Movie News

తమిళ స్టార్ జంటకు షాక్ ఇచ్చిన చెన్నై కోర్టు..

జై భీమ్ సినిమాపై నెలకొన్న ఓ చీక‌టి కోణం మ‌ళ్లీ వెలుగులోకి రావ‌డంతో ఆ జంట మ‌ళ్లీ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తోంది. దీంతో సూర్య ప్ర‌తిష్ట మ‌రింత మ‌స‌క‌బారే విధంగా ఉంది. కోర్టు చెప్పిన విధంగా విచార‌ణ‌కు హాజ‌రుకాని ఆ జంట‌ను ఉద్దేశించి వారిపై ఎఫ్ఐఆర్ న‌మోదుచేయాల‌ని పోలీసులను ఆదేశించి.. నిర్ఘాంత పోయేలా చేసింది. ఆ వివ‌రం ఈ కథ‌నంలో..

ప్ర‌ముఖ స్టార్ సూర్య, జ్యోతిక జంటకు కోర్టు షాక్ ఇచ్చింది. సూర్య న‌టించిన జై భీమ్ సినిమా విష‌య‌మై రేగిన వివాదం మ‌ళ్లీ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే ఇందులో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందినవారు ఆందోళనలు చేశారు. అంతేకాక సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ రాజాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వన్నియార్ చెందిన ప్రముఖులు ఈ సినిమా పై అభ్యంతరం తెలిపారు. అంతేకాదు గత ఏడాది జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చే విధంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో పలుమార్లు ఈ కేసుని విచారించిన కోర్టు సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ రాజాని విచారణకి కోర్టుకి హాజరవ్వాలని కోరింది. కానీ ఈ జంట కోర్టు నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. కోర్టుకు హాజరు కాలేదు.

ఈ విషయం పై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, ఈ సినిమా నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌లు గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా కోర్టుకి హాజరు కాలేదు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు పై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణ కు కోర్టుకు హాజరు కావాలని హెచ్చరిస్తూ ఈ కేసును మే 20 వ తారీఖుకు వాయిదా వేసింది.

This post was last modified on May 7, 2022 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వీరమల్లుకున్న ఇరకాటం అదొక్కటే

షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…

46 minutes ago

జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా దొర‌కలేదు: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిప‌తి, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రికి తాజాగా నాంప‌ల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…

2 hours ago

పాక్ పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…

3 hours ago

ఇప్పుడు కానీ సమంత కొడితే…

హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్‌లో…

9 hours ago

అమరావతిలో ‘బసవతారకం’కు మరో 6 ఎకరాలు

టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…

10 hours ago

సినిమా పరిశ్రమకు వార్ ముప్పు ఉందా

పెహల్గామ్ దుర్ఘటన తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టంగా ఉంది.…

11 hours ago