కరోనా వైరస్ క్రైసిస్ లో సినిమా షూటింగ్స్ జరగడం లేదు. ఒకటీ అరా చిన్న సినిమాల షూటింగ్స్ మినహా టాలీవుడ్ ఇంకా లాక్ డౌన్ లోనే ఉంది. ప్రస్తుతం పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల షూటింగ్స్ పట్ల నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా వెబ్ సిరీస్ పై నిర్మాణ సంస్థలు దృష్టి పెడుతున్నాయి.
సురేష్ బాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నా కానీ కార్యాచరణలో పెట్టలేదు. గీత ఆర్ట్స్ కాంపౌండ్ లో మాత్రమే ఈ సందడి బాగా కనిపిస్తోంది. అల్లు అరవింద్ కి ఆహా స్ట్రీమింగ్ యాప్ ఉండడంతో కంటెంట్ కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రైసిస్ లో దర్శకులు కూడా ఓటిటీ ఇంపార్టెన్స్ తెలుసుకోవడంతో పలువురితో జూమ్ మీటింగ్స్ నిర్వహిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
త్వరలోనే ఆహా నుంచి అరడజను వెబ్ సిరీస్, ఒక పది చిన్న సినిమాలు మొదలు కానున్నాయి. దీనికి ప్రణాళిక జరిగిపోయింది. సినిమాలు మాములుగా చేసినా సరే, ఇకపై ఓటిటీ కోసం కంటెంట్ కూడా పెద్ద స్థాయిలో చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి ఈ ట్రెండ్ లో బిగ్ ప్లేయర్ అల్లు అరవింద్ కాబోతున్నారు.
This post was last modified on June 22, 2020 1:50 pm
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…