మెగా స్టార్ చిరంజీవి సినిమా అంటే పది రోజుల ముందు నుండి ఫ్యాన్స్ హంగామా మొదలవుతుంది. ఎక్కడ చూసినా చిరు నామ జపమే వినిపిస్తుంది. కానీ ఈసారి అలా జరగలేదు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చిన రెండు పాన్ ఇండియా సినిమాల రిలీజ్ తర్వాత వస్తున్నందుకో ఏమో కానీ ‘ఆచార్య’ కి ఊహించినంత బజ్ లేదు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మాత్రమే కొంత హడావుడి చేస్తున్నారు తప్ప మూవీ లవర్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
అయితే ఇదంతా పక్కన పెడితే అసలు మెగా మూవీకి బెన్ఫిట్ షోలు ఉన్నాయా ? లేవా ? అనేది క్లారిటీ లేదు. నిన్న హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ లో 3:30 నుండి 4 గంటల మధ్య ‘ఆచార్య’ ఫ్యాన్స్ షోల టికెట్లు కొన్ని అమ్ముడయ్యాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఎలాంటి పర్మిషన్ లేదనే టాక్ వినబడుతుంది. ఇక బెన్ ఫిట్ షో అంటే రెండ్రోజుల ముందు నుండి హంగామా ఉంటుంది.
కానీ ఆచార్యకి అలాంటిదేం లేదు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ షో టికెట్లతో సందడి కనిపించడం లేదు. ఇక సినిమా మీద ఆశించిన స్తాయి బజ్ లేకపోవడం, బుకింగ్స్ కూడా స్లోగా ఉండటంతో ఫ్యాన్స్ కూడా డేర్ చేసి స్పెషల్ షోలు ప్లాన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ ప్రభుత్వం నుండి పర్మిషన్ వచ్చినా ఎవరూ షోలు తీసుకునేందుకు ముందుకు వెళ్ళడం లేదని తెలుస్తుంది.
ఏదేమైనా ‘ఆచార్య’ ఫ్యాన్స్ షో కి సంబంధించి అటు ఆంధ్రాలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో 6:30 నుండి 7 గంటల లోపు మార్నింగ్ షో పడనుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇప్పటికే ఈ షోలకు సంబంధించి టికెట్లు సెల్ అయిపోయాయి కూడా. మరి బెన్ఫిట్ షో ఉంటుందా? లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
This post was last modified on April 28, 2022 9:17 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…