సర్కారు వారి పాట.. తెలుగులో రాబోతున్న తర్వాతి భారీ చిత్రం. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గీత గోవిందం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. తాజాగా రిలీజైన ట్రైలర్.. ఆ అంచనాలను ఇంకా పెంచేసింది. అది చాలదన్నట్లు ట్రైలర్ లాంచ్ సందర్భంగా పరశురామ్ అభిమానులతో మాట్లాడుతూ.. సినిమా దీనికి వంద రెట్లు ఉంటుందని, ఇది తన ప్రామిస్ అని చెప్పి వారి ఉత్సాహాన్ని మరింత పెంచాడు.
ఇప్పటిదాకా సినిమా తీయడంలోనే బిజీగా ఉండి మీడియాలో పెద్దగా కనిపించని పరశురామ్ తాజాగా.. ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్కారు వారి పాట గురించి, అలాగే తన కెరీర్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. మహేష్ లాంటి హీరో తాను కథ చెబుతానంటే వినడానికి వెంటనే ఒప్పుకోవడమే తాను సాధించిన విజయమని.. దాంతో తన టెన్షన్ అంతా తీరిపోయిందని.. గంట సేపు కథ చెప్పగానే మనం ఈ సినిమా చేస్తున్నాం అని మహేష్ చెయ్యి కలిపాడని పరశురామ్ వెల్లడించాడు.
మహేష్ పాత్ర లుక్ భిన్నంగా ఉండాలని, జులపాల జుట్టు, చెవిపోగు, మెడపై టాటూ లాంటి ఆలోచనలు తానే చెప్పానని.. తన అభిప్రాయాన్ని గౌరవించి మహేష్ అన్నిటికీ ఒప్పుకున్నాడని, రెండు నెలలు జుట్టు పెంచాడని పరశురామ్ తెలిపాడు. సర్కారు వారి పాట కథ గురించి మాట్లాడుతూ.. ఇది బ్యాంకు నేపథ్యంలో నడిచే కథే అయినా, బ్యాంకులో కుంభకోణాలు, అందులో జరిగే అంశాల ప్రస్తావన ఉండదని.. కానీ సామాన్య జనం ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక క్రమశిక్షణ లాంటి విషయాలపై చర్చ ఉంటుందని పరశురామ్ చెప్పాడు.
తాను మహేష్ నటించిన ఒక్కడు చూసే జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదలతో సినీ రంగంలోకి అడుగు పెట్టి, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్గా చేరినట్లు పరశురామ్ వెల్లడించాడు. తన తొలి చిత్రం యువత హిట్టయ్యాక ఫ్లాప్ వచ్చిందని, కెరీర్ ఒక దశ వరకు ఒడుదొడుకులతో సాగిందని, సారొచ్చారు సినిమా ఫ్లాపయ్యాక ఆ ప్రభావం నుంచి తేరుకోవడానికి రెండేళ్లు పట్టిందని.. అక్కడి నుంచి తన ప్రయాణం కొత్తగా మొదలైందని పరశురామ్ తెలిపాడు.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…