దక్షిణాదిన చాలా ఏళ్ల పాటు కథానాయికగా హవా సాగించింది తమన్నా భాటియా. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్లో చిరంజీవి, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఇలా టాప్ స్టార్లందరితోనూ ఆమె సినిమాలు చేసింది. అలాగే తమిళంలో విజయ్, అజిత్, సూర్య, ధనుష్ లాంటి అగ్రశ్రేణి కథానాయకులతో నటించింది.
ఐతే తెలుగు, తమిళం కంటే ముందు తమన్నా తన మాతృభాష అయిన హిందీలోనే కథానాయికగా అరంగేట్రం చేసింది. కానీ ఆ సినిమా సరైన ఫలితాన్నివ్వలేదు. తర్వాత సౌత్కు వచ్చిన టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఐతే చాలామంది ముంబయి భామల్లాగే బాలీవుడ్లో పేరు సంపాదించాలని తమన్నాకు కూడా కోరిక ఉంది. కానీ ఆ కోరిక ఎంతకీ ఫలించడం లేదు. మధ్య మధ్యలో అవకాశం వచ్చినపుడల్లా హిందీలో సినిమాలు చేస్తోంది కానీ.. అవి నిరాశకే గురి చేస్తున్నాయి.
హిమ్మత్ వాలా, ఎంటర్టైన్మెంట్.. లాంటి డిజాస్టర్లు తమన్నాకు బాలీవుడ్ మీద ఆశలు లేకుండా చేశాయి. అయినా ఆమె మాత్రం ప్రయత్నం మానలేదు. ఇప్పుడు సౌత్లోనూ డిమాండ్ తగ్గిన నేపథ్యంలో మళ్లీ బాలీవుడ్లో లాస్ట్ షాట్ ట్రై చేస్తోంది మిల్కీ బ్యూటీ. చాందిని బార్, ఫ్యాషన్ లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీసిన ఫిలిం మేకర్ మధుర్ భండార్కర్తో ఆమె జట్టు కట్టింది. వీరి కలయికలో కొన్ని నెలల కిందట ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా మొదలైంది. మధుర్ మామూలుగా పరిమిత బడ్జెట్లో, చాలా తక్కువ రోజుల్లో సినిమా తీసేస్తుంటాడు. అతను ఎక్కువగా తీసేది కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలే. ‘బబ్లీ బౌన్సర్’ కూడా అందుకు మినహాయింపు కాదు.
తమన్నా లీడ్ రోల్లో చాలా తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాడు మధుర్. ఫాక్స్ స్టార్ స్టూడియోస్తో కలిసి మధురే ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రం హిందీతో పాటు తమన్నా ఫాలోయింగ్ దృష్ట్యా తెలుగు, తమిళంలోనూ విడుదల కాబోతోందట. మరి కెరీర్ చరమాంకంలో అయినా తమ్మూ తన మాతృభాషలో హిట్టు కొట్టి తన చిరకాల వాంఛను నెరవేర్చుకుంటుందేమో చూడాలి.
This post was last modified on May 5, 2022 4:59 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…