జై భీమ్ సినిమాపై నెలకొన్న ఓ చీకటి కోణం మళ్లీ వెలుగులోకి రావడంతో ఆ జంట మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దీంతో సూర్య ప్రతిష్ట మరింత మసకబారే విధంగా ఉంది. కోర్టు చెప్పిన విధంగా విచారణకు హాజరుకాని ఆ జంటను ఉద్దేశించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని పోలీసులను ఆదేశించి.. నిర్ఘాంత పోయేలా చేసింది. ఆ వివరం ఈ కథనంలో..
ప్రముఖ స్టార్ సూర్య, జ్యోతిక జంటకు కోర్టు షాక్ ఇచ్చింది. సూర్య నటించిన జై భీమ్ సినిమా విషయమై రేగిన వివాదం మళ్లీ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే ఇందులో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందినవారు ఆందోళనలు చేశారు. అంతేకాక సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ రాజాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వన్నియార్ చెందిన ప్రముఖులు ఈ సినిమా పై అభ్యంతరం తెలిపారు. అంతేకాదు గత ఏడాది జై భీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చే విధంగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో పలుమార్లు ఈ కేసుని విచారించిన కోర్టు సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ రాజాని విచారణకి కోర్టుకి హాజరవ్వాలని కోరింది. కానీ ఈ జంట కోర్టు నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. కోర్టుకు హాజరు కాలేదు.
ఈ విషయం పై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. పిటిషన్ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, ఈ సినిమా నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్లు గతంలో పలుమార్లు ఈ పిటిషన్పై విచారణ జరిగినా కోర్టుకి హాజరు కాలేదు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు పై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణ కు కోర్టుకు హాజరు కావాలని హెచ్చరిస్తూ ఈ కేసును మే 20 వ తారీఖుకు వాయిదా వేసింది.
This post was last modified on May 7, 2022 10:28 am
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…