సెకండ్ ఇన్నింగ్స్లో మెగాస్టార్ చిరంజీవి మామూలు స్పీడులో లేడు. ‘ఆచార్య’ కరోనా, ఇతర కారణాల వల్ల ఆలస్యం అయింది కానీ.. దీని తర్వాత మాత్రం ఆయన శరవేగంగా సినిమాలు పూర్తి చేయడానికి ప్రణాళికలు రచించుకున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమా.. ఇలా సమాంతరంగా ఆయన మూడు చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
దీంతో పాటు యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలోనూ చిరు ఓ సినిమాను ఓకే చేశారు. ‘ఆచార్య’తో కలుపుకుంటే ఆయన చేతిలో ఐదు సినిమాలు ఉన్నట్లు. ఈ వయసులో ఇంత బిజీగా ఉంటూ ఇంత ఉత్సాహంగా ఎలా పని చేయగలుగుతున్నారు అని చిరును ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నిస్తే.. ఆయన ఒక షాకింగ్ విషయం చెప్పారు. తాను కొత్తగా ఇంకో ఐదు సినిమాలు కమిటైనట్లు వెల్లడించారు. ఇలా విరామం లేకుండా సినిమాలు చేయడం తనకేమీ కష్టంగా అనిపించట్లేదని ఆయన చెప్పారు.
‘‘ఇప్పుడు నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయనే అంతా అనుకుంటున్నారు. ఇవి కాకుండా ఇంకో ఐదు సినిమాలు సిద్ధమవుతున్నాయి. మేమంతా ఎంతో పుణ్యం చేసుకోబట్టే సినిమా రంగంలోకి వచ్చాం. ఇక్కడికి వచ్చి నిలదొక్కుకున్న తర్వాత ఎంత సంతోషిస్తామో.. ఈ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతే అంత బాధ పడతాం. కాబట్టి మన స్థానం నిలబెట్టుకోవడం కోసం నిరంతరం కష్టపడాల్సిందే.
24 గంటలూ పని చేసినా నాకు విసుగురాదు. నా కష్టమే నన్ను ఆరోగ్యవంతుడిని చేస్తుంది. నేను కష్టపడేంత వరకు ఈ ఇండస్ట్రీ నన్నెప్పుడూ అక్కున చేర్చుకుంటుందని నమ్ముతాను. ‘గాడ్ ఫాదర్’ కోసం రాత్రి పూట పని చేశాం. బాబీ సినిమాకు కూడా రాత్రుళ్లే షూటింగ్ జరిగంది. నాకు ఎక్కడా విసుగు రాలేదు. మరింత ఉత్సాహం వస్తుంది’’ అని చిరు చెప్పాడు. మరి ఇంకో ఐదు సినిమాలని చిరు సరదాకి అన్నాడా.. లేక నిజంగానే ఆయన ఇంకో ఐదు సినిమాలు లైన్లో పెట్టాడా అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
This post was last modified on April 25, 2022 2:59 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…