#worstteamSVP.. రెండు రోజుల నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇక్కడ SVP అంటే ‘సర్కారు వారి పాట’కు సంక్షిప్త నామం. మహేష్ సినిమా మీద ఇలా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారంటే.. ఇదేదో యాంటీ ఫ్యాన్స్ పని అనుకుంటే పొరబాటే. ఈ హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది మహేష్ బాబు అభిమానులే. వారి కోపం మహేష్ మీద కాదు.. నిర్మాతల మీద.
ఈ సినిమా నుంచి సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడం.. అసలు ప్రమోషన్లే లేకపోవడంతో వారికి మండిపోయి ఇలా తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ మీద అంతకంతకూ ట్వీట్లు పెరిగిపోయి.. నేషనల్ లెవెల్లో ఇది ట్రెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ట్వీట్లలో కంటెంట్ చూస్తే తట్టుకోవడం కష్టమే. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలను బూతులు తిట్టేసి, వారిని తెగ ట్రోల్ చేస్తున్నారు మహేష్ అభిమానులు.
‘సర్కారు వారి పాట’ విడుదలకు ఇంకో మూడు వారాలే సమయం ఉంది. ఐతే ఈ టైంలో చేయాల్సిన స్థాయిలో ప్రమోషన్లు చేయట్లేదని.. కొత్త పాటల ఊసే లేదని.. ట్రైలర్ ఎప్పుడో చెప్పట్లేదని.. ప్రి రిలీజ్ ముచ్చట్లేవీ లేదని మహేష్ అభిమానులు ఫీలవుతున్నారు. వేరే పెద్ద సినిమాలను ఎలా ప్రమోట్ చేశారో ఉదాహరణలు చూపిస్తూ.. అలా చేసి హైప్ పెంచకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ నుంచి ఇప్పటికి రెండు పాటలు రిలీజయ్యాయి. అందులో కళావతి పాట బాగానే మార్మోగింది. కానీ పెన్నీ సాంగ్కు సరైన రెస్పాన్స్ రాలేదు. దీంతో సినిమా గురించి ఇప్పుడు ఎక్కడా పెద్ద చర్చ జరగట్లేదు.
ఈ నేపథ్యంలోనే మైత్రీ అధినేతల్లో చురుకుపుట్టాలన్న ఉద్దేశంతో ఇలా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. మహేష్ ఫ్యాన్స్ కోపం చూసి మైత్రీ వాళ్లు అలెర్టయినట్లే ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘సర్కారు వారి పాట’ చివరి సాంగ్కు సంబంధించి ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని రిలీజ్ చేసి అదిరిపోయే మాస్ సాంగ్ రెడీ అవుతోందంటూ అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇక నుంచి ఇదే ఊపును కొనసాగిస్తూ రిలీజ్ వరకు అభిమానులు మెచ్చేలా ప్రమోషన్లు చేస్తారేమో చూడాలి.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…