‘ఆచార్య’ సినిమా ఫలితం దాదాపుగా తేలిపోయినట్లే. ఎంతైనా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కాబట్టి వీకెండ్ వరకు వసూళ్లు బాగానే ఉంటాయి. ఆ తర్వాత సినిమా ఏమాత్రం నిలబడుతుందో అన్నదే డౌటు. కంటెంట్ పరంగా అయితే ఈ చిత్రం సగటు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మెగా అభిమానులు సైతం అసంతృప్తితోనే ఉన్నారు. ఐతే సినిమా చూసిన నిరాశ చెందిన వాళ్లంతా దర్శకుడు కొరటాల మీద పడిపోతున్నారు.
నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన పేరు ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అవుతూ వస్తోంది. కొరటాల ఎన్నడూ లేని విధంగా, తొలిసారిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక దర్శకుడి మీద ఈ స్థాయిలో దాడి జరగడం అరుదు. ఒక సినిమా ఫలితానికి ప్రధాన బాధ్యత దర్శకుడిదే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో పూర్తిగా దర్శకుడినే బాధ్యుడిని చేయడం కూడా కరెక్ట్ కాదు.
అందులోనూ చిరంజీవి సినిమాకు కేవలం దర్శకుడిని బాధ్యుడిని చేయలేం.చిరంజీవి అనుభవం అలాంటిలాంటిది కాదు. 150కి పైగా సినిమాలు చేసి, తెలుగు సినీ చరిత్రలో ఇంకెవ్వరూ చూడని బ్లాక్బస్టర్లు కొట్టిన ఘన చరిత్ర ఆయన సొంతం. ఇదంతా ఎవరో చెప్పింది చేసుకుపోతుంటే వచ్చిన సక్సెస్ కాదు. ఆయనకొక జడ్జిమెంట్ ఉంది. ఆ విషయంలో అందరూ ఆయన్ని కొనియాడుతారు. చిరు కూడా తనకు తానుగా తన జడ్జిమెంట్ స్కిల్స్ గురించి సందర్భం వచ్చినపుడల్లా చెప్పుకుంటూ ఉంటారు.
చిరు తన ప్రతి సినిమాకూ ఎడిటర్ అవతారం ఎత్తుతాడని.. చరణ్ సినిమాలకు కూడా రషెస్ చూసి మార్పులు చేర్పులు సూచించడం లాంటివి చేస్తారని అంటారు. ఇక స్క్రిప్టును కూడా ఒక పట్టాన ఓకే చేయరని, ఆయన ఆమోద ముద్ర వేస్తే మినిమం గ్యారెంటీ అవుతుందనే అభిప్రాయం కూడా ఇండస్ట్రీ జనాల్లో ఉంది. ఇక షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో చిరు జోక్యం ఉంటుందని కూడా చెబుతారు. మరి ఇలాంటి ట్రాక్ రికార్డున్న వ్యక్తి ‘ఆచార్య’లో ఏ జోక్యం లేకుండా పూర్తిగా కొరటాలకే వదిలేశారా.. ఈ ఫెయిల్యూర్ విషయంలో ఆయన బాధ్యత లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం. అంటే ఇప్పుడు చిరును తిట్టాలి, నిందించాలి అని కాదు కానీ.. కేవలం కొరటాలన ఈ స్థాయిలో టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నది అందరూ గుర్తించాల్సిన విషయం.
This post was last modified on May 1, 2022 8:51 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…