#worstteamSVP.. రెండు రోజుల నుంచి ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్ ఇది. ఇక్కడ SVP అంటే ‘సర్కారు వారి పాట’కు సంక్షిప్త నామం. మహేష్ సినిమా మీద ఇలా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రెండ్ చేస్తున్నారంటే.. ఇదేదో యాంటీ ఫ్యాన్స్ పని అనుకుంటే పొరబాటే. ఈ హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది మహేష్ బాబు అభిమానులే. వారి కోపం మహేష్ మీద కాదు.. నిర్మాతల మీద.
ఈ సినిమా నుంచి సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడం.. అసలు ప్రమోషన్లే లేకపోవడంతో వారికి మండిపోయి ఇలా తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ మీద అంతకంతకూ ట్వీట్లు పెరిగిపోయి.. నేషనల్ లెవెల్లో ఇది ట్రెండ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ట్వీట్లలో కంటెంట్ చూస్తే తట్టుకోవడం కష్టమే. మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలను బూతులు తిట్టేసి, వారిని తెగ ట్రోల్ చేస్తున్నారు మహేష్ అభిమానులు.
‘సర్కారు వారి పాట’ విడుదలకు ఇంకో మూడు వారాలే సమయం ఉంది. ఐతే ఈ టైంలో చేయాల్సిన స్థాయిలో ప్రమోషన్లు చేయట్లేదని.. కొత్త పాటల ఊసే లేదని.. ట్రైలర్ ఎప్పుడో చెప్పట్లేదని.. ప్రి రిలీజ్ ముచ్చట్లేవీ లేదని మహేష్ అభిమానులు ఫీలవుతున్నారు. వేరే పెద్ద సినిమాలను ఎలా ప్రమోట్ చేశారో ఉదాహరణలు చూపిస్తూ.. అలా చేసి హైప్ పెంచకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ నుంచి ఇప్పటికి రెండు పాటలు రిలీజయ్యాయి. అందులో కళావతి పాట బాగానే మార్మోగింది. కానీ పెన్నీ సాంగ్కు సరైన రెస్పాన్స్ రాలేదు. దీంతో సినిమా గురించి ఇప్పుడు ఎక్కడా పెద్ద చర్చ జరగట్లేదు.
ఈ నేపథ్యంలోనే మైత్రీ అధినేతల్లో చురుకుపుట్టాలన్న ఉద్దేశంతో ఇలా నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్రోల్ చేశారు. మహేష్ ఫ్యాన్స్ కోపం చూసి మైత్రీ వాళ్లు అలెర్టయినట్లే ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ‘సర్కారు వారి పాట’ చివరి సాంగ్కు సంబంధించి ఆన్ లొకేషన్ పిక్స్ కొన్ని రిలీజ్ చేసి అదిరిపోయే మాస్ సాంగ్ రెడీ అవుతోందంటూ అభిమానులను కూల్ చేసే ప్రయత్నం చేశారు. మరి ఇక నుంచి ఇదే ఊపును కొనసాగిస్తూ రిలీజ్ వరకు అభిమానులు మెచ్చేలా ప్రమోషన్లు చేస్తారేమో చూడాలి.
This post was last modified on April 19, 2022 3:08 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…