ఇప్పుడు కాస్త బయోపిక్ ల ఉధృతి తగ్గింది కానీ మహానటి సక్సెస్ అయ్యాక ఎన్ని వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. ప్రేక్షకులకు సైతం క్రమంగా ఇవి బోర్ కొట్టడం మొదలయ్యింది. అందుకే దర్శకులు స్పోర్ట్స్ డ్రామాలు, ఆత్మకథలకు బ్రేక్ ఇచ్చేశారు. అయినప్పటికీ తెలుగు తెరవేల్పులుగా కొలచబడ్డ స్టార్ హీరోల జీవితాలను తెరమీద చూపిస్తే బాగుంటుందన్న ఆలోచన కొందరికి లేకపోలేదు. కానీ బాలకృష్ణ ముచ్చట పడి తనే స్వయంగా నిర్మించి నటించిన ఎన్టీఆర్ ఫలితం చూశాంగా. కనీసం యావరేజ్ కాలేకపోయింది.
అభిమానులు ఆరాధించే కథానాయకులైనా వాళ్ళ లైఫ్ ని స్క్రీన్ మీద పండాలంటే డ్రామా అవసరం. అది లేనందుకే ఎన్టీఆర్ రెండు భాగాలకు ఆదరణ దక్కలేదు. ఏఎన్ఆర్ బయోపిక్ ఆలోచన గురించి గతంలో నాగార్జునని ప్రశ్నించినప్పుడు తాను అంత సాహసం చేయలేనని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇప్పుడు కృష్ణ గారి వంతు వచ్చింది. సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్న ఇంటర్వ్యూలలో మహేష్ బాబు దగ్గర నాన్నగారి జీవితకథను తీస్తారా అనే ప్రశ్న వచ్చింది.
దానికి ప్రిన్స్ జవాబు చెబుతూ దేవుడి లాంటి ఆయన గురించి సినిమా తీసే ఆలోచన లేదని ఒకవేళ ఇంకెవరైనా ముందుకు వస్తే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాను తప్ప అందులో కృష్ణ గారి క్యారెక్టర్ వేయనని తేల్చి చెప్పేశారు. ఇది మంచి నిర్ణయమే. నటుడిగా దర్శక నిర్మాతగా ఎన్నో సాహసాలు చేసిన కృష్ణగారిని ఇంకొకరి రూపంలో చూడలేం. వారసుడైన మహేష్ అయినా సరే. అయినా మూడువందల పైచిలుకు సినిమాల గొప్ప ప్రస్థానమున్న సూపర్ స్టార్ కథను మూడు గంటల్లోనో రెండు భాగాల్లోనో చెప్పడం సాధ్యమా.
This post was last modified on May 10, 2022 10:47 am
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…
రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…
అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…