సెకండ్ ఇన్నింగ్స్లో మెగాస్టార్ చిరంజీవి మామూలు స్పీడులో లేడు. ‘ఆచార్య’ కరోనా, ఇతర కారణాల వల్ల ఆలస్యం అయింది కానీ.. దీని తర్వాత మాత్రం ఆయన శరవేగంగా సినిమాలు పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించుకున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమా.. ఇలా సమాంతరంగా ఆయన మూడు చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమాను ఓకే చేశారు.
‘ఆచార్య’తో కలుపుకుంటే ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు. ఈ వయసులో ఇంత బిజీగా ఉంటూ ఇంత ఉత్సాహంగా ఎలా పని చేయగలుగుతున్నారు అని చిరును ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆయన ఒక షాకింగ్ విషయం చెప్పారు. తాను కొత్తగా ఇంకో ఐదు సినిమాలు కమిటైనట్లు వెల్లడించారు. ఇలా విరామం లేకుండా సినిమాలు చేయడం తనకేమీ కష్టంగా అనిపించట్లేదని ఆయన చెప్పారు.
‘‘ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయనే అంతా అనుకుంటున్నారు. ఇవి కాకుండా ఇంకో ఐదు సినిమాలు సిద్ధమవుతున్నాయి. మేమంతా ఎంతో పుణ్యం చేసుకోబట్టే సినిమా రంగంలోకి వచ్చాం. ఇక్కడికి వచ్చి నిలదొక్కుకున్న తర్వాత ఎంత సంతోషిస్తామో.. ఈ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే అంత బాధ పడతాం. కాబట్టి మన స్థానం నిలబెట్టుకోవడం కోసం నిరంతరం కష్టపడాల్సిందే. 24 గంటలూ పని చేసినా నాకు విసుగురాదు.
నా కష్టమే నన్ను ఆరోగ్యవంతుడిని చేస్తుంది. నేను కష్టపడేంత వరకు ఈ ఇండస్ట్రీ నన్నెప్పుడూ అక్కున చేర్చుకుంటుందని నమ్ముతాను. ‘గాడ్ ఫాదర్’ కోసం రాత్రి పూట పని చేశాం. బాబీ సినిమాకు కూడా రాత్రుళ్లే షూటింగ్ జరిగంది. నాకు ఎక్కడా విసుగు రాలేదు. మరింత ఉత్సాహం వస్తుంది’’ అని చిరు చెప్పాడు. మరి ఇంకో ఐదు సినిమాలని చిరు సరదాకి అన్నాడా.. లేక నిజంగానే ఆయన ఇంకో ఐదు సినిమాలు లైన్లో పెట్టాడా అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…