కరోనా వైరస్ క్రైసిస్ లో సినిమా షూటింగ్స్ జరగడం లేదు. ఒకటీ అరా చిన్న సినిమాల షూటింగ్స్ మినహా టాలీవుడ్ ఇంకా లాక్ డౌన్ లోనే ఉంది. ప్రస్తుతం పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల షూటింగ్స్ పట్ల నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ పై నిర్మాణ సంస్థలు దృష్టి పెడుతున్నాయి.
సురేష్ బాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నా కానీ కార్యాచరణలో పెట్టలేదు. గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో మాత్రమే ఈ సందడి బాగా కనిపిస్తోంది. అల్లు అరవింద్ కి ఆహా స్ట్రీమింగ్ యాప్ ఉండడంతో కంటెంట్ కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రైసిస్ లో దర్శకులు కూడా ఓటిటీ ఇంపార్టెన్స్ తెలుసుకోవడంతో పలువురితో జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
త్వరలోనే ఆహా నుంచి అరడజను వెబ్ సిరీస్, ఒక పది చిన్న సినిమాలు మొదలు కానున్నాయి. దీనికి ప్రణాళిక జరిగిపోయింది. సినిమాలు మాములుగా చేసినా సరే, ఇకపై ఓటిటీ కోసం కంటెంట్ కూడా పెద్ద స్థాయిలో చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి ఈ ట్రెండ్ లో బిగ్ ప్లేయర్ అల్లు అరవింద్ కాబోతున్నారు.
‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…
అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…
రెండో సినిమా మగధీరతోనే తాను తండ్రికి తగ్గ తనయుడిని అని చాటుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక…
ఏపీ ప్రభుత్వానికి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు కూడా ఓ కేసు సవాల్గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…
ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…
ఈ రోజుల్లో ఏ సినిమా ఎలా ఆడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడేస్తాయన్న గ్యారెంటీ…