వేరే భాషల్లో కొత్తగా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులెవరైనా కనిపిస్తే వెంటనే తెలుగు దర్శకుల కళ్లు వారి మీద పడిపోతుంటాయి. సాధ్యమైనంత త్వరగా వాళ్లను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులోనూ సంగీత పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే దర్శకులు.. దక్షిణాదిన అన్ని ఇండస్ట్రీల మీదా ఓ కన్నేసి ఉంచుతారు. ముఖ్యంగా తమిళం, మలయాళం నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను దిగుమతి చేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే.
గతంతో పోలిస్తే మలయాళం నుంచి తెలుగులోకి ఎక్కువ సంఖ్యలో సంగీత దర్శకులు వస్తున్నారు. గోపీసుందర్, జేక్స్ బిజోయ్, గోవింద్ వసంత.. ఈ కోవలోని వారే. ఇప్పుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ అనే మరో మంచి సంగీత దర్శకుడు తెలుగులోకి అడుగు పెడతున్నాడు.
హృదయం.. ఈ ఏడాది మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శిన, దర్శన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్ తరహాలో సాగుతూ యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు హేషమ్ అబ్దుల్. ఈ సినిమా రిలీజ్ తర్వాత అతడి కోసం ఆరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలుగు నుంచి ఓ పేరున్న సినిమాకు అతను సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.
ఆ చిత్రమే.. ఖుషి. ఈ టైటిల్తో విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్కు వెళ్లనుంది. ముందు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు హేషమ్ను ఎంచుకున్నారు. అతడి నుంచి ఈ సినిమాలో మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ రాబోతున్నట్లే.
This post was last modified on April 21, 2022 10:04 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…