బాలీవుడ్ ప్రస్తుతం విచిత్రమైన సంకటంలో పడింది. డిసెంబర్ నుంచి ఏకధాటిగా సౌత్ సినిమాల డామినేషన్ పెరిగిపోవడంతో వాటిని ఎలా ఎదురుకోవాలో అర్థం కాక అయోమయంలో చిక్కుకుంది. పుష్ప పార్ట్ 1, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 మూడూ ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాయి. అన్నీ డబ్బింగ్ వెర్షన్లే. జెర్సీలాంటి ఖరీదైన రీమేక్ కు దారుణ పరాజయం దక్కింది.
బచ్చన్ పాండే అయితే మరీ ఘోరం. భారీ నష్టాలు వచ్చాయి. క్లాసిక్ ని చెడగొట్టినందుకు అక్షయ్ కుమార్ ని నెటిజెన్లు దుమ్మెత్తిపోశారు. ఎల్లుండి రెండు స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మొదటిది రన్ వే 34. అజయ్ దేవగన్ – అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ ఆశించిన బజ్ లేదు. అసలు విడుదలవుతుందా లేదానే అనుమానాలు లేకపోలేదు.
ముంబై ఢిల్లీతో సహా ఎక్కడా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాలేదు. అలా అని పోస్ట్ పోన్ ప్రకటన రాలేదు. కెజిఎఫ్ 2 తాకిడి ఇంకా బలంగా ఉన్న నేపథ్యంలో దాన్ని తీసేందుకు ఎగ్జిబిటర్లు ఇష్టపడటం లేదు. రన్ వే 34 క్లాస్ గా సాగే యాక్షన్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇలా జరగడం అనూహ్యం.
రెండోది హీరోపంటి 2. ఫిజిక్స్ నే ఛాలెంజ్ చేసే అర్థం లేని హీరోయిజంతో మాస్ ని బాగా ఆకట్టుకునే టైగర్ శ్రోఫ్ హీరోగా రూపొందిన సినిమా ఇది. దీనికీ బజ్ అంతంత మాత్రంగా ఉంది. ట్రెండ్ గమనిస్తే నలభై శాతానికి మించి బుకింగ్స్ కనిపించడం లేదు. ఇదంతా విజువల్ గ్రాండియర్ల ప్రభావమేనని, భారీ స్కేల్ ఉంటే తప్ప థియేటర్లకు వచ్చేందుకు జనం ఇష్టపడటం లేదని, ఇది సర్దుకోవడానికి కొంత టైం పడుతుందని విశ్లేషకుల అంచనా. ఏమైనా ఇంత పెద్ద సినిమాలు వస్తున్నా సౌండ్ లేకపోవడం విచిత్రమే
This post was last modified on April 27, 2022 2:46 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…