Movie News

బాహుబలికి ముందు అనుకున్న లైన్

బాహుబలి.. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఇండియన్ సినిమాను బాహుబలికి ముందు, తర్వాత అని విభజించి చూడాల్సిన స్థాయిలో ఆ చిత్రం ప్రభావం చూపించింది అనడంలో సందేహం లేదు. ఏ ముహూర్తాన రాజమౌళి ఈ సినిమా గురించి ఆలోచన చేశాడో కానీ.. ఆ చిత్రం రేపిన సంచలనం అలాంటిలాంటిది కాదు. మరి ఈ కథకు రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కలిసి ఎలా శ్రీకారం చుట్టారు. ఈ కథ ఎలా పుట్టింది.. దీన్ని ఎలా విస్తరించారు అన్నది ఆసక్తికరం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి’ కథ ఎలా పురుడు పోసుకుందో వివరించారు. సినిమాలో చూసిందానికి కొంచెం భిన్నంగా ఒక లైన్ తాను ముందుగా రాజమౌళికి చెబితే.. అక్కడి నుంచి కథా విస్తరణ జరిగినట్లు ఆయన వివరించారు. ఈ కథకు మూలం కట్టప్ప పాత్ర అని కూడా ఆయన వెల్లడించారు.

‘బాహుబలి: ది బిగినింగ్’లో సుదీప్-సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశం గుర్తుంది కదా. ‘బాహుబలి’ కథ ఆ సన్నివేశంతోనే మొదలు పెట్టామని.. కానీ అప్పుడు అనుకున్న సన్నివేశం వేరని ఆయన వివరించారు. తాను ఒక భారీ చిత్రం చేయాలనుకుంటున్నానని.. అందుకు బాగా యాక్షన్ నిండిన కథ కావాలని, భారీతనం ఉండాలని, బలమైన క్యారెక్టర్లు ఉండాలని ముందుగా తనకు రాజమౌళి చెప్పినట్లు విజయేంద్ర వెల్లడించారు.

ఇక తాను రాజమౌళికి చెప్పిన తొలి సన్నివేశం గురించి వివరిస్తూ.. ‘‘విదేశాల నుంచి ఒక వర్తకుడు వచ్చాడు ఆయుధాలు అమ్ముకోవడానికి. చూస్తే 80 సంవత్సరాల వయసున్న పెద్దాయన పిల్లలకు కత్తి యుద్ధం నేర్పిస్తున్నాడు. అది చూసి మీరు గొప్ప వీరుడిలా ఉన్నాడే అని మాట కలిపితే.. మీకు బాహుబలి గురించి తెలియదా? అని అడుగుతాడు. ఎవరాయన అని ప్రశ్నిస్తే.. తామిద్దరం కలిసి చాలా ఏళ్లు సాధనం చేశాం.. యుద్ధాలు చేశాం అని వివరిస్తాడు. ఒకసారి అడవిలో వెళ్తుండగా 200 మంది ఒకేసారి వచ్చి దాడి చేశారు. వాళ్లతో అతను యుద్ధం చేస్తుంటే మహాభారతంలో అర్జునుడు ఇలాగే ఫైట్ చేసేవాడేమో అనిపించింది. సాయంత్రం అయ్యేసరికి రక్తంలో తడిసి ముద్దయ్యాడు. కానీ అతడి ఒంటి మీద ఉన్న ఒక్క రక్తపు చుక్క కూడా అతడిది కాదు. ఎందుకంటే ఒంటి మీద గాటు పెట్టగల వీరుడు పుట్టలేదు అని ఆ ముసలాయన వివరిస్తాడు. అంతటి వీరుడిని ఒకసారి చూడాలి అని ఆ వర్తకుడు అడిగితే.. బాధగా ముఖం పెట్టి చనిపోయాడు అంటాడు. మరి ఎవ్వరూ అతణ్ని తాకలేరు అన్నారు ఎలా చనిపోయాడు అంటే.. కత్తి పోటు కన్నా వెన్నుపోటు బలమైంది. ఆయన్ని నేనే చంపేశా అంటాడు’’ అని చెప్పారు విజయేంద్ర. ఆ తర్వాతి రోజు శివగామి బాహుబలిని నీళ్లలో ఒంటి చేత్తో పైకెత్తుకుని అతడి ప్రాణాలు కాపాడే సన్నివేశం చెప్పానని.. ఇక్కడి నుంచి పాత్రలు, కథ విస్తరణ జరిగిందని విజయేంద్ర చెప్పారు.

This post was last modified on April 16, 2022 3:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కు జ్వరం.. రేపు భేటీ డౌట్

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…

11 hours ago

విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు పెట్టండి: హైకోర్టు ఆర్డ‌ర్‌

వైసీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీపై కేసు న‌మోదు చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసుల‌ను ఆదేశించింది. ఆమెతోపాటు..…

12 hours ago

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

13 hours ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

13 hours ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

13 hours ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

14 hours ago