Movie News

చరణ్ మరిచిపోలేని 18 రోజులు

మెగాస్టార్ చిరంజీవితో ఆయన తనయుడు రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. ఇంకో వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చరణ్.. తన తండ్రితో కలిసి నటించిన అరుదైన అనుభవం గురించి మాట్లాడాడు. కొన్నేళ్ల నుంచి ఒకే ఇంట్లో కలిసి లేకపోవడం వల్ల తన తండ్రిని చాలా మిస్ అవుతున్నానని.. ఐతే ‘ఆచార్య’ కారణంగా ఇద్దరం చాలా కాలం తర్వాత ఒకే ఇంట్లో వరుసగా 18 రోజులు ఉన్నామని.. ఆ 18 రోజులు తనకు మరపురానివని చరణ్ వెల్లడించాడు. 

దీని గురించి చరణ్ మరింత వివరిస్తూ.. ‘‘ఇంటి నిర్మాణ పనుల వల్ల గత నాలుగేళ్లుగా నేను, నాన్న దూరంగా ఉంటున్నాం. వీకెండ్స్‌లో, అప్పుడప్పుడూ కలుస్తుంటాం కానీ.. ఇంతకుముందులా ఒకే చోట కలిసి లేమన్న వెలితి ఉండేది. ఇలాంటి సమయంలో ‘ఆచార్య’ చిత్రీకరణ కోసం నేను, నాన్న మాత్రమే ఒకే కాటేజీలో 18 రోజులు ఉండే అవకాశం వచ్చింది. అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన సన్నివేశం కోసం మేమిద్దరం ఒక కాటేజీలో ఉన్నాం.

అప్పుడు రోజూ ఇద్దరం ఒకేసారి నిద్ర లేవడం.. వర్కవుట్లు చేయడం.. బ్రేక్ ఫాస్ట్ చేయడం.. షూటింగ్‌కు వెళ్లి పని పూర్తి చేసుకుని సాయంత్రం తిరిగి కాటేజీకి రావడం కబుర్లు చెప్పుకుని, భోజనం చేసి పడుకోవడం.. ఇలా 18 రోజులు ఒకేలా సాగాయి. ఆ మధుర క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను.

మధ్యలో నాన్న ఒక రోజు నా దగ్గరికి వచ్చి.. ‘చరణ్.. పనిలో బిజీగా ఉండడం వల్ల మనిద్దరం ఇలా కలిసి ఉండే అవకాశం ఎప్పుడో కానీ రాదు. నేను కూడా నీకోసం ఇంత సమయాన్ని మళ్లీ ఎప్పుడు కేటాయించగలనో తెలియదు. ఆచార్య వల్ల మనకీ అవకాశం వచ్చింది. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేద్దాం’ అని చెప్పారు. ఆ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను సరే అని చెప్పా. అనుకున్నట్లే ఆ 18 రోజుల్ని మేం చాలా ఎంజాయ్ చేశాం’’ అని చరణ్ వివరించాడు.

This post was last modified on April 21, 2022 10:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

47 minutes ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

2 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

2 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago