బంగార్రాజు తర్వాత రావాల్సిన చైతు కొత్త సినిమా థ్యాంక్ యు విడుదల కోసం అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా ఫస్ట్ లుక్ తప్ప దీనికి సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ మెటీరియల్ బయటికి రాలేదు. నిర్మాత దిల్ రాజు సైతం మౌనంగానే ఉన్నారు. మనం తర్వాత చైతుతో దర్శకుడు విక్రమ్ కుమార్ రెండోసారి చేస్తున్న మూవీ ఇదే.
రాశిఖన్నా హీరోయిన్ కాగా తమన్ సంగీతం సమకూర్చారు. ఇంతకు మించి ఎలాంటి సమాచారం లేదు. నిజానికి ముందు జూలైలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ ఈలోగా ఆ నెల మొత్తం ఇతర సినిమాలు లాక్ చేసుకున్నాయి. 1న పక్కా కమర్షియల్ – రంగ రంగ వైభవంగా వస్తున్నాయి.
8న నితిన్ మాచర్ల నియోజకవర్గం దిగుతుంది. 14న రామ్ ది వారియర్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. 22న కార్తికేయ 2, 28న సుదీప్ విక్రాంత్ రోనా విడుదలవుతున్నాయి. వీటితో దేంతో పోటీపడినా రిస్క్ లేదు కానీ దానికి ముందసలు థ్యాంక్ యు టీమ్ రెడీగా ఉందా అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మే నెలలో ఎలాగూ ఛాన్స్ లేదు. జూన్లో మొదటి మూడు వారాలు విక్రమ్, అంటే సుందరానికి, రామారావు ఆన్ డ్యూటీ పలకరిస్తాయి. నాలుగో వారం ఖాళీగా ఉంది. పోనీ దాన్ని వాడుకుందాం అంటే ప్రమోషన్ ని ఇప్పటినుంచే మెల్లగా మొదలుపెట్టాలి. కానీ ఆ సూచనలైతే ప్రస్తుతానికి లేవు. ఏకంగా ఆగస్ట్ కి వెళ్లిపోయారా లేదా అంతకన్నా లేటా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చైతు విక్రమ్ కుమార్ ఇద్దరూ వెబ్ సిరీస్ పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. దీనికి దూత అనే టైటిల్ ను లాక్ చేశారు.
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…