కరోనా వైరస్ క్రైసిస్ లో సినిమా షూటింగ్స్ జరగడం లేదు. ఒకటీ అరా చిన్న సినిమాల షూటింగ్స్ మినహా టాలీవుడ్ ఇంకా లాక్ డౌన్ లోనే ఉంది. ప్రస్తుతం పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల షూటింగ్స్ పట్ల నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ పై నిర్మాణ సంస్థలు దృష్టి పెడుతున్నాయి.
సురేష్ బాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నా కానీ కార్యాచరణలో పెట్టలేదు. గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో మాత్రమే ఈ సందడి బాగా కనిపిస్తోంది. అల్లు అరవింద్ కి ఆహా స్ట్రీమింగ్ యాప్ ఉండడంతో కంటెంట్ కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రైసిస్ లో దర్శకులు కూడా ఓటిటీ ఇంపార్టెన్స్ తెలుసుకోవడంతో పలువురితో జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
త్వరలోనే ఆహా నుంచి అరడజను వెబ్ సిరీస్, ఒక పది చిన్న సినిమాలు మొదలు కానున్నాయి. దీనికి ప్రణాళిక జరిగిపోయింది. సినిమాలు మాములుగా చేసినా సరే, ఇకపై ఓటిటీ కోసం కంటెంట్ కూడా పెద్ద స్థాయిలో చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి ఈ ట్రెండ్ లో బిగ్ ప్లేయర్ అల్లు అరవింద్ కాబోతున్నారు.
This post was last modified on June 22, 2020 1:50 pm
ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…