1997లో ‘టైటానిక్’ సినిమాతో చరిత్ర సృష్టించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ప్రపంచ బాక్సాఫీస్ను ఆ చిత్రంతో షేక్ చేశాక ఆయన నుంచి ఇంకో 12 ఏళ్ల పాటు ఏ సినిమా రాలేదు. కెరీర్ పీక్స్లో ఉన్న దర్శకుడు ఇంత గ్యాప్ తీసుకోవడమేంటి అంటూ మధ్యలో అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ‘అవతార్’ అనే సినిమా తీస్తున్నాడని తెలిసి.. మరీ ఇన్నేళ్లు ఒక సినిమా మీద పని చేయడం ఏంటి అని విడ్డూరంగా చూశారు.
కట్ చేస్తే.. 2009లో విడుదలైన ‘అవతార్’ ప్రపంచ సినిమా రికార్డులన్నీ బద్దలుకొట్టేస్తూ అనితర సాధ్యమైన విజయాన్నందుకుంది. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు కలిగించిన అనుభూతి గురించి, బాక్సాఫీస్ దగ్గర దాని సంచలనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఉన్నారు.
ఐతే ఇక తన కెరీర్ను పూర్తిగా ‘అవతార్’కే అంకితం చేస్తూ ఈ సిరీస్లో ఇంకో మూడు నాలుగు సినిమాలు తీయడానికి ప్రణాళికలు రచించుకున్నాడు కామెరూన్. ముందుగా ‘అవతార్-2’ ఈ ఏడాది డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘అవతార్’ రిలీజైన 13 ఏళ్ల తర్వాత ఈ చిత్రం రిలీజవుతుండటం విశేషం. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేశారు.
‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’.. ఇదీ పార్ట్-2 టైటిల్. కామెరూన్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డిస్నీ సంస్థ లాస్ వెగాస్లో ‘అవతార్-2’కు సంబంధించి ఒక ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసింది. పండోరా పర్వతాల మీద హీరోలు విహరించే రెండు సన్నివేశాలను ఈ సందర్భంగా ప్రదర్శించారట. ఈ ప్రదర్శన జరిగిన థియేటర్లోకి మొబైళ్లు, కెమెరాలు అనుమతించలేదు.
దీంతో లీక్డ్ వీడియోలేవీ బయటికి రాలేదు. కాగా మే 6న ‘అవతార్-2’ ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు వెల్లడైంది. అంతే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో ‘అవతార్-2’ను డిసెంబరు 22న రిలీజ్ చేయబోతున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు. ఒక సినిమా ఏకంగా 160 భాషల్లో రిలీజ్ కావడం అన్నది ఊహకు కూడా అందని విషయం. మొత్తానికి కామెరూన్ ‘అవతార్-2’ ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on April 28, 2022 11:02 am
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…