‘కేజీఎఫ్-2’ ప్రభంజనానికి భయపడి హిందీలో ‘జెర్సీ’ లాంటి క్రేజీ మూవీని వాయిదా వేసుకున్నారు దాని నిర్మాతలు. ముందు రిలీజ్కు ధైర్యం చేసినా.. విడుదల దగ్గర పడే సమయానికి వెనుకంజ వేశారు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ‘కేజీఎఫ్-2’ ఊచకోత చూస్తుంటే.. ‘జెర్సీ’ని వాయిదా వేయడం సరైన నిర్ణయమే అని అంతా అంగీకరిస్తున్నారు. ఇగోకు పోకుండా సినిమాను వెనక్కి జరిపి మంచి పని చేశారంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ వసూళ్ల మోత మోగిస్తున్నా.. పట్టుదలకు పోయి ఈ నెల ఆరంభంలో ‘ఎటాక్’ అనే సినిమా రిలీజ్ చేస్తే అది దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి సినిమాలకు పోటీగా మంచి విషయం ఉన్న సినిమాలను దించితేనే కష్టం అంటే.. కంటెంట్ లేని వాటిని దించితే ఇంకేమైనా ఉందా? ‘ఎటాక్’ ఇలాగే అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పుడు ‘బీస్ట్’ మూవీ పరిస్థితి కూడా ఇలాగే తయారైనట్లుగా కనిపిస్తోంది.
కొన్నేళ్లుగా విజయ్ సినిమాలు తమిళనాడు అవతల కూడా బాగా ఆడుతున్నాయి. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణలో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఉత్తరాదిన కూడా అతడి సినిమాలు బాగానే ప్రభావం చూపిస్తున్నాయి. కానీ ‘బీస్ట్’ సినిమా మాత్రం తమిళనాడు సహా అన్ని చోట్లా చతికిలపడిపోయింది. అసలే కేజీఎఫ్-2తో పోటీ, పైగా సినిమాలో విషయం లేదు.. అలాంటపుడు ప్రేక్షకులు ఈ సినిమా చూడాలని ఎందుకు కోరుకుంటారు? ఫలితమే.. తమిళనాడు అవతల తొలి రోజు వరకు ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టి.. రెండో రోజు నుంచి కనుమరుగైపోయే పరిస్థితి తలెత్తింది.
నార్త్ ఇండియాలో, అలాగే సౌత్లో తమిళనాడు మినహా అన్ని చోట్లా ‘బీస్ట్’ పనైపోయినట్లే కనిపిస్తోంది. థియేటర్లు వెలవెలబోతున్నాయి. తమిళనాట కూడా ‘కేజీఎఫ్-2’ దానికి ముప్పు తప్పేట్లు లేదు. విజయ్ స్టార్ ఇమేజ్ వల్ల వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడొచ్చు కానీ.. ఆ తర్వాత నిలబడటం కష్టమే. ‘కేజీఎఫ్-2’కు కూడా కొంత డివైడ్ టాక్ ఉన్నప్పటికీ.. ఎలివేషన్లకు మాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పైగా ‘బీస్ట్’తో పోలిస్తే ఏ రకంగా అయితే ఇది మెరుగే కాబట్టి ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ ఇదే అవుతుంది కదా.
This post was last modified on April 15, 2022 6:14 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…