భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా మూడేళ్లలో మూడు బ్లాక్బస్టర్లు అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఇప్పుడు అతడి నుంచి వస్తున్న సర్కారు వారి పాట కూడా కచ్చితంగా పెద్ద హిట్టవుతుందనే అంచనాలున్నాయి. దీని తర్వాత మహేష్ లైనప్ మామూలుగా లేదు. మళ్లీ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్తో మహేష్ జట్టు కడుతున్నాడు. వీరి కలయికలో అతడు లాంటి క్లాసిక్ వచ్చింది.
తర్వాతి చిత్రం ఖలేజా ఫ్లాప్ అయినా అది కూడా కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. దీని తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో మహేష్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టుల గురించి అభిమానుల్లో చాన్నాళ్లుగా చర్చ నడుస్తోంది. ఐతే ఈ సినిమాల గురించి మహేష్ ఏమనుకుంటున్నాడన్నది ఆసక్తికరం. సర్కారు వారి పాట ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన అతను.. ఆ రెండు చిత్రాలపై ఏమన్నాడంటే..?
త్రివిక్రమ్ సినిమా గురించి ఇప్పుడే మాట్లాడితే తొందరపాటవుతుంది. కానీ మా కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నేను కూడా చాలా ఎగ్జైట్ అవుతాను. ఆయన డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయి. వాటిని వింటున్నపుడు, సెట్లో చెబుతున్నపుడు వేరే ఫీలింగ్ ఉంటుంది. మేమిద్దరం కథ గురించి, ఏదైనా సన్నివేశం గురించి మాట్లాడుకున్నపుడు ఒక సంతృప్తి ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్లోకి అడుగు పెడదామా అని ఎదురు చూస్తున్నా. ఆ సినిమా చాలా కొత్తగా ఉంటుంది.
ఇక రాజమౌళి సినిమా విషయానికి వస్తే.. మా నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో, ఈ ప్రాజెక్టు ఎలా ఉంటుందని ఊహిస్తారో అందుకు తగ్గట్లే ఉంటుంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే పాతిక సినిమాలు చేసిన అనుభవం వస్తుంది. కాబట్టి ఆలస్యమైనా సరే.. ఆయన స్థాయికి తగ్గ సినిమానే చేయాలనుకుంటున్నాం అని మహేష్ వివరించాడు.
This post was last modified on May 11, 2022 9:36 am
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…