ఎంత కాదనుకున్నా బాక్సాఫీస్ వద్ద క్లాష్ లేకుండా పెద్ద సినిమాలు విడుదల చేయడం నిర్మాతలకు సవాల్ గా మారింది. అయినా కూడా తప్పడం లేదు. కరోనా ప్లస్ లాక్ డౌన్ వాయిదాల వల్ల ఇన్నేళ్లు ఆగుతూ వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలకు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోక తప్పని పరిస్థితి నెలకొంది. తాజాగా అడవి శేష్ మేజర్ కూడా డేట్ మార్చుకుంది.
ముందు అనుకున్న మే 27 కాకుండా వారం వాయిదా తీసుకుని జూన్ 3కి షిఫ్ట్ అయ్యింది. ఎఫ్3 కూడా మే 27నే రానుండటంతో ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది ఉండదు. అలా అని మేజర్ కు ఎలాంటి థ్రెట్ లేదని కాదు. జూన్ 3న అంతకు మించి అనేలా పోటీ ఉంది. కమల్ హాసన్ విక్రమ్ అదే రోజు రానుంది.
విజయ్ సేతుపతి – ఫహద్ ఫాసిల్ కాంబినేషన్ తో పాటు మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో అంచనాలు మాములుగా లేవు. ముఖ్యంగా కేరళ తమిళనాడులో మేజర్ కు విక్రమ్ నుంచి స్క్రీన్ల పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. అక్షయ్ కుమార్ పృథ్విరాజ్ సైతం జూన్ 3నే లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు.
ప్రతిష్టాత్మక యాష్ రాజ్ సంస్థ నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేస్తారు. ఈ నేపథ్యంలో మేజర్ ఈ రెండు సినిమాలను ఫేస్ చేయడం అంత సులభం కాదు. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన మేజర్ ని సోనీతో భాగస్వామ్యంలో మహేష్ బాబు నిర్మించారు. అంచనాలైతే బాగున్నాయి కానీ విక్రమ్, పృథ్విరాజ్ లతో తలపడి ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. మొత్తానికి అంతుచిక్కని రీతిలో పోస్ట్ పోన్ల సమీకరణాలు మారుతున్నాయి.
This post was last modified on April 27, 2022 1:40 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…