samantha
కొన్ని నెలల ఊహాగానాల గర్వాత గత ఏడాది అక్టోబరులో తమ విడాకుల గురించి వెల్లడించింది అక్కినేని నాగచైతన్య, సమంత జంట. ప్రేమలో ఉండగా, పెళ్లయ్యాక ఎంతో అన్యోన్యంగా కనిపించిన జంట.. వివాహం జరిగిన నాలుగేళ్ల లోపే ఇలా విడిపోవడం అభిమానులకు ఎంతో బాధ కలిగించింది. మరి విడాకులకు దారి తీసిన కారణాలేంటనే విషయంలో చాలా చర్చే నడిచింది మీడియా, సోషల్ మీడియాల్లో. కానీ ఇటు చైతూ కానీ, అటు సమంత కానీ.. ఈ విషయం మీద ఎప్పుడూ ఓపెన్ అవ్వలేదు.
దాని గురించి భవిష్యత్తులోనూ వీళ్లిద్దరూ మాట్లాడే అవకాశాలు కనిపించడం లేదు. మరి వీరి సన్నిహితులైనా ఈ విషయంలో ఏమైనా మాట్లాడతారేమో అని చూస్తున్నారు జనాలు. కాగా సినీ రంగంలో సమంతకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన దర్శకురాలు నందిని రెడ్డి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత విడాకులపై అడిగిన ప్రశ్నకు స్పందించింది.
సమంత తనకు చాలా క్లోజ్ అయినప్పటికీ.. ఇద్దరి మధ్య కొన్ని హద్దులు ఉన్నాయని.. అందుకే విడాకుల గురించి తనను ఏమీ అడగలేదన్నట్లుగా నందిని వ్యాఖ్యానించింది.
‘‘నా కెరీర్, అలాగే సమంత కెరీర్ దాదాపు ఒకే సమయంలో ప్రారంభయ్యాయి. మేమిద్దరం కలిసి మొదటగా జబర్దస్త్ సినిమా చేశాం. ఆ టైంలో ఇద్దరం క్లోజ్ అయ్యాం. తర్వాత సమంత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నపుడు, అలాగే ఆమె వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నపుడు నేను తన పక్కన ఉన్నాను. అప్పుడు మా మధ్య సాన్నిహిత్యం ఇంకా పెరిగింది. కానీ ఎంత క్లోజ్ అయినా కూడా మా మధ్య కొన్ని హద్దులు ఉన్నాయి. వ్యక్తిగతమైన, కెరీర్పరమైన విషయాల్లో ఆ హద్దులు దాటం.
సమంత పర్సనల్ విషయాల్లో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోను. ఏం జరిగిందో తెలుసుకునేందుకు కూడా ఆసక్తి చూపించను. నిజానికి సెలబ్రిటీల గురించి జనాలకు ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. భార్యాభర్తల మధ్య ఎన్నో ఉంటాయి. బయట వాళ్లు ఏమనుకున్నా ఏం జరిగిందో వాళ్లిద్దరికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోవడం మంచిది’’ అని నందినీ రెడ్డి పేర్కొంది.
This post was last modified on May 12, 2022 6:03 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…