జనగణమన.. ఈ పేరుతో సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ నడుస్తోంది. పూరి జగన్నాథ్ తప్పక చేయాలని కోరుకుంటున్న సినిమా ఇది. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి ఓ పవర్ ఫుల్ డైలాగ్ను కూడా పూరి ఇంతకుముందు బయటపెట్టాడు. మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలన్నది పూరి కోరిక.
ఇంతకుముందు అతడితో ‘పోకిరి’ లాంటి ఇండస్ట్రీ హిట్, ‘బిజినెస్మేన్’ లాంటి పవర్ ఫుల్ మూవీ తీశాడు పూరి. ఐతే ‘జనగణమన’ చేద్దాం అనుకునే సమయానికి పూరి ఫామ్ కోల్పోయాడు. ఆయనపై మహేష్కు గురి కుదరలేదు. ఈ సినిమా చేయడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంపై పూరి హర్టయినట్లు కూడా కనిపించాడు. మహేష్ గురించి నెగెటివ్ కామెంట్లు కూడా చేశాడు.
ఐతే ఇటీవల మహేష్ తన అభిమానులతో చిట్చాట్ చేస్తూ.. పూరితో సినిమా చేయడానికి అభ్యంతరం లేదని, ఆయన స్క్రిప్టు చెబుతాడని ఎదురు చూస్తున్నానని అన్నాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు అనుకోకుండా ‘జనగణమన’ గురించి పూరి మాట్లాడాడు. అది తన డ్రీమ్ ప్రాజెక్టు అని.. తప్పకుండా ఆ సినిమా తీస్తానని ప్రకటించాడు. ఐతే ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు అనే ప్రశ్న అందరిలోనూ ఉదయించింది. ‘జనగణమన’ చేస్తానన్న పూరి అది మహేష్తో అని మాత్రం చెప్పలేదు.
పూరి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఇంతకుముందు మహేష్కు ఈ కథ చెప్పడం, అతను ఈ సినిమా చేయడానికి అంత ఆసక్తి చూపించకపోవడం.. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య అంతరం రావడం జరిగింది. మరో కథ చెప్పి మెప్పిస్తే పూరితో సినిమా చేద్దామని మహేష్ అనుకుంటూ ఉండొచ్చు. పూరి మాత్రం ‘జనగణమన’ దగ్గరే ఆగిపోయినట్లున్నాడు.
మరి ఇప్పుడు ఆ కథకే మరింత మెరుగులు దిద్ది మహేష్ను ఒప్పించి సినిమా చేస్తాడా.. లేక అతడికి నచ్చని స్క్రిప్టును పట్టుకెళ్లి మరో హీరోతో తాను అనుకున్నట్లే ‘జనగణమన’ను తెరకెక్కిస్తాడా అన్నది చూడాలి. ఏదేమైనా ఇంకో ఏడాదిలోపు ‘జనగణమన’ పట్టాలెక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.
This post was last modified on June 24, 2020 1:55 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…