కొన్నేళ్ల నుంచి నార్త్ ఇండియాలో సౌత్ సినిమాల హవా నడుస్తోంది. ‘బాహుబలి’తో మొదలైన ఈ ఒరవడి ఇప్పుడు బాగా ఊపందుకుంది. చాపకింద నీరులా ఆ మార్కెట్ను మన సినిమాలు కబళించేస్తున్నాయి. క్లాస్గా, ఇంటలిజెంట్గా సినిమాలు తీసుకుంటూ.. ఉత్తరాదిన మాస్ ప్రేక్షకులకు క్రమ క్రమంగా దూరం అయిపోయారు బాలీవుడ్ జనాలు. అదే సమయంలో దక్షిణాది నుంచి వచ్చిన భారీ, మాస్, యాక్షన్ సినిమాలకు యూట్యూబ్లో, టీవీ ఛానెళ్లలో బాగా అలవాటు పడ్డ జనాలు.. థియేటర్లలోనూ ఇక్కడి చిత్రాలను ఆదరించడం మొదలుపెట్టారు.
‘బాహుబలి’ నుంచి సౌత్ సినిమాల హవా మొదలైంది హిందీ మార్కెట్లో. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 చిత్రాలతో నార్త్లో సౌత్ ఆధిపత్యం మరో స్థాయికి చేరింది. ఇలాంటి టైంలో దక్షిణాది సినిమాలకు దీటుగా భారీతనం, యాక్షన్, మాస్ అంశాలతో సినిమాలు తీయాల్సింది పోయి.. బాలీవుడ్ వాళ్లు తిరోగమనంలో పయనిస్తున్నారు. ఉత్తరాది ప్రేక్షకులను తమ వైపు మళ్లించడానికి సొంతంగా ఏం చేయాలో చూడకుండా సౌత్ సినిమాలను రీమేక్ చేయడం మీదే దృష్టి సారిస్తున్నారు అక్కడి హీరోలు, ఫిలిం మేకర్లు.
తమ ప్రేక్షకులు దక్షిణాది చిత్రాలను ఓటీటీల్లో ఆల్రెడీ బాగా చూస్తున్నారని తెలిసి కూడా మళ్లీ వాటిని రీమేక్ చేయడంలో ఆంతర్యమేంటో అర్థం కావడం లేదు. అక్షయ్ కుమార్ తాజాగా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్ర రీమేక్ను మొదలుపెట్టడం తెలిసిందే. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజైంది. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా అమేజాన్లో విడుదల చేశారీ చిత్రాన్ని. ఉత్తరాది జనాలు కూడా ఈ సినిమాను బాగానే చూసి ఉంటారు.
ఈ మధ్యే రిలీజైన ‘జెర్సీ’కి ప్రేక్షకుల నుంచి తిరస్కారం ఎదురవడానికి కారణం.. నాని నటించిన ఒరిజినల్ను ఆల్రెడీ నార్త్ ఆడియన్స్ చూసి ఉండడమే. ఇక అక్షయ్ చివరి సినిమా ‘బచ్చన్ పాండే’ సరిగా ఆడకపోవడానికి కూడా ఇలాంటి కారణమే ఉంది. దాని ఒరిజినల్ ‘జిగర్ తండ’, తెలుగు రీమేక్ ‘గద్దలకొండ గణేష్’ను ఓటీటీల్లో జనాలు బాగా చూశారు. దీంతో హిందీ వెర్షన్ ఆడలేదు. ఇలాంటి అనుభవాలు చూసి కూడా మళ్లీ ‘ఆకాశం నీ హద్దురా’ను హిందీలో రీమేక్ చేయాలనుకోవడం విడ్డూరం కాక మరేంటి?
This post was last modified on April 27, 2022 5:56 pm
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…