బంగార్రాజు తర్వాత రావాల్సిన చైతు కొత్త సినిమా థ్యాంక్ యు విడుదల కోసం అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ తప్ప దీనికి సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ బయటికి రాలేదు. నిర్మాత దిల్ రాజు సైతం మౌనంగానే ఉన్నారు. మనం తర్వాత చైతుతో దర్శకుడు విక్రమ్ కుమార్ రెండోసారి చేస్తున్న మూవీ ఇదే.
రాశిఖన్నా హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూర్చారు. ఇంతకు మించి ఎలాంటి సమాచారం లేదు. నిజానికి ముందు జూలైలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఈలోగా ఆ నెల మొత్తం ఇతర సినిమాలు లాక్ చేసుకున్నాయి. 1న పక్కా కమర్షియల్ – రంగ రంగ వైభవంగా వస్తున్నాయి.
8న నితిన్ మాచర్ల నియోజకవర్గం దిగుతుంది. 14న రామ్ ది వారియర్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. 22న కార్తికేయ 2, 28న సుదీప్ విక్రాంత్ రోనా విడుదలవుతున్నాయి. వీటితో దేంతో పోటీపడినా రిస్క్ లేదు కానీ దానికి ముందసలు థ్యాంక్ యు టీమ్ రెడీగా ఉందా అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మే నెలలో ఎలాగూ ఛాన్స్ లేదు. జూన్లో మొదటి మూడు వారాలు విక్రమ్, అంటే సుందరానికి, రామారావు ఆన్ డ్యూటీ పలకరిస్తాయి. నాలుగో వారం ఖాళీగా ఉంది. పోనీ దాన్ని వాడుకుందాం అంటే ప్రమోషన్ ని ఇప్పటినుంచే మెల్లగా మొదలుపెట్టాలి. కానీ ఆ సూచనలైతే ప్రస్తుతానికి లేవు. ఏకంగా ఆగస్ట్ కి వెళ్లిపోయారా లేదా అంతకన్నా లేటా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతు విక్రమ్ కుమార్ ఇద్దరూ వెబ్ సిరీస్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. దీనికి దూత అనే టైటిల్ ను లాక్ చేశారు.
This post was last modified on April 22, 2022 2:18 pm
నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా 'వాల్ పోస్టర్ సినిమా' బ్యానర్పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన…
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…