మెగాస్టార్ చిరంజీవితో ఆయన తనయుడు రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. ఇంకో వారం రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చరణ్.. తన తండ్రితో కలిసి నటించిన అరుదైన అనుభవం గురించి మాట్లాడాడు. కొన్నేళ్ల నుంచి ఒకే ఇంట్లో కలిసి లేకపోవడం వల్ల తన తండ్రిని చాలా మిస్ అవుతున్నానని.. ఐతే ‘ఆచార్య’ కారణంగా ఇద్దరం చాలా కాలం తర్వాత ఒకే ఇంట్లో వరుసగా 18 రోజులు ఉన్నామని.. ఆ 18 రోజులు తనకు మరపురానివని చరణ్ వెల్లడించాడు.
దీని గురించి చరణ్ మరింత వివరిస్తూ.. ‘‘ఇంటి నిర్మాణ పనుల వల్ల గత నాలుగేళ్లుగా నేను, నాన్న దూరంగా ఉంటున్నాం. వీకెండ్స్లో, అప్పుడప్పుడూ కలుస్తుంటాం కానీ.. ఇంతకుముందులా ఒకే చోట కలిసి లేమన్న వెలితి ఉండేది. ఇలాంటి సమయంలో ‘ఆచార్య’ చిత్రీకరణ కోసం నేను, నాన్న మాత్రమే ఒకే కాటేజీలో 18 రోజులు ఉండే అవకాశం వచ్చింది. అటవీ ప్రాంతంలో చిత్రీకరించిన సన్నివేశం కోసం మేమిద్దరం ఒక కాటేజీలో ఉన్నాం.
అప్పుడు రోజూ ఇద్దరం ఒకేసారి నిద్ర లేవడం.. వర్కవుట్లు చేయడం.. బ్రేక్ ఫాస్ట్ చేయడం.. షూటింగ్కు వెళ్లి పని పూర్తి చేసుకుని సాయంత్రం తిరిగి కాటేజీకి రావడం కబుర్లు చెప్పుకుని, భోజనం చేసి పడుకోవడం.. ఇలా 18 రోజులు ఒకేలా సాగాయి. ఆ మధుర క్షణాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను.
మధ్యలో నాన్న ఒక రోజు నా దగ్గరికి వచ్చి.. ‘చరణ్.. పనిలో బిజీగా ఉండడం వల్ల మనిద్దరం ఇలా కలిసి ఉండే అవకాశం ఎప్పుడో కానీ రాదు. నేను కూడా నీకోసం ఇంత సమయాన్ని మళ్లీ ఎప్పుడు కేటాయించగలనో తెలియదు. ఆచార్య వల్ల మనకీ అవకాశం వచ్చింది. ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చేద్దాం’ అని చెప్పారు. ఆ మాటలకు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నేను సరే అని చెప్పా. అనుకున్నట్లే ఆ 18 రోజుల్ని మేం చాలా ఎంజాయ్ చేశాం’’ అని చరణ్ వివరించాడు.
This post was last modified on April 21, 2022 10:49 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…