‘ఆచార్య’ సినిమా ఫలితం దాదాపుగా తేలిపోయినట్లే. ఎంతైనా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కాబట్టి వీకెండ్ వరకు వసూళ్లు బాగానే ఉంటాయి. ఆ తర్వాత సినిమా ఏమాత్రం నిలబడుతుందో అన్నదే డౌటు. కంటెంట్ పరంగా అయితే ఈ చిత్రం సగటు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. మెగా అభిమానులు సైతం అసంతృప్తితోనే ఉన్నారు. ఐతే సినిమా చూసిన నిరాశ చెందిన వాళ్లంతా దర్శకుడు కొరటాల మీద పడిపోతున్నారు.
నిన్న మధ్యాహ్నం నుంచి ఆయన పేరు ట్విట్టర్లో టాప్లో ట్రెండ్ అవుతూ వస్తోంది. కొరటాల ఎన్నడూ లేని విధంగా, తొలిసారిగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒక దర్శకుడి మీద ఈ స్థాయిలో దాడి జరగడం అరుదు. ఒక సినిమా ఫలితానికి ప్రధాన బాధ్యత దర్శకుడిదే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో పూర్తిగా దర్శకుడినే బాధ్యుడిని చేయడం కూడా కరెక్ట్ కాదు.
అందులోనూ చిరంజీవి సినిమాకు కేవలం దర్శకుడిని బాధ్యుడిని చేయలేం.చిరంజీవి అనుభవం అలాంటిలాంటిది కాదు. 150కి పైగా సినిమాలు చేసి, తెలుగు సినీ చరిత్రలో ఇంకెవ్వరూ చూడని బ్లాక్బస్టర్లు కొట్టిన ఘన చరిత్ర ఆయన సొంతం. ఇదంతా ఎవరో చెప్పింది చేసుకుపోతుంటే వచ్చిన సక్సెస్ కాదు. ఆయనకొక జడ్జిమెంట్ ఉంది. ఆ విషయంలో అందరూ ఆయన్ని కొనియాడుతారు. చిరు కూడా తనకు తానుగా తన జడ్జిమెంట్ స్కిల్స్ గురించి సందర్భం వచ్చినపుడల్లా చెప్పుకుంటూ ఉంటారు.
చిరు తన ప్రతి సినిమాకూ ఎడిటర్ అవతారం ఎత్తుతాడని.. చరణ్ సినిమాలకు కూడా రషెస్ చూసి మార్పులు చేర్పులు సూచించడం లాంటివి చేస్తారని అంటారు. ఇక స్క్రిప్టును కూడా ఒక పట్టాన ఓకే చేయరని, ఆయన ఆమోద ముద్ర వేస్తే మినిమం గ్యారెంటీ అవుతుందనే అభిప్రాయం కూడా ఇండస్ట్రీ జనాల్లో ఉంది. ఇక షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాల్లో చిరు జోక్యం ఉంటుందని కూడా చెబుతారు. మరి ఇలాంటి ట్రాక్ రికార్డున్న వ్యక్తి ‘ఆచార్య’లో ఏ జోక్యం లేకుండా పూర్తిగా కొరటాలకే వదిలేశారా.. ఈ ఫెయిల్యూర్ విషయంలో ఆయన బాధ్యత లేదా అన్నది ఆలోచించాల్సిన విషయం. అంటే ఇప్పుడు చిరును తిట్టాలి, నిందించాలి అని కాదు కానీ.. కేవలం కొరటాలన ఈ స్థాయిలో టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నది అందరూ గుర్తించాల్సిన విషయం.
This post was last modified on May 1, 2022 8:51 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…