ఇప్పుడు కాస్త బయోపిక్ ల ఉధృతి తగ్గింది కానీ మహానటి సక్సెస్ అయ్యాక ఎన్ని వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. ప్రేక్షకులకు సైతం క్రమంగా ఇవి బోర్ కొట్టడం మొదలయ్యింది. అందుకే దర్శకులు స్పోర్ట్స్ డ్రామాలు, ఆత్మకథలకు బ్రేక్ ఇచ్చేశారు. అయినప్పటికీ తెలుగు తెరవేల్పులుగా కొలచబడ్డ స్టార్ హీరోల జీవితాలను తెరమీద చూపిస్తే బాగుంటుందన్న ఆలోచన కొందరికి లేకపోలేదు. కానీ బాలకృష్ణ ముచ్చట పడి తనే స్వయంగా నిర్మించి నటించిన ఎన్టీఆర్ ఫలితం చూశాంగా. కనీసం యావరేజ్ కాలేకపోయింది.
అభిమానులు ఆరాధించే కథానాయకులైనా వాళ్ళ లైఫ్ ని స్క్రీన్ మీద పండాలంటే డ్రామా అవసరం. అది లేనందుకే ఎన్టీఆర్ రెండు భాగాలకు ఆదరణ దక్కలేదు. ఏఎన్ఆర్ బయోపిక్ ఆలోచన గురించి గతంలో నాగార్జునని ప్రశ్నించినప్పుడు తాను అంత సాహసం చేయలేనని మొహమాటం లేకుండా చెప్పేశారు. ఇప్పుడు కృష్ణ గారి వంతు వచ్చింది. సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా చేస్తున్న ఇంటర్వ్యూలలో మహేష్ బాబు దగ్గర నాన్నగారి జీవితకథను తీస్తారా అనే ప్రశ్న వచ్చింది.
దానికి ప్రిన్స్ జవాబు చెబుతూ దేవుడి లాంటి ఆయన గురించి సినిమా తీసే ఆలోచన లేదని ఒకవేళ ఇంకెవరైనా ముందుకు వస్తే ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తాను తప్ప అందులో కృష్ణ గారి క్యారెక్టర్ వేయనని తేల్చి చెప్పేశారు. ఇది మంచి నిర్ణయమే. నటుడిగా దర్శక నిర్మాతగా ఎన్నో సాహసాలు చేసిన కృష్ణగారిని ఇంకొకరి రూపంలో చూడలేం. వారసుడైన మహేష్ అయినా సరే. అయినా మూడువందల పైచిలుకు సినిమాల గొప్ప ప్రస్థానమున్న సూపర్ స్టార్ కథను మూడు గంటల్లోనో రెండు భాగాల్లోనో చెప్పడం సాధ్యమా.
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…
అక్కినేని కుటుంబం, అభిమానుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఆ కుటుంబం నుంచి కొత్త తరంలో చాలా పెద్ద స్టార్ అయిపోతాడు…
ఒక ఫ్యాన్ అసోసియేషన్ వ్యక్తిగతంగా తమ హీరో పేరు మీద సేవా కార్యక్రమాలు తలపెడితే, దానికి రాజకీయ రంగప్రవేశానికి ముడిపెట్టి…