ప్రభాస్ తాజా చిత్రం అప్డేట్ వచ్చేస్తుంది అంటూ కొద్ది రోజులుగా సందడి జరుగుతోంది. మొత్తానికి తమ మొర ఆలకించారని ఫాన్స్ సంతోషపడ్డారు. ఈ చిత్రానికి రాధే శ్యామ్ అనే టైటిల్ అనధికారికంగా ఖరారైపోయింది. ఇక పోస్టర్ రావడమే తరువాయి అనుకున్నారు కానీ ఇప్పుడు ఈ చిత్రానికి పోస్టర్ రిలీజ్ కంటే మించిన తలపోట్లు నిర్మాతల ముందు ఉన్నాయి.
విదేశాల్లో షూటింగ్ చేయక తప్పని కథ కావడంతో సెట్స్ వేసి మేనేజ్ చేయాలని అనుకున్నారు. అయితే అది కొద్ది మేర మాత్రమే సాధ్యమవుతుంది. సో, తప్పనిసరిగా విదేశాలకు వెళ్లి తీరాల్సిందేనట. ఇకపోతే తెలంగాణాలో కరోనా కోరలు చాస్తున్న వేళ షూటింగ్ మొదలు పెట్టడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
హోమ్ బ్యానర్ కనుక ప్రభాస్ అందుబాటులో ఉన్నా కానీ మిగతా వాళ్ళను తీసుకురావడం కుదరడం లేదు. ఇప్పటికే ఈ చిత్రం కోసం కొన్ని ఫ్లోర్స్ బుక్ చేసి సెట్ వర్క్ మొదలు పెట్టారు. షూటింగ్ విషయంలో క్లారిటీ లేక తలపట్టుకున్నారు. ఈ సమయంలో ఫాన్స్ ఆనందం కోసం పోస్టర్లు విడుదల చేసే మూడ్ ఎవరికీ లేదు. కనుక ఈ సినిమా విశేషాల కోసం మరిన్ని రోజుల నిరీక్షణ తప్పదు.
This post was last modified on June 23, 2020 7:13 pm
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి…