సర్కారు వారి పాట.. తెలుగులో రాబోతున్న తర్వాతి భారీ చిత్రం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గీత గోవిందం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా రిలీజైన ట్రైలర్.. ఆ అంచనాలను ఇంకా పెంచేసింది. అది చాలదన్నట్లు ట్రైలర్ లాంచ్ సందర్భంగా పరశురామ్ అభిమానులతో మాట్లాడుతూ.. సినిమా దీనికి వంద రెట్లు ఉంటుందని, ఇది తన ప్రామిస్ అని చెప్పి వారి ఉత్సాహాన్ని మరింత పెంచాడు.
ఇప్పటిదాకా సినిమా తీయడంలోనే బిజీగా ఉండి మీడియాలో పెద్దగా కనిపించని పరశురామ్ తాజాగా.. ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్కారు వారి పాట గురించి, అలాగే తన కెరీర్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. మహేష్ లాంటి హీరో తాను కథ చెబుతానంటే వినడానికి వెంటనే ఒప్పుకోవడమే తాను సాధించిన విజయమని.. దాంతో తన టెన్షన్ అంతా తీరిపోయిందని.. గంట సేపు కథ చెప్పగానే మనం ఈ సినిమా చేస్తున్నాం అని మహేష్ చెయ్యి కలిపాడని పరశురామ్ వెల్లడించాడు.
మహేష్ పాత్ర లుక్ భిన్నంగా ఉండాలని, జులపాల జుట్టు, చెవిపోగు, మెడపై టాటూ లాంటి ఆలోచనలు తానే చెప్పానని.. తన అభిప్రాయాన్ని గౌరవించి మహేష్ అన్నిటికీ ఒప్పుకున్నాడని, రెండు నెలలు జుట్టు పెంచాడని పరశురామ్ తెలిపాడు. సర్కారు వారి పాట కథ గురించి మాట్లాడుతూ.. ఇది బ్యాంకు నేపథ్యంలో నడిచే కథే అయినా, బ్యాంకులో కుంభకోణాలు, అందులో జరిగే అంశాల ప్రస్తావన ఉండదని.. కానీ సామాన్య జనం ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక క్రమశిక్షణ లాంటి విషయాలపై చర్చ ఉంటుందని పరశురామ్ చెప్పాడు.
తాను మహేష్ నటించిన ఒక్కడు చూసే జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో సినీ రంగంలోకి అడుగు పెట్టి, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా చేరినట్లు పరశురామ్ వెల్లడించాడు. తన తొలి చిత్రం యువత హిట్టయ్యాక ఫ్లాప్ వచ్చిందని, కెరీర్ ఒక దశ వరకు ఒడుదొడుకులతో సాగిందని, సారొచ్చారు సినిమా ఫ్లాపయ్యాక ఆ ప్రభావం నుంచి తేరుకోవడానికి రెండేళ్లు పట్టిందని.. అక్కడి నుంచి తన ప్రయాణం కొత్తగా మొదలైందని పరశురామ్ తెలిపాడు.
This post was last modified on May 3, 2022 2:51 pm
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…
ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…
కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఊహించని ఘటన ఎదురైంది. ఇటీవల కాలంలో ఆయన యువతను చేరదీసే పనిలో పడిన విషయం…
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…