ఏప్రిల్ 14న కేజీఎఫ్-2 రిలీజ్. 29న ఏమో ఆచార్య వస్తోంది. మధ్యలో ఖాళీగా ఉన్న వారాన్ని వాడుకోవడానికి ఏ పెద్ద, మీడియం రేంజ్ సినిమా కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ వారంపై చిన్న సినిమాలు కన్నేశాయి. ఇదే మంచి ఛాన్స్ అన్నట్లు మూడు చిన్న చిత్రాలు ఆ వారానికి బెర్తులు బుక్ చేసుకున్నాయి. అందులో ఒకటి విశ్వక్సేన్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం అయితే.. ఇంకోటి నాగశౌర్య మూవీ కృష్ణ వ్రింద విహారి. మరొక చిత్రం.. సుమ ప్రధాన పాత్ర పోషించిన జయమ్మ పంచాయితీ.
ఈ మూడు చిత్రాలకూ కొన్ని వారాల ముందే రిలీజ్ డేట్లు ఖరారయ్యాయి. కొంచెం ఆర్భాటంగానే అనౌన్స్మెంట్లు ఇచ్చారు. ఈ దిశగా కొంత వరకు ప్రమోషన్లు కూడా చేశారు. కానీ ఉన్నట్లుండి ఈ మూడు చిత్రాల మేకర్స్ సైలెంట్ అయిపోయారు. కేజీఎఫ్-2 మేనియాకు భయపడే ఇదంతా.
ఆర్ఆర్ఆర్ సినిమా బాగా ఆడుతుండగా, ఇంకో వారంలో కేజీఎఫ్-2 రాబోతుండగా.. ధైర్యం చేసి గత వారం గని సినిమాను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఫలితం తెలిసిందే. జనాలు ఆ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాక వరుణ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలిచింది. పెద్ద సినిమాల మధ్య పడితే చిన్న, మీడియం సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఈ భారీ చిత్రాలను చూసేందుకు బాగా ఖర్చు పెడుతున్న ప్రేక్షకులు చిన్న సినిమాల కోసం పర్స్ తీయట్లేదు.
కేజీఎఫ్-2 హవా వారానికి పరిమితం అవుతుందా అన్నది చూడాలి. మరోవైపు ఇంకో వారం ఆగితేనేమో ఆచార్య వచ్చేస్తుంది. దాని మీదా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు పెద్ద సినిమాల మధ్య వస్తే ప్రేక్షకుల దృష్టిలో పడటం కష్టం. అందుకే 22వ తేదీకి షెడ్యూల్ అయిన మూడు చిత్రాలూ ప్రస్తుతానికి గప్ చుప్ అయిపోయాయి. కేజీఎఫ్-2 ఫైనల్ టాక్, బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ను బట్టి వాటి రిలీజ్ ఆధారపడి ఉంటుంది.
This post was last modified on April 14, 2022 10:15 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…