జై భీమ్ సినిమాపై నెలకొన్న ఓ చీకటి కోణం మళ్లీ వెలుగులోకి రావడంతో ఆ జంట మళ్లీ మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దీంతో సూర్య ప్రతిష్ట మరింత మసకబారే విధంగా ఉంది. కోర్టు చెప్పిన విధంగా విచారణకు హాజరుకాని ఆ జంటను ఉద్దేశించి వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని పోలీసులను ఆదేశించి.. నిర్ఘాంత పోయేలా చేసింది. ఆ వివరం ఈ కథనంలో..
ప్రముఖ స్టార్ సూర్య, జ్యోతిక జంటకు కోర్టు షాక్ ఇచ్చింది. సూర్య నటించిన జై భీమ్ సినిమా విషయమై రేగిన వివాదం మళ్లీ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే ఇందులో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందినవారు ఆందోళనలు చేశారు. అంతేకాక సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ రాజాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వన్నియార్ చెందిన ప్రముఖులు ఈ సినిమా పై అభ్యంతరం తెలిపారు. అంతేకాదు గత ఏడాది జై భీమ్లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చే విధంగా ఉన్నాయని పిటిషన్లో పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో పలుమార్లు ఈ కేసుని విచారించిన కోర్టు సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ రాజాని విచారణకి కోర్టుకి హాజరవ్వాలని కోరింది. కానీ ఈ జంట కోర్టు నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. కోర్టుకు హాజరు కాలేదు.
ఈ విషయం పై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. పిటిషన్ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, ఈ సినిమా నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్లు గతంలో పలుమార్లు ఈ పిటిషన్పై విచారణ జరిగినా కోర్టుకి హాజరు కాలేదు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు పై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణ కు కోర్టుకు హాజరు కావాలని హెచ్చరిస్తూ ఈ కేసును మే 20 వ తారీఖుకు వాయిదా వేసింది.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…