నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న లవ్ స్టోరీ చిత్రం షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి టీమ్ లో చాలా మంది ఇప్పుడు సిద్ధంగా లేనట్టు తెలిసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేసుకుందామని డిసైడ్ అయ్యారట. అంటే సెప్టెంబర్ తర్వాతే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళవచ్చు.
శేఖర్ కమ్ముల కాస్త స్లోగా తీస్తాడు కనుక సినిమా పూర్తి కావడానికి నవంబర్ లేదా డిసెంబర్ అవుతుంది. కాబట్టి ఈ చిత్రం ఈ ఏడాది రాదనే చెప్పుకుంటున్నారు. మరి వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తారో లేక వేసవి వరకు వేచి చూస్తారో తెలీదు. ఈ చిత్రం పట్ల ఫాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.
చైతన్య కెరీర్ బెస్ట్ అవుతుందని నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా చూసేందుకు చాలా కాలం ఎదురు చూడక తప్పదు.
This post was last modified on June 23, 2020 12:24 am
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…