తమిళ స్టార్ జంటకు షాక్ ఇచ్చిన చెన్నై కోర్టు..

జై భీమ్ సినిమాపై నెలకొన్న ఓ చీక‌టి కోణం మ‌ళ్లీ వెలుగులోకి రావ‌డంతో ఆ జంట మ‌ళ్లీ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తోంది. దీంతో సూర్య ప్ర‌తిష్ట మ‌రింత మ‌స‌క‌బారే విధంగా ఉంది. కోర్టు చెప్పిన విధంగా విచార‌ణ‌కు హాజ‌రుకాని ఆ జంట‌ను ఉద్దేశించి వారిపై ఎఫ్ఐఆర్ న‌మోదుచేయాల‌ని పోలీసులను ఆదేశించి.. నిర్ఘాంత పోయేలా చేసింది. ఆ వివ‌రం ఈ కథ‌నంలో..

ప్ర‌ముఖ స్టార్ సూర్య, జ్యోతిక జంటకు కోర్టు షాక్ ఇచ్చింది. సూర్య న‌టించిన జై భీమ్ సినిమా విష‌య‌మై రేగిన వివాదం మ‌ళ్లీ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలోనే ఇందులో తమ కులాన్ని కించపరిచారని వన్నియార్ సామాజిక వర్గానికి చెందినవారు ఆందోళనలు చేశారు. అంతేకాక సూర్య, జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్ రాజాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.వన్నియార్ చెందిన ప్రముఖులు ఈ సినిమా పై అభ్యంతరం తెలిపారు. అంతేకాదు గత ఏడాది జై భీమ్‌లోని కొన్ని సన్నివేశాలు తమ ప్రతిష్ఠను మసకబార్చే విధంగా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. గతంలో పలుమార్లు ఈ కేసుని విచారించిన కోర్టు సూర్య, జ్యోతిక, జ్ఞానవేల్ రాజాని విచారణకి కోర్టుకి హాజరవ్వాలని కోరింది. కానీ ఈ జంట కోర్టు నిర్ణయానికి మద్దతు ఇవ్వలేదు. కోర్టుకు హాజరు కాలేదు.

ఈ విషయం పై కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. పిటిషన్‌ను విచారించిన చెన్నై కోర్టు హీరో సూర్య, ఈ సినిమా నిర్మాత జ్యోతిక, దర్శకుడు జ్ఞానవేల్‌లు గతంలో పలుమార్లు ఈ పిటిషన్‌పై విచారణ జరిగినా కోర్టుకి హాజరు కాలేదు అన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు పై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. తదుపరి విచారణ కు కోర్టుకు హాజరు కావాలని హెచ్చరిస్తూ ఈ కేసును మే 20 వ తారీఖుకు వాయిదా వేసింది.