్లాడే అవకాశాలు కనిపించడం లేదు. మరి వీరి సన్నిహితులైనా ఈ విషయంలో ఏమైనా మాట్లాడతారేమో అని చూస్తున్నారు జనాలు. కాగా సినీ రంగంలో సమంతకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత విడాకులపై అడిగిన ప్రశ్నకు స్పందించింది.
సమంత తనకు చాలా క్లోజ్ అయినప్పటికీ.. ఇద్దరి మధ్య కొన్ని హద్దులు ఉన్నాయని.. అందుకే విడాకుల గురించి తనను ఏమీ అడగలేదన్నట్లుగా నందిని వ్యాఖ్యానించింది.
‘‘నా కెరీర్, అలాగే సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభయ్యాయి. మేమిద్దరం కలిసి మొదటగా జబర్దస్త్ సినిమా చేశాం. ఆ టైంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. తర్వాత సమంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నపుడు, అలాగే ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు నేను తన పక్కన ఉన్నాను. అప్పుడు మా మధ్య సాన్నిహిత్యం ఇంకా పెరిగింది. కానీ ఎంత క్లోజ్ అయినా కూడా మా మధ్య కొన్ని హద్దులు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం.
సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి జనాలకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోవడం మంచిది’’ అని నందినీ రెడ్డి పేర్కొంది.
This post was last modified on May 12, 2022 6:03 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…