పెద్ద ఫ్యామిలీస్ నుంచి హీరోగా అరంగేట్రం చేశాక ఏదో ఒక దశలో పేరు వెనుక ఒక ట్యాగ్ వేసుకోవాల్సిందే. కొందరు హీరోలైతే అరంగేట్రంతోనే ట్యాగ్తో వచ్చేస్తారు. ఇంకొందరేమో కొన్ని సినిమాలు చేశాక ట్యాగ్ తీసుకుంటారు. ఒకప్పుడైతే అభిమానులే ప్రేమతో ఇలాంటి ట్యాగ్స్ ఇచ్చేవాళ్లు కానీ.. ఇప్పుడు మాత్రం హీరోలే తమకు తాముగా బిరుదులు ఇచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. ముందు ఒక ట్యాగ్ పెట్టుకుని.. ఆ తర్వాత మారిన ఇమేజ్కు తగ్గట్లుగా ఇంకో బిరుదు తగిలించుకునే హీరోలూ ఉన్నారు. ఇప్పుడు ఓ యువ కథానాయకుడు తన పేరు ముందు పెట్టుకున్న ట్యాగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఆ హీరో మరెవరో కాదు.. సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా టాలీవుడ్లోకి అడుగు పెట్టి కొన్నేళ్ల వాళ్ల అండతోనే అవకాశాలు దక్కించుకున్న సుధీర్.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు. చివరగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంతో పలకరించిన సుధీర్ బాబు.. ప్రస్తుతం నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ బుధవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘మామా మశ్చీంద్ర’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టాడు హర్షవర్ధన్. ఫస్ట్ లుక్ కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. ఐతే ఈ పోస్టర్ మీద సుధీర్ బాబు పేరు ముందు ‘నైట్రో స్టార్’ అని వేయడం విశేషం. టాలీవుడ్ ఎన్నో ట్యాగ్స్ చూశాం కానీ.. ఈ ‘నైట్రో స్టార్’ మాత్రం చిత్రంగా అనిపిస్తోంది.
ఇదేమైనా సినిమా కాన్సెప్ట్కు తగ్గట్లు తాత్కాలికంగా పెట్టుకున్న ట్యాగా.. లేక పర్మనెంట్గా ఇదే పెట్టారా అన్నది తెలియడం లేదు. ఈ ట్యాగ్ అయితే క్యాచీగా మాత్రం లేదన్నది వాస్తవం. కాగా ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సుధీర్ వెల్లడించడం విశేషం. అతను గతంలో ‘బాగి’లో విలన్ పాత్ర చేశాడు. ఆ తర్వాత మంచి ఆఫర్లు వచ్చినా బాలీవుడ్ వైపు వెళ్లలేదు. తొలిసారిగా అతను చేసిన తెలుగు చిత్రం హిందీలోనూ రిలీజ్ కాబోతోంది.
This post was last modified on May 11, 2022 4:50 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…