కేఆర్కే.. విడమరిచి చెబితే కణ్మణి రాంబో ఖటీజా. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి, సమంతల కలయికలో నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ రూపొందించిన చిత్రమిది. నయన్, సేతుపతి, సామ్ల కాంబినేషన్లో సినిమా అనగానే ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఇక ఇదొక టిపికల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కడం, దీని ప్రోమోలు ఇంకా క్యూరియాసిటీని పెంచాయి.
తెలుగు వరకు చూస్తే.. ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సమంతనే అనడంలో సందేహం లేదు. పెళ్లవడానికి ముందు, తర్వాత ట్రెడిషనల్ రోల్స్లోకి మారిపోయిన సామ్.. విడాకుల తర్వాత ఉన్నట్లుండి గ్లామర్ డోస్ పెంచేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. పుష్పలో ఊ అంటావా పాటలో ఆమె ఎలా రెచ్చిపోయిందో తెలిసిందే.
ఐతే సెకండ్ ఇన్నింగ్స్లో ఇది జస్ట్ టీజర్ మాత్రమే.. అసలు సినిమా ముందుందేమో అనిపిస్తోంది కేఆర్కే ప్రోమోల్లో ఆమె దూకుడు చూస్తే. ఇంతకు సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేస్తే.. అందులో నయనతార ఏమో చీరలో చాలా పద్ధతిగా కనిపించింది. కానీ సామ్ మాత్రం మోడర్న్ డ్రెస్లో క్లీవేజ్ షో చేసింది. ఈ విషయంలో విఘ్నేష్ శివన్ను నెటిజన్లు ట్రోల్ చేశారు కూడా. తాజాగా ఈ సినిమా నుంచి డిప్పం డప్పం అనే పాట ఒకటి రిలీజ్ చేశారు. ఇది పూర్తిగా సేతుపతి, సామ్ల మీద తీసిన పాట.
ఈ పాటలో సామ్ మరింత ఘాటైన లుక్స్తో కనిపించింది. ఈ సినిమా అంతటా ఆమె గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతోందని, తన పాత్ర కూడా ఆ తరహాలోనే ఉంటుందని ఈ పాట చూశాక అర్థమవుతోంది. ప్రోమోల్లో తన గ్లామరే తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా వైపు ఆకర్షిస్తోందనడంలో సందేహం లేదు. మంచి ఫన్ ఎంటర్టైనర్లా కనిపిస్తున్న ఈ చిత్రం ఆచార్య లాంటి భారీ చిత్రానికి పోటీగా ఈ నెల 28న రిలీజవుతోంది. మరి సామ్ ఆకర్షణ ఏమాత్రం పని చేస్తుందో చూడాలి.
This post was last modified on April 21, 2022 8:26 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…