నిత్యం వివాదాల్లో నానటం బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు బాగా అలవాటై పోయినట్లుంది. ఏదో ఒక వివాదంలో ఆయన పేరు జనాల్లో నానుతూనే ఉంది. పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టారనో, పొరుగు వాళ్ళతో గొడవ పడ్డారనో, లేకపోతే ఇసుక దందాలో పార్టీ వాళ్ళతో గొడవపడ్దారనో ఇలా ఏదోక గొడవలో ఎంపీ పేరు వివాదాల్లో నానుతునే ఉంది. తాజాగా తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్ కు చెందిన పిచ్చయ్య ఎంపీపై ఆరోపణలు చేయటంతో కలకలం మొదలైంది.
తన ఇంటిని సురేష్ చెల్లెలు కబ్జా చేసినట్లు పిచ్చయ్య అనే వ్యక్తి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పిచ్చయ్య దంపతులు చంద్రబాబును కలిసి తమకు అన్యాయం జరిగినట్లు భోరుమన్నారు. ఎంపీ సోదరిపైన తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో సురేష్ సోదరి మనుషులు తనింట్లోకి అక్రమంగా ప్రవేశించి తమ సామానంతా రోడ్డున పడేసినట్లు కన్నీటిపర్యంతమయ్యారు.
ఎప్పుడో చనిపోయిన తండ్రి వాళ్ళకు ఆస్తులు రాసినట్లు దొంగ పత్రాలు సృష్టించినట్లు చెప్పారు. సంబంధంలేని వాళ్ళకు తన తండ్రి తమ ఆస్తిని ఎందుకు రాసిస్తారో అర్ధం కావటం లేదన్నారు. పేదల ఇళ్ళు ఎక్కడున్నాయో పసిగట్టడం, ఏదో రూపంలో వాటిని కబ్జా చేయటం తర్వాత సొంతం చేసుకోవటమే పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై ఎవరి దగ్గరకు వెళ్ళి చెప్పుకున్నా న్యాయం జరగటం లేదని మొత్తుకున్నారు.
నిజానికి నందిగం సురేష్ ఎంపీ కాకముందు ఎవరికీ తెలీదు. అప్పట్లో రాజధాని ప్రాంతంలో పంటలు తగలబడిన ఘటనలో మొదటిసారి సురేష్ వెలుగులోకి వచ్చారు. తర్వాత నుంచి వైసీపీకి గట్టి మద్దతుదారుడిగా చేసిన పోరాటాల కారణంగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటం, బాపట్ల ఎంపీగా టికెట్ రావటం, గెలవటం అన్నీ చాలా స్పీడుగా జరిగిపోయింది.
ఎప్పుడైతే ఎంపీగా గెలిచారో అప్పటినుండో వివాదాలు మొదలయ్యాయి. తరచూ పోలీసులతో గొడవలు, వైరివర్గంతో గొడవలు, పార్టీలోనే తాడేపల్లి ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవితో గొడవలు ఇలా ఆయన పేరు వివాదాల్లో నానుతునే ఉంది. మరి ఈ వివాదాలకు ఎప్పుడు ఫులిస్టాప్ పడుతుందో ఏమో.
This post was last modified on April 30, 2022 2:43 pm
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…