‘కేజీఎఫ్-2’ ప్రభంజనానికి భయపడి హిందీలో ‘జెర్సీ’ లాంటి క్రేజీ మూవీని వాయిదా వేసుకున్నారు దాని నిర్మాతలు. ముందు రిలీజ్కు ధైర్యం చేసినా.. విడుదల దగ్గర పడే సమయానికి వెనుకంజ వేశారు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ‘కేజీఎఫ్-2’ ఊచకోత చూస్తుంటే.. ‘జెర్సీ’ని వాయిదా వేయడం సరైన నిర్ణయమే అని అంతా అంగీకరిస్తున్నారు. ఇగోకు పోకుండా సినిమాను వెనక్కి జరిపి మంచి పని చేశారంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ల మోత మోగిస్తున్నా.. పట్టుదలకు పోయి ఈ నెల ఆరంభంలో ‘ఎటాక్’ అనే సినిమా రిలీజ్ చేస్తే అది దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి సినిమాలకు పోటీగా మంచి విషయం ఉన్న సినిమాలను దించితేనే కష్టం అంటే.. కంటెంట్ లేని వాటిని దించితే ఇంకేమైనా ఉందా? ‘ఎటాక్’ ఇలాగే అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ‘బీస్ట్’ మూవీ పరిస్థితి కూడా ఇలాగే తయారైనట్లుగా కనిపిస్తోంది.
కొన్నేళ్లుగా విజయ్ సినిమాలు తమిళనాడు అవతల కూడా బాగా ఆడుతున్నాయి. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఉత్తరాదిన కూడా అతడి సినిమాలు బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. కానీ ‘బీస్ట్’ సినిమా మాత్రం తమిళనాడు సహా అన్ని చోట్లా చతికిలపడిపోయింది. అసలే కేజీఎఫ్-2తో పోటీ, పైగా సినిమాలో విషయం లేదు.. అలాంటపుడు ప్రేక్షకులు ఈ సినిమా చూడాలని ఎందుకు కోరుకుంటారు? ఫలితమే.. తమిళనాడు అవతల తొలి రోజు వరకు ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టి.. రెండో రోజు నుంచి కనుమరుగైపోయే పరిస్థితి తలెత్తింది.
నార్త్ ఇండియాలో, అలాగే సౌత్లో తమిళనాడు మినహా అన్ని చోట్లా ‘బీస్ట్’ పనైపోయినట్లే కనిపిస్తోంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తమిళనాట కూడా ‘కేజీఎఫ్-2’ దానికి ముప్పు తప్పేట్లు లేదు. విజయ్ స్టార్ ఇమేజ్ వల్ల వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడొచ్చు కానీ.. ఆ తర్వాత నిలబడటం కష్టమే. ‘కేజీఎఫ్-2’కు కూడా కొంత డివైడ్ టాక్ ఉన్నప్పటికీ.. ఎలివేషన్లకు మాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పైగా ‘బీస్ట్’తో పోలిస్తే ఏ రకంగా అయితే ఇది మెరుగే కాబట్టి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే అవుతుంది కదా.
This post was last modified on April 15, 2022 6:14 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…