పెద్ద ఫ్యామిలీస్ నుంచి హీరోగా అరంగేట్రం చేశాక ఏదో ఒక దశలో పేరు వెనుక ఒక ట్యాగ్ వేసుకోవాల్సిందే. కొందరు హీరోలైతే అరంగేట్రంతోనే ట్యాగ్తో వచ్చేస్తారు. ఇంకొందరేమో కొన్ని సినిమాలు చేశాక ట్యాగ్ తీసుకుంటారు. ఒకప్పుడైతే అభిమానులే ప్రేమతో ఇలాంటి ట్యాగ్స్ ఇచ్చేవాళ్లు కానీ.. ఇప్పుడు మాత్రం హీరోలే తమకు తాముగా బిరుదులు ఇచ్చుకోవడం చూస్తూనే ఉన్నాం. ముందు ఒక ట్యాగ్ పెట్టుకుని.. ఆ తర్వాత మారిన ఇమేజ్కు తగ్గట్లుగా ఇంకో బిరుదు తగిలించుకునే హీరోలూ ఉన్నారు. ఇప్పుడు ఓ యువ కథానాయకుడు తన పేరు ముందు పెట్టుకున్న ట్యాగ్ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఆ హీరో మరెవరో కాదు.. సుధీర్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా, మహేష్ బాబు బావగా టాలీవుడ్లోకి అడుగు పెట్టి కొన్నేళ్ల వాళ్ల అండతోనే అవకాశాలు దక్కించుకున్న సుధీర్.. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, సమ్మోహనం, నన్ను దోచుకుందువటే లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు. చివరగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రంతో పలకరించిన సుధీర్ బాబు.. ప్రస్తుతం నటుడు హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ బుధవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘మామా మశ్చీంద్ర’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టాడు హర్షవర్ధన్. ఫస్ట్ లుక్ కూడా ఆకర్షణీయంగానే కనిపిస్తోంది. ఐతే ఈ పోస్టర్ మీద సుధీర్ బాబు పేరు ముందు ‘నైట్రో స్టార్’ అని వేయడం విశేషం. టాలీవుడ్ ఎన్నో ట్యాగ్స్ చూశాం కానీ.. ఈ ‘నైట్రో స్టార్’ మాత్రం చిత్రంగా అనిపిస్తోంది.
ఇదేమైనా సినిమా కాన్సెప్ట్కు తగ్గట్లు తాత్కాలికంగా పెట్టుకున్న ట్యాగా.. లేక పర్మనెంట్గా ఇదే పెట్టారా అన్నది తెలియడం లేదు. ఈ ట్యాగ్ అయితే క్యాచీగా మాత్రం లేదన్నది వాస్తవం. కాగా ఈ చిత్రాన్ని హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు సుధీర్ వెల్లడించడం విశేషం. అతను గతంలో ‘బాగి’లో విలన్ పాత్ర చేశాడు. ఆ తర్వాత మంచి ఆఫర్లు వచ్చినా బాలీవుడ్ వైపు వెళ్లలేదు. తొలిసారిగా అతను చేసిన తెలుగు చిత్రం హిందీలోనూ రిలీజ్ కాబోతోంది.
This post was last modified on May 11, 2022 4:50 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…