మెగా స్టార్ చిరంజీవి సినిమా అంటే పది రోజుల ముందు నుండి ఫ్యాన్స్ హంగామా మొదలవుతుంది. ఎక్కడ చూసినా చిరు నామ జపమే వినిపిస్తుంది. కానీ ఈసారి అలా జరగలేదు. వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చిన రెండు పాన్ ఇండియా సినిమాల రిలీజ్ తర్వాత వస్తున్నందుకో ఏమో కానీ ‘ఆచార్య’ కి ఊహించినంత బజ్ లేదు. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ మాత్రమే కొంత హడావుడి చేస్తున్నారు తప్ప మూవీ లవర్స్ అయితే ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
అయితే ఇదంతా పక్కన పెడితే అసలు మెగా మూవీకి బెన్ఫిట్ షోలు ఉన్నాయా ? లేవా ? అనేది క్లారిటీ లేదు. నిన్న హైదరాబాద్ లో కొన్ని థియేటర్స్ లో 3:30 నుండి 4 గంటల మధ్య ‘ఆచార్య’ ఫ్యాన్స్ షోల టికెట్లు కొన్ని అమ్ముడయ్యాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఎలాంటి పర్మిషన్ లేదనే టాక్ వినబడుతుంది. ఇక బెన్ ఫిట్ షో అంటే రెండ్రోజుల ముందు నుండి హంగామా ఉంటుంది.
కానీ ఆచార్యకి అలాంటిదేం లేదు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ షో టికెట్లతో సందడి కనిపించడం లేదు. ఇక సినిమా మీద ఆశించిన స్తాయి బజ్ లేకపోవడం, బుకింగ్స్ కూడా స్లోగా ఉండటంతో ఫ్యాన్స్ కూడా డేర్ చేసి స్పెషల్ షోలు ప్లాన్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వేళ ప్రభుత్వం నుండి పర్మిషన్ వచ్చినా ఎవరూ షోలు తీసుకునేందుకు ముందుకు వెళ్ళడం లేదని తెలుస్తుంది.
ఏదేమైనా ‘ఆచార్య’ ఫ్యాన్స్ షో కి సంబంధించి అటు ఆంధ్రాలో కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. తెలుగు రాష్ట్రాల్లో 6:30 నుండి 7 గంటల లోపు మార్నింగ్ షో పడనుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. ఇప్పటికే ఈ షోలకు సంబంధించి టికెట్లు సెల్ అయిపోయాయి కూడా. మరి బెన్ఫిట్ షో ఉంటుందా? లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
రాజమౌళి, మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాలో రామాయణం నేపథ్యంలో ఒక అరగంట యుద్ధ సన్నివేశాలు ఉంటాయని…
జూన్ 19 మా ఇంటి బంగారం విడుదలకు రెడీ అవుతోంది. శాకుంతలం, ఖుషి తర్వాత సమంతకు బాగా గ్యాప్ వచ్చేసింది.…
ఆ పాఠశాలలో సంప్రదాయ విద్యా విధానం లేదు.. సహచర విద్యార్థుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటారు… ఈ ప్రత్యేకతలు ఉన్న పాఠశాలను…
తెలుగు సినిమాల్లో సాధారణంగా ఒక సినిమాలో ఐదారు పాటలు ఉంటాయి. కొన్ని చిత్రాల్లో ఒకట్రెండు తగ్గుతుంటాయి. కొన్నింట్లో పెరుగుతుంటాయి. థ్రిల్లర్…
సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా పెద్దిలో జాన్వీ కపూర్ క్యారెక్టరైజేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఉద్యమ సంఘం నాయకుడు అభిజీత్ దీప్కే ఇచ్చిన పిలుపు ఫలించింది. శనివారం ఉదయం 10 గంటల…