#worstteamSVP.. రెండు రోజుల నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇక్కడ SVP అంటే ‘సర్కారు వారి పాట’కు సంక్షిప్త నామం. మహేష్ సినిమా మీద ఇలా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారంటే.. ఇదేదో యాంటీ ఫ్యాన్స్ పని అనుకుంటే పొరబాటే. ఈ హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది మహేష్ బాబు అభిమానులే. వారి కోపం మహేష్ మీద కాదు.. నిర్మాతల మీద.
ఈ సినిమా నుంచి సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడం.. అసలు ప్రమోషన్లే లేకపోవడంతో వారికి మండిపోయి ఇలా తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ మీద అంతకంతకూ ట్వీట్లు పెరిగిపోయి.. నేషనల్ లెవెల్లో ఇది ట్రెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ట్వీట్లలో కంటెంట్ చూస్తే తట్టుకోవడం కష్టమే. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలను బూతులు తిట్టేసి, వారిని తెగ ట్రోల్ చేస్తున్నారు మహేష్ అభిమానులు.
‘సర్కారు వారి పాట’ విడుదలకు ఇంకో మూడు వారాలే సమయం ఉంది. ఐతే ఈ టైంలో చేయాల్సిన స్థాయిలో ప్రమోషన్లు చేయట్లేదని.. కొత్త పాటల ఊసే లేదని.. ట్రైలర్ ఎప్పుడో చెప్పట్లేదని.. ప్రి రిలీజ్ ముచ్చట్లేవీ లేదని మహేష్ అభిమానులు ఫీలవుతున్నారు. వేరే పెద్ద సినిమాలను ఎలా ప్రమోట్ చేశారో ఉదాహరణలు చూపిస్తూ.. అలా చేసి హైప్ పెంచకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ నుంచి ఇప్పటికి రెండు పాటలు రిలీజయ్యాయి. అందులో కళావతి పాట బాగానే మార్మోగింది. కానీ పెన్నీ సాంగ్కు సరైన రెస్పాన్స్ రాలేదు. దీంతో సినిమా గురించి ఇప్పుడు ఎక్కడా పెద్ద చర్చ జరగట్లేదు.
ఈ నేపథ్యంలోనే మైత్రీ అధినేతల్లో చురుకుపుట్టాలన్న ఉద్దేశంతో ఇలా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. మహేష్ ఫ్యాన్స్ కోపం చూసి మైత్రీ వాళ్లు అలెర్టయినట్లే ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘సర్కారు వారి పాట’ చివరి సాంగ్కు సంబంధించి ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని రిలీజ్ చేసి అదిరిపోయే మాస్ సాంగ్ రెడీ అవుతోందంటూ అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇక నుంచి ఇదే ఊపును కొనసాగిస్తూ రిలీజ్ వరకు అభిమానులు మెచ్చేలా ప్రమోషన్లు చేస్తారేమో చూడాలి.
This post was last modified on April 19, 2022 3:08 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…