వేరే భాషల్లో కొత్తగా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులెవరైనా కనిపిస్తే వెంటనే తెలుగు దర్శకుల కళ్లు వారి మీద పడిపోతుంటాయి. సాధ్యమైనంత త్వరగా వాళ్లను తెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులోనూ సంగీత పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే దర్శకులు.. దక్షిణాదిన అన్ని ఇండస్ట్రీల మీదా ఓ కన్నేసి ఉంచుతారు. ముఖ్యంగా తమిళం, మలయాళం నుంచి మ్యూజిక్ డైరెక్టర్లను దిగుమతి చేసుకోవడం ఎప్పట్నుంచో ఉన్నదే.
గతంతో పోలిస్తే మలయాళం నుంచి తెలుగులోకి ఎక్కువ సంఖ్యలో సంగీత దర్శకులు వస్తున్నారు. గోపీసుందర్, జేక్స్ బిజోయ్, గోవింద్ వసంత.. ఈ కోవలోని వారే. ఇప్పుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ అనే మరో మంచి సంగీత దర్శకుడు తెలుగులోకి అడుగు పెడతున్నాడు.
హృదయం.. ఈ ఏడాది మలయాళంలో సంచలన విజయం సాధించిన చిత్రం. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శిన, దర్శన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నా ఆటోగ్రాఫ్, ప్రేమమ్ తరహాలో సాగుతూ యువ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు హేషమ్ అబ్దుల్. ఈ సినిమా రిలీజ్ తర్వాత అతడి కోసం ఆరాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తెలుగు నుంచి ఓ పేరున్న సినిమాకు అతను సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు.
ఆ చిత్రమే.. ఖుషి. ఈ టైటిల్తో విజయ్ దేవరకొండ, సమంత, శివ నిర్వాణ కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్కు వెళ్లనుంది. ముందు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడు హేషమ్ను ఎంచుకున్నారు. అతడి నుంచి ఈ సినిమాలో మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ రాబోతున్నట్లే.
This post was last modified on April 21, 2022 10:04 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…