ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి సినిమా విడుదల తేదీ ప్రకటించాక దానికే నిర్మాతలు కట్టుబడతారన్న గ్యారెంటీ లేదు. రకరకాల కారణాలు వాళ్ళను ప్రభావితం చేసి వాయిదా వేయించేలా చేస్తున్నాయి. ట్రిపులార్ అయినా అశోకవనమైనా ఎవరూ దీనికి మినహాయింపు కాదు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సైతం ఈ బెడద తప్పలేదు. ముందు జూలైలో అనుకున్న రిలీజ్ డేట్ కాకుండా ఆగస్ట్ 12 కి షిఫ్ట్ అయిపోయింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ముందస్తుగా సమాచారం ఇచ్చారు.
కానీ ఇక్కడ రిస్క్ ఉంది. అదే రోజు ఏజెంట్ రంగంలో దిగుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అఖిల్ ని మాస్ కి దగ్గర చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. అంచనాలు మాములుగా లేవు. ఇదే చాలదనుకుంటే సమంతా యశోద కూడా 12నే వస్తోంది. అంటే ట్రయాంగిల్ వార్ తప్పదన్న మాట. అయితే ఏజెంట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇక్కడితో క్లాష్ కథ అయిపోలేదు. ఒక రోజు ముందు 11న అమీర్ ఖాన్ తన లాల్ సింగ్ చద్దాతో ప్యాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్నాడు. ఇందులో నాగ చైతన్య ప్రత్యేక పాత్ర చేయడంతో తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. సో కాస్త లోతుగా ఆలోచిస్తే ఏజెంట్ తప్పుకోవాలని డిసైడ్ అయ్యాకే నితిన్ ఫిక్స్ అయ్యాడేమో అనిపిస్తోంది. ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి అప్పుడే నిర్ధారణకు రాలేం. మాచర్ల నియోజకవర్గంలో కృతి శెట్టి హీరోయిన్ కాగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు.
This post was last modified on May 8, 2022 7:30 pm
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…
ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…