Movie News

బాహుబలికి ముందు అనుకున్న లైన్

బాహుబలి.. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఇండియన్ సినిమాను బాహుబలికి ముందు, తర్వాత అని విభజించి చూడాల్సిన స్థాయిలో ఆ చిత్రం ప్రభావం చూపించింది అనడంలో సందేహం లేదు. ఏ ముహూర్తాన రాజమౌళి ఈ సినిమా గురించి ఆలోచన చేశాడో కానీ.. ఆ చిత్రం రేపిన సంచలనం అలాంటిలాంటిది కాదు. మరి ఈ కథకు రాజమౌళి, ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కలిసి ఎలా శ్రీకారం చుట్టారు. ఈ కథ ఎలా పుట్టింది.. దీన్ని ఎలా విస్తరించారు అన్నది ఆసక్తికరం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ‘బాహుబలి’ కథ ఎలా పురుడు పోసుకుందో వివరించారు. సినిమాలో చూసిందానికి కొంచెం భిన్నంగా ఒక లైన్ తాను ముందుగా రాజమౌళికి చెబితే.. అక్కడి నుంచి కథా విస్తరణ జరిగినట్లు ఆయన వివరించారు. ఈ కథకు మూలం కట్టప్ప పాత్ర అని కూడా ఆయన వెల్లడించారు.

‘బాహుబలి: ది బిగినింగ్’లో సుదీప్-సత్యరాజ్ మధ్య వచ్చే సన్నివేశం గుర్తుంది కదా. ‘బాహుబలి’ కథ ఆ సన్నివేశంతోనే మొదలు పెట్టామని.. కానీ అప్పుడు అనుకున్న సన్నివేశం వేరని ఆయన వివరించారు. తాను ఒక భారీ చిత్రం చేయాలనుకుంటున్నానని.. అందుకు బాగా యాక్షన్ నిండిన కథ కావాలని, భారీతనం ఉండాలని, బలమైన క్యారెక్టర్లు ఉండాలని ముందుగా తనకు రాజమౌళి చెప్పినట్లు విజయేంద్ర వెల్లడించారు.

ఇక తాను రాజమౌళికి చెప్పిన తొలి సన్నివేశం గురించి వివరిస్తూ.. ‘‘విదేశాల నుంచి ఒక వర్తకుడు వచ్చాడు ఆయుధాలు అమ్ముకోవడానికి. చూస్తే 80 సంవత్సరాల వయసున్న పెద్దాయన పిల్లలకు కత్తి యుద్ధం నేర్పిస్తున్నాడు. అది చూసి మీరు గొప్ప వీరుడిలా ఉన్నాడే అని మాట కలిపితే.. మీకు బాహుబలి గురించి తెలియదా? అని అడుగుతాడు. ఎవరాయన అని ప్రశ్నిస్తే.. తామిద్దరం కలిసి చాలా ఏళ్లు సాధనం చేశాం.. యుద్ధాలు చేశాం అని వివరిస్తాడు. ఒకసారి అడవిలో వెళ్తుండగా 200 మంది ఒకేసారి వచ్చి దాడి చేశారు. వాళ్లతో అతను యుద్ధం చేస్తుంటే మహాభారతంలో అర్జునుడు ఇలాగే ఫైట్ చేసేవాడేమో అనిపించింది. సాయంత్రం అయ్యేసరికి రక్తంలో తడిసి ముద్దయ్యాడు. కానీ అతడి ఒంటి మీద ఉన్న ఒక్క రక్తపు చుక్క కూడా అతడిది కాదు. ఎందుకంటే ఒంటి మీద గాటు పెట్టగల వీరుడు పుట్టలేదు అని ఆ ముసలాయన వివరిస్తాడు. అంతటి వీరుడిని ఒకసారి చూడాలి అని ఆ వర్తకుడు అడిగితే.. బాధగా ముఖం పెట్టి చనిపోయాడు అంటాడు. మరి ఎవ్వరూ అతణ్ని తాకలేరు అన్నారు ఎలా చనిపోయాడు అంటే.. కత్తి పోటు కన్నా వెన్నుపోటు బలమైంది. ఆయన్ని నేనే చంపేశా అంటాడు’’ అని చెప్పారు విజయేంద్ర. ఆ తర్వాతి రోజు శివగామి బాహుబలిని నీళ్లలో ఒంటి చేత్తో పైకెత్తుకుని అతడి ప్రాణాలు కాపాడే సన్నివేశం చెప్పానని.. ఇక్కడి నుంచి పాత్రలు, కథ విస్తరణ జరిగిందని విజయేంద్ర చెప్పారు.

This post was last modified on April 16, 2022 3:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

11 hours ago