మిగతా ఫిలిం ఇండస్ట్రీల్లో మాదిరే బాలీవుడ్లోనూ ఎంతో మంది వారసత్వ హీరోలున్నారు. ఐతే చాలా పెద్ద బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ సక్సెస్ కాని హీరోల్లో అభిషేక్ బచ్చన్ ఒకడు. ఇండియాస్ నంబర్ వన్ హీరోగా చాలా ఏళ్ల పాటు చక్రం తిప్పిన అమితాబ్ బచ్చన్ కొడుకతను. ఇంత ఘనమైన వారసత్వం ఉన్న అభిషేక్ హీరోగా అరంగేట్రం చేయడానికి చాలా కష్టపడ్డాడట. తనను హీరోగా లాంచ్ చేయమంటూ చాలామంది దర్శకులు, నిర్మాతల వెంట పడ్డాడట అతను.
కానీ వాళ్లలో ఎవ్వరూ తనను లాంచ్ చేయడానికి ముందుకు రాలేదని అతను వెల్లడించాడు. చివరికి తాను, దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా కలిసి ‘సంజాతా ఎక్స్ప్రెస్’ అనే సినిమాతో అరంగేట్రం చేయాలని అనుకున్నామని.. ఈ స్క్రిప్టు మీద కూడా పని చేశామని.. కానీ తమను లాంచ్ చేయడానికి ఏ నిర్మాతా ముందుకు రాలేదని అతనన్నాడు.
చివరికి తన తండ్రి అమితాబ్ ‘అక్స్’ సినిమా చేస్తుండగా.. ఆ సినిమా సెట్స్లో దర్శక నిర్మాత జేపీ దత్తాను కలిశానని.. ఆయన తనను ‘రెఫ్యూజీ’ సినిమాతో లాంచ్ చేయడానికి అంగీకరించాడని అభిషేక్ వెల్లడించాడు. ఈ చిత్రంతోనే కరీనా కపూర్ సైతం కథానాయికగా పరిచయమైంది. ఐతే ఈ చిత్రం అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. అయినప్పటికీ కరీనా చాలా త్వరగానే కథానాయికగా మంచి స్థాయికి చేరుకుంది.
అభిషేక్ మాత్రం కెరీర్లో పెద్దగా ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోయాడు. ‘ధూమ్’ సిరీస్ సహా కొన్ని హిట్లు ఉన్నప్పటికీ నటుడిగా అయితే అభిషేక్కు పెద్దగా పేరు రాలేదు. మార్కెట్టూ పెరగలేదు. ఈ ఏడాది జూన్ 30 నాటికి అభిషేక్ నట ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో ‘రోడ్ టు 20’ పేరుతో అతను తన సినీ ప్రయాణంలోని విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ప్రస్తుతం నెపోటిజం గురించి పెద్ద చర్చ నడుస్తున్న నేపథ్యంలో తనకు ఇంత బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అవకాశాలు అందుకోలేకపోయానంటూ అభిషేక్ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుకుంది.
This post was last modified on June 23, 2020 7:13 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…