Movie News

థ్యాంక్ యు ఎప్పుడు చెప్తావు చైతు?

బంగార్రాజు తర్వాత రావాల్సిన చైతు కొత్త సినిమా థ్యాంక్ యు విడుదల కోసం అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ తప్ప దీనికి సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ బయటికి రాలేదు. నిర్మాత దిల్ రాజు సైతం మౌనంగానే ఉన్నారు. మనం తర్వాత చైతుతో దర్శకుడు విక్రమ్ కుమార్ రెండోసారి చేస్తున్న మూవీ ఇదే.

రాశిఖన్నా హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూర్చారు. ఇంతకు మించి ఎలాంటి సమాచారం లేదు. నిజానికి ముందు జూలైలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఈలోగా ఆ నెల మొత్తం ఇతర సినిమాలు లాక్ చేసుకున్నాయి. 1న పక్కా కమర్షియల్ – రంగ రంగ వైభవంగా వస్తున్నాయి.

8న నితిన్ మాచర్ల నియోజకవర్గం దిగుతుంది. 14న రామ్ ది వారియర్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. 22న కార్తికేయ 2, 28న సుదీప్ విక్రాంత్ రోనా విడుదలవుతున్నాయి. వీటితో దేంతో పోటీపడినా రిస్క్ లేదు కానీ దానికి ముందసలు థ్యాంక్ యు టీమ్ రెడీగా ఉందా అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మే నెలలో ఎలాగూ ఛాన్స్ లేదు. జూన్లో మొదటి మూడు వారాలు విక్రమ్, అంటే సుందరానికి, రామారావు ఆన్ డ్యూటీ పలకరిస్తాయి. నాలుగో వారం ఖాళీగా ఉంది. పోనీ దాన్ని వాడుకుందాం అంటే ప్రమోషన్ ని ఇప్పటినుంచే మెల్లగా మొదలుపెట్టాలి. కానీ ఆ సూచనలైతే ప్రస్తుతానికి లేవు. ఏకంగా ఆగస్ట్ కి వెళ్లిపోయారా లేదా అంతకన్నా లేటా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతు విక్రమ్ కుమార్ ఇద్దరూ వెబ్ సిరీస్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. దీనికి దూత అనే టైటిల్ ను లాక్ చేశారు.

This post was last modified on April 22, 2022 2:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

57 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

1 hour ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

4 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

6 hours ago