జై భీమ్ సినిమాపై నెలకొన్న ఓ చీకటి కోణం మళ్లీ వెలుగులోకి రావడంతో ఆ జంట మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దీంతో సూర్య ప్రతిష్ట మరింత మసకబారే విధంగా ఉంది. కోర్టు చెప్పిన విధంగా విచారణకు హాజరుకాని ఆ జంటను ఉద్దేశించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని పోలీసులను ఆదేశించి.. నిర్ఘాంత పోయేలా చేసింది. ఆ వివరం ఈ కథనంలో..
ప్రముఖ స్టార్ సూర్య, జ్యోతిక జంటకు కోర్టు షాక్ ఇచ్చింది. సూర్య నటించిన జై భీమ్ సినిమా విషయమై రేగిన వివాదం మళ్లీ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే ఇందులో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందినవారు ఆందోళనలు చేశారు. అంతేకాక సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ రాజాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వన్నియార్ చెందిన ప్రముఖులు ఈ సినిమా పై అభ్యంతరం తెలిపారు. అంతేకాదు గత ఏడాది జై భీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చే విధంగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో పలుమార్లు ఈ కేసుని విచారించిన కోర్టు సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ రాజాని విచారణకి కోర్టుకి హాజరవ్వాలని కోరింది. కానీ ఈ జంట కోర్టు నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. కోర్టుకు హాజరు కాలేదు.
ఈ విషయం పై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. పిటిషన్ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, ఈ సినిమా నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్లు గతంలో పలుమార్లు ఈ పిటిషన్పై విచారణ జరిగినా కోర్టుకి హాజరు కాలేదు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు పై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణ కు కోర్టుకు హాజరు కావాలని హెచ్చరిస్తూ ఈ కేసును మే 20 వ తారీఖుకు వాయిదా వేసింది.
This post was last modified on May 7, 2022 10:28 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…