ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి సినిమా విడుదల తేదీ ప్రకటించాక దానికే నిర్మాతలు కట్టుబడతారన్న గ్యారెంటీ లేదు. రకరకాల కారణాలు వాళ్ళను ప్రభావితం చేసి వాయిదా వేయించేలా చేస్తున్నాయి. ట్రిపులార్ అయినా అశోకవనమైనా ఎవరూ దీనికి మినహాయింపు కాదు. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గానికి సైతం ఈ బెడద తప్పలేదు. ముందు జూలైలో అనుకున్న రిలీజ్ డేట్ కాకుండా ఆగస్ట్ 12 కి షిఫ్ట్ అయిపోయింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ విడుదల చేసి ముందస్తుగా సమాచారం ఇచ్చారు.
కానీ ఇక్కడ రిస్క్ ఉంది. అదే రోజు ఏజెంట్ రంగంలో దిగుతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది అఖిల్ ని మాస్ కి దగ్గర చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. అంచనాలు మాములుగా లేవు. ఇదే చాలదనుకుంటే సమంతా యశోద కూడా 12నే వస్తోంది. అంటే ట్రయాంగిల్ వార్ తప్పదన్న మాట. అయితే ఏజెంట్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.
ఇక్కడితో క్లాష్ కథ అయిపోలేదు. ఒక రోజు ముందు 11న అమీర్ ఖాన్ తన లాల్ సింగ్ చద్దాతో ప్యాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్నాడు. ఇందులో నాగ చైతన్య ప్రత్యేక పాత్ర చేయడంతో తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ ఉంటుంది. సో కాస్త లోతుగా ఆలోచిస్తే ఏజెంట్ తప్పుకోవాలని డిసైడ్ అయ్యాకే నితిన్ ఫిక్స్ అయ్యాడేమో అనిపిస్తోంది. ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి అప్పుడే నిర్ధారణకు రాలేం. మాచర్ల నియోజకవర్గంలో కృతి శెట్టి హీరోయిన్ కాగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు.
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…