బంగార్రాజు తర్వాత రావాల్సిన చైతు కొత్త సినిమా థ్యాంక్ యు విడుదల కోసం అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ తప్ప దీనికి సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ బయటికి రాలేదు. నిర్మాత దిల్ రాజు సైతం మౌనంగానే ఉన్నారు. మనం తర్వాత చైతుతో దర్శకుడు విక్రమ్ కుమార్ రెండోసారి చేస్తున్న మూవీ ఇదే.
రాశిఖన్నా హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూర్చారు. ఇంతకు మించి ఎలాంటి సమాచారం లేదు. నిజానికి ముందు జూలైలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఈలోగా ఆ నెల మొత్తం ఇతర సినిమాలు లాక్ చేసుకున్నాయి. 1న పక్కా కమర్షియల్ – రంగ రంగ వైభవంగా వస్తున్నాయి.
8న నితిన్ మాచర్ల నియోజకవర్గం దిగుతుంది. 14న రామ్ ది వారియర్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. 22న కార్తికేయ 2, 28న సుదీప్ విక్రాంత్ రోనా విడుదలవుతున్నాయి. వీటితో దేంతో పోటీపడినా రిస్క్ లేదు కానీ దానికి ముందసలు థ్యాంక్ యు టీమ్ రెడీగా ఉందా అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మే నెలలో ఎలాగూ ఛాన్స్ లేదు. జూన్లో మొదటి మూడు వారాలు విక్రమ్, అంటే సుందరానికి, రామారావు ఆన్ డ్యూటీ పలకరిస్తాయి. నాలుగో వారం ఖాళీగా ఉంది. పోనీ దాన్ని వాడుకుందాం అంటే ప్రమోషన్ ని ఇప్పటినుంచే మెల్లగా మొదలుపెట్టాలి. కానీ ఆ సూచనలైతే ప్రస్తుతానికి లేవు. ఏకంగా ఆగస్ట్ కి వెళ్లిపోయారా లేదా అంతకన్నా లేటా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతు విక్రమ్ కుమార్ ఇద్దరూ వెబ్ సిరీస్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. దీనికి దూత అనే టైటిల్ ను లాక్ చేశారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…