‘భరత్ అనే నేను’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్ కోసం కొరటాల శివ ఓ కథ సిద్దం చేసుకున్నాడు. చరణ్ తో ఓ యాక్షన్ డ్రామా చేయాలని భావించారు. కానీ అప్పటికే రామ్ చరణ్ రాజమౌళి RRR అడిగినన్ని డేట్స్ ఇచ్చేశాడు. దీంతో తమ కాంబో సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రాజమౌళి సినిమాలో జాయిన్ అవ్వాలనుకున్నాడు మెగా పవర్ స్టార్.
కానీ అందుకు కొరటాల ఒప్పుకోలేదు. తక్కువ డేట్స్ తో ఏదో హడావుడిగా ఓ సినిమా తీయడం తన వల్ల కాదని రాజమౌళి గారి ప్రాజెక్ట్ ఇంపార్టెన్స్ ఏమిటో తనకి తెలుసనీ పైగా తారక్ , చరణ్ కాంబో అంటే తను కూడా ఓ సినిమా అభిమానిగా స్క్రీన్ పై చూడాలనుకుంటున్నానని చరణ్ కి చెప్పేసి మరో హీరోకి కథ చెప్పే ప్లాన్ చేసుకున్నాడు కొరటాల.
కానీ చరణ్ చిరుతో డిస్కస్ చేసి కొరటాల శివకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. మెగాస్టార్ తో సినిమా చేయమని , మెగా ప్రాజెక్ట్ కొరటాల చేతిలో పెట్టాడు చరణ్.
దీంతో అప్పటి కప్పుడు ఆచార్య కథ తాయారు చేసుకొని చిరుకి వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు శివ. ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ అనుకోకుండా సినిమాలో ఓ ఇంపార్టెన్స్ రోల్ వచ్చింది. ఆ కేరెక్టర్ కి కథలో స్పేస్ ఉండటంతో ఎవరితో చేయించాలని తర్జనభర్జన పడ్డారు. రామ్ చరణ్ తోనే ఆ రోల్ చేయించాలనేది అందరి కోరిక. కానీ జక్కన్న చరణ్ ని విడిచిపెట్టరు ఇది కన్ఫర్మ్. అందుకే మహేష్ బాబు పేరు తెరపైకి వచ్చింది. చరణ్ మిస్ అయితే మహేష్ ఫిక్స్ అనుకున్నారు టీం.
ఎట్టకేలకు రాజమౌళి ని కన్విన్స్ చేసి చరణ్ ని ‘ఆచార్య’ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చారు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ చరణ్ ఎంట్రీ ఇచ్చాక కేరెక్టర్ ఇంపార్టెన్స్ తో పాటు మరో ముప్పై నిమిషాల నిడివి పెరిగింది. అవును ముందుగా చరణ్ రోల్ 15 నిమిషాలే అనుకున్నారు. కానీ దాన్ని పెంచి ఇప్పుడు ఫైనల్ గా 45 నిమిషాలు లాక్ చేసి కథలో భాగం చేశారు. సో ఇప్పుడు చరణ్ సినిమాలో నలబై నిమిషాల పాటు కనిపించనున్నాడు. మొదటి భాగంతో పాటు సెకండాఫ్ లో కూడా ఉంటాడు. మరి చిరుతో కలిసి నలబై ఐదు నిమిషాల నిడివి గల పాత్రతో చరణ్ ఎలా మెప్పిస్తాడో ? చూడాలి.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…