అసలెలాంటి అంచనాలు లేకుండా తక్కువ థియేటర్లలో విడుదలై కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఒక హిందీ సినిమా దానికి పది రెట్లు ఎక్కువ వసూలు చేయడమనేది ఎవరి ఊహకు అందనిది. స్టార్స్ లేని చిన్న బాలీవుడ్ మూవీ మూడు వందల కోట్లకు దగ్గరగా వెళ్లడమనేది చరిత్రలో అరుదుగా జరుగుతుంది. దాన్ని చేసి చూపించిన ఘనత ది కాశ్మీర్ ఫైల్స్ కి దక్కుతుంది. హైదరాబాద్ లాంటి నగరాల్లో మూడు వారాలకు పైగా హౌస్ ఫుల్ బోర్డులతో భారీ కలెక్షన్లు రాబట్టడం చిన్న విషయం కాదు.
ఇప్పుడీ సెన్సేషనల్ మూవీ ఓటిటిలో రాబోతోంది. ఇందులో విశేషం ఏముందనుకుంటున్నారా. మాములుగా ఎంత పెద్ద సినిమాకైనా సరే థియేటర్ కు డిజిటల్ కు మధ్య గ్యాప్ చాలా తగ్గిపోయింది. రాధే శ్యామ్ 20 రోజులకు, భీమ్లా నాయక్ 30 రోజులకు ఓటిటిలో వదిలేశారు. కెజిఎఫ్ 2 కూడా ఫిఫ్టీ డేస్ మార్కుకు ముందుగానే ప్రైమ్ లో వచ్చేస్తుందనే ప్రచారం ఉంది. అలాంటిది ది కాశ్మీర్ ఫైల్స్ 60 రోజుల తర్వాత రావడమంటే ముమ్మాటికీ అచీవ్ మెంటే. జీ 5లో మే 13న దీన్ని వరల్డ్ ప్రీమియర్ చేయబోతున్నారు.
దీన్ని మిస్ చేసుకున్న రీజనల్ ఆడియన్స్ చాలా ఉన్నారు. వాళ్ళ కోసం తెలుగు తదితర భాషల్లో డబ్బింగ్ చేసి అందించబోతోంది జీ5. ఇది ఖచ్చితంగా రీచ్ పెంచే స్ట్రాటజీనే. కొత్త సినిమాల పోటీ విషయంలో వెనుకబడినట్టుగా కనిపించిన ఈ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ది కాశ్మీర్ ఫైల్స్ లో ఉన్న హిందూ ఎమోషనల్ కనెక్షన్ లక్షల్లో కొత్త సబ్ స్క్రైబర్స్ ని తీసుకొస్తుందనే నమ్మకంతో ఉంది. వ్యూస్ పరంగా కనివిని ఎరుగని రికార్డులు సృష్టించడం ఖాయమని డిజిటల్ వర్గాల అంచనా. చూడాలి మరి స్మార్ట్ స్క్రీన్ పై ఇంకెన్ని సంచలనాలు రేపనుందో
This post was last modified on April 26, 2022 1:59 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…