నిత్యం వివాదాల్లో నానటం బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు బాగా అలవాటై పోయినట్లుంది. ఏదో ఒక వివాదంలో ఆయన పేరు జనాల్లో నానుతూనే ఉంది. పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టారనో, పొరుగు వాళ్ళతో గొడవ పడ్డారనో, లేకపోతే ఇసుక దందాలో పార్టీ వాళ్ళతో గొడవపడ్దారనో ఇలా ఏదోక గొడవలో ఎంపీ పేరు వివాదాల్లో నానుతునే ఉంది. తాజాగా తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్ కు చెందిన పిచ్చయ్య ఎంపీపై ఆరోపణలు చేయటంతో కలకలం మొదలైంది.
తన ఇంటిని సురేష్ చెల్లెలు కబ్జా చేసినట్లు పిచ్చయ్య అనే వ్యక్తి చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పిచ్చయ్య దంపతులు చంద్రబాబును కలిసి తమకు అన్యాయం జరిగినట్లు భోరుమన్నారు. ఎంపీ సోదరిపైన తాను ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదన్నారు. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్న సమయంలో సురేష్ సోదరి మనుషులు తనింట్లోకి అక్రమంగా ప్రవేశించి తమ సామానంతా రోడ్డున పడేసినట్లు కన్నీటిపర్యంతమయ్యారు.
ఎప్పుడో చనిపోయిన తండ్రి వాళ్ళకు ఆస్తులు రాసినట్లు దొంగ పత్రాలు సృష్టించినట్లు చెప్పారు. సంబంధంలేని వాళ్ళకు తన తండ్రి తమ ఆస్తిని ఎందుకు రాసిస్తారో అర్ధం కావటం లేదన్నారు. పేదల ఇళ్ళు ఎక్కడున్నాయో పసిగట్టడం, ఏదో రూపంలో వాటిని కబ్జా చేయటం తర్వాత సొంతం చేసుకోవటమే పనిగా పెట్టుకున్నట్లు ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై ఎవరి దగ్గరకు వెళ్ళి చెప్పుకున్నా న్యాయం జరగటం లేదని మొత్తుకున్నారు.
నిజానికి నందిగం సురేష్ ఎంపీ కాకముందు ఎవరికీ తెలీదు. అప్పట్లో రాజధాని ప్రాంతంలో పంటలు తగలబడిన ఘటనలో మొదటిసారి సురేష్ వెలుగులోకి వచ్చారు. తర్వాత నుంచి వైసీపీకి గట్టి మద్దతుదారుడిగా చేసిన పోరాటాల కారణంగా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడటం, బాపట్ల ఎంపీగా టికెట్ రావటం, గెలవటం అన్నీ చాలా స్పీడుగా జరిగిపోయింది.
ఎప్పుడైతే ఎంపీగా గెలిచారో అప్పటినుండో వివాదాలు మొదలయ్యాయి. తరచూ పోలీసులతో గొడవలు, వైరివర్గంతో గొడవలు, పార్టీలోనే తాడేపల్లి ఎంఎల్ఏ ఉండవల్లి శ్రీదేవితో గొడవలు ఇలా ఆయన పేరు వివాదాల్లో నానుతునే ఉంది. మరి ఈ వివాదాలకు ఎప్పుడు ఫులిస్టాప్ పడుతుందో ఏమో.
This post was last modified on April 30, 2022 2:43 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…