ఏప్రిల్ 14న కేజీఎఫ్-2 రిలీజ్. 29న ఏమో ఆచార్య వస్తోంది. మధ్యలో ఖాళీగా ఉన్న వారాన్ని వాడుకోవడానికి ఏ పెద్ద, మీడియం రేంజ్ సినిమా కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ వారంపై చిన్న సినిమాలు కన్నేశాయి. ఇదే మంచి ఛాన్స్ అన్నట్లు మూడు చిన్న చిత్రాలు ఆ వారానికి బెర్తులు బుక్ చేసుకున్నాయి. అందులో ఒకటి విశ్వక్సేన్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణం అయితే.. ఇంకోటి నాగశౌర్య మూవీ కృష్ణ వ్రింద విహారి. మరొక చిత్రం.. సుమ ప్రధాన పాత్ర పోషించిన జయమ్మ పంచాయితీ.
ఈ మూడు చిత్రాలకూ కొన్ని వారాల ముందే రిలీజ్ డేట్లు ఖరారయ్యాయి. కొంచెం ఆర్భాటంగానే అనౌన్స్మెంట్లు ఇచ్చారు. ఈ దిశగా కొంత వరకు ప్రమోషన్లు కూడా చేశారు. కానీ ఉన్నట్లుండి ఈ మూడు చిత్రాల మేకర్స్ సైలెంట్ అయిపోయారు. కేజీఎఫ్-2 మేనియాకు భయపడే ఇదంతా.
ఆర్ఆర్ఆర్ సినిమా బాగా ఆడుతుండగా, ఇంకో వారంలో కేజీఎఫ్-2 రాబోతుండగా.. ధైర్యం చేసి గత వారం గని సినిమాను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఫలితం తెలిసిందే. జనాలు ఆ సినిమా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాక వరుణ్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్గా నిలిచింది. పెద్ద సినిమాల మధ్య పడితే చిన్న, మీడియం సినిమాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఈ భారీ చిత్రాలను చూసేందుకు బాగా ఖర్చు పెడుతున్న ప్రేక్షకులు చిన్న సినిమాల కోసం పర్స్ తీయట్లేదు.
కేజీఎఫ్-2 హవా వారానికి పరిమితం అవుతుందా అన్నది చూడాలి. మరోవైపు ఇంకో వారం ఆగితేనేమో ఆచార్య వచ్చేస్తుంది. దాని మీదా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ రెండు పెద్ద సినిమాల మధ్య వస్తే ప్రేక్షకుల దృష్టిలో పడటం కష్టం. అందుకే 22వ తేదీకి షెడ్యూల్ అయిన మూడు చిత్రాలూ ప్రస్తుతానికి గప్ చుప్ అయిపోయాయి. కేజీఎఫ్-2 ఫైనల్ టాక్, బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ను బట్టి వాటి రిలీజ్ ఆధారపడి ఉంటుంది.
This post was last modified on April 14, 2022 10:15 pm
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…