Movie News

డేట్ మార్చుకున్న మేజర్ – అయినా తప్పని పోటీ

ఎంత కాదనుకున్నా బాక్సాఫీస్ వద్ద క్లాష్ లేకుండా పెద్ద సినిమాలు విడుదల చేయడం నిర్మాతలకు సవాల్ గా మారింది. అయినా కూడా తప్పడం లేదు. కరోనా ప్లస్ లాక్ డౌన్ వాయిదాల వల్ల ఇన్నేళ్లు ఆగుతూ వచ్చిన భారీ బడ్జెట్ చిత్రాలకు ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోక తప్పని పరిస్థితి నెలకొంది. తాజాగా అడవి శేష్ మేజర్ కూడా డేట్ మార్చుకుంది.

ముందు అనుకున్న మే 27 కాకుండా వారం వాయిదా తీసుకుని జూన్ 3కి షిఫ్ట్ అయ్యింది. ఎఫ్3 కూడా మే 27నే రానుండటంతో ఓపెనింగ్స్ పరంగా ఇబ్బంది ఉండదు. అలా అని మేజర్ కు ఎలాంటి థ్రెట్ లేదని కాదు. జూన్ 3న అంతకు మించి అనేలా పోటీ ఉంది. కమల్ హాసన్ విక్రమ్ అదే రోజు రానుంది.

విజయ్ సేతుపతి – ఫహద్ ఫాసిల్ కాంబినేషన్ తో పాటు మాస్టర్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడంతో అంచనాలు మాములుగా లేవు. ముఖ్యంగా కేరళ తమిళనాడులో మేజర్ కు విక్రమ్ నుంచి స్క్రీన్ల పరంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. అక్షయ్ కుమార్ పృథ్విరాజ్ సైతం జూన్ 3నే లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు.

ప్రతిష్టాత్మక యాష్ రాజ్ సంస్థ నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ చేస్తారు. ఈ నేపథ్యంలో మేజర్ ఈ రెండు సినిమాలను ఫేస్ చేయడం అంత సులభం కాదు. గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన మేజర్ ని సోనీతో భాగస్వామ్యంలో మహేష్ బాబు నిర్మించారు. అంచనాలైతే బాగున్నాయి కానీ విక్రమ్, పృథ్విరాజ్ లతో తలపడి ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎలా నెగ్గుకొస్తాడో చూడాలి. మొత్తానికి అంతుచిక్కని రీతిలో పోస్ట్ పోన్ల సమీకరణాలు మారుతున్నాయి.

This post was last modified on April 27, 2022 1:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago