వేరే భాషల్లో కొత్తగా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులెవరైనా కనిపిస్తే వెంటనే తెలుగు దర్శకుల కళ్లు వారి మీద పడిపోతుంటాయి. సాధ్యమైనంత త్వరగా వాళ్లను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులోనూ సంగీత పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే దర్శకులు.. దక్షిణాదిన అన్ని ఇండస్ట్రీల మీదా ఓ కన్నేసి ఉంచుతారు. ముఖ్యంగా తమిళం, మలయాళం నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను దిగుమతి చేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే.
గతంతో పోలిస్తే మలయాళం నుంచి తెలుగులోకి ఎక్కువ సంఖ్యలో సంగీత దర్శకులు వస్తున్నారు. గోపీసుందర్, జేక్స్ బిజోయ్, గోవింద్ వసంత.. ఈ కోవలోని వారే. ఇప్పుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ అనే మరో మంచి సంగీత దర్శకుడు తెలుగులోకి అడుగు పెడతున్నాడు.
హృదయం.. ఈ ఏడాది మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శిన, దర్శన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్ తరహాలో సాగుతూ యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు హేషమ్ అబ్దుల్. ఈ సినిమా రిలీజ్ తర్వాత అతడి కోసం ఆరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలుగు నుంచి ఓ పేరున్న సినిమాకు అతను సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.
ఆ చిత్రమే.. ఖుషి. ఈ టైటిల్తో విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్కు వెళ్లనుంది. ముందు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు హేషమ్ను ఎంచుకున్నారు. అతడి నుంచి ఈ సినిమాలో మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ రాబోతున్నట్లే.
This post was last modified on April 21, 2022 10:04 am
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…