కొన్ని నెలల ఊహాగానాల గర్వాత గత ఏడాది అక్టోబరులో తమ విడాకుల గురించి వెల్లడించింది అక్కినేని నాగచైతన్య, సమంత జంట. ప్రేమలో ఉండగా, పెళ్లయ్యాక ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంట.. వివాహం జరిగిన నాలుగేళ్ల లోపే ఇలా విడిపోవడం అభిమానులకు ఎంతో బాధ కలిగించింది. మరి విడాకులకు దారి తీసిన కారణాలేంటనే విషయంలో చాలా చర్చే నడిచింది మీడియా, సోషల్ మీడియాల్లో. కానీ ఇటు చైతూ కానీ, అటు సమంత కానీ.. ఈ విషయం మీద ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.
దాని గురించి భవిష్యత్తులోనూ వీళ్లిద్దరూ మాట్లాడే అవకాశాలు కనిపించడం లేదు. మరి వీరి సన్నిహితులైనా ఈ విషయంలో ఏమైనా మాట్లాడతారేమో అని చూస్తున్నారు జనాలు. కాగా సినీ రంగంలో సమంతకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత విడాకులపై అడిగిన ప్రశ్నకు స్పందించింది.
సమంత తనకు చాలా క్లోజ్ అయినప్పటికీ.. ఇద్దరి మధ్య కొన్ని హద్దులు ఉన్నాయని.. అందుకే విడాకుల గురించి తనను ఏమీ అడగలేదన్నట్లుగా నందిని వ్యాఖ్యానించింది.
‘‘నా కెరీర్, అలాగే సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభయ్యాయి. మేమిద్దరం కలిసి మొదటగా జబర్దస్త్ సినిమా చేశాం. ఆ టైంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. తర్వాత సమంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నపుడు, అలాగే ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు నేను తన పక్కన ఉన్నాను. అప్పుడు మా మధ్య సాన్నిహిత్యం ఇంకా పెరిగింది. కానీ ఎంత క్లోజ్ అయినా కూడా మా మధ్య కొన్ని హద్దులు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం.
సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి జనాలకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోవడం మంచిది’’ అని నందినీ రెడ్డి పేర్కొంది.
This post was last modified on May 12, 2022 6:03 am
తాజాగా ఏపీలో కూటమిగా ఎన్నికలకు వెళ్తున్న టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు మేనిఫెస్టో విడుదల చేశాయి. మొత్తంగా ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవలే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. పాత పథకాలకే కొన్ని మెరుగులు దిద్దడం…
దర్శకుడు శంకర్ రెండో సినిమాగా ప్రేమికుడు మీద మూవీ లవర్స్ కు ప్రత్యేకమైన అభిమానం ఉంది. కొరియోగ్రాఫర్ గా ఉన్న…
యువత, సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలతో ఒకప్పుడు టాలీవుడ్ ప్రామిసింగ్ యంగ్ డైరెక్టర్లలో ఒకడిగా కనిపించాడు పరశురామ్.…
ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా మారిన అంశం నిరుద్యోగం. ఏటా జనవరి 1న…
లోకనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చారు. ఇక దీని కంటే ముందు మొదలై మధ్యలో ఆగి..…